అమృత ఘడియ
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తూ.... భారతావని స్వతంత్ర దేశంగా రెక్కలు విప్పుకున్న వేళ... నేటి తరంలోని చాలామంది పుట్టి ఉండకపోవచ్చు! ఆ మధుర క్షణాలను
స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ ఆసేతు హిమాచలం పులకింత
వేడుకలకు జాతి సిద్ధం
సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఎర్రకోట
వరుసగా తొమ్మిదోసారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా ప్రాజెక్టుల ప్రకటన!
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తూ.... భారతావని స్వతంత్ర దేశంగా రెక్కలు విప్పుకున్న వేళ... నేటి తరంలోని చాలామంది పుట్టి ఉండకపోవచ్చు! ఆ మధుర క్షణాలను అస్వాదించి ఉండకపోవచ్చు! వాటి ప్రతిరూపమైన నేటి వజ్రోత్సవమూ అందుకు ఏమాత్రం తీసిపోదు! అద్భుతమైన ఈ అమృత ఘడియల్లో... మన స్వాతంత్య్ర స్ఫూర్తికి అమరుల దీప్తికి భారతీయుల శక్తికి అవలక్షణాల నుంచి విముక్తికి సురాజ్య భానూదయానికి నవసంకల్పం తీసుకుందాం.
స్వాతంత్య్ర అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు ఆసేతు హిమాచలం సిద్ధమైంది. రాజధాని దిల్లీ నుంచి మారుమూల గ్రామం దాకా వీధివీధీ జెండా పండగకు ముస్తాబయ్యాయి. పతాకావిష్కరణ కార్యక్రమాలకు కోట్లాది మంది దేశవాసులు ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల కోసం ఎర్రకోటను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఆయన ఇక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. ఉగ్రవాదులు, విద్రోహశక్తుల నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. జమ్మూ-కశ్మీర్ సహా దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు, స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇప్పటికే ప్రభుత్వం ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వేడుకలకు కొత్త శోభను తీసుకొచ్చింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములవుతూ ప్రజలు తమ నివాసాలపై మువ్వన్నెల పతాకాలను రెపరెపలాడిస్తూ మురిసిపోతున్నారు. గత రెండు స్వాతంత్య్ర దినోత్సవాలు కొవిడ్-19 కారణంగా ఒకింత ఆంక్షల నడుమ జరిగాయి. ఈసారి రెట్టించిన ఉత్సాహంతో జెండా పండగను జాతి యావత్తూ ఘనంగా నిర్వహించుకోనుంది. ఇప్పుడు ఆ భయాలు దాదాపు తొలగిపోయిన స్థితికి చేరుకోవడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెట్టింపు ఉత్సాహంతో వేడుకలు చేసుకునేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు.
జాతీయ టీకాల కార్యక్రమంలో హెచ్పీవీ?
ప్రధాని మోదీ ప్రతి ఏడాది పంద్రాగస్టు ప్రసంగంలో అనేక కీలక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తుంటారు. దేశాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, వివిధ వర్గాల కోసం చేపట్టిన కార్యక్రమాలను, త్వరలో చేపట్టబోయే పనులను వివరిస్తారు. ఈసారి 100 ఏళ్ల స్వాతంత్య్ర భారత లక్ష్యాలు, ఆత్మనిర్భర భారత్, దేశాభివృద్ధి, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, రైల్వేలు, ఇంధనం, క్రీడలు, సంక్షేమ పథకాలు, నూతన ఆవిష్కరణలు వంటి కీలక అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సందర్భంగా ఆరోగ్య రంగంలో చేపట్టనున్న చర్యలను ప్రధాని వివరిస్తారని, ‘హీల్ ఇన్ ఇండియా’, ‘హీల్ బై ఇండియా’ ప్రాజెక్టులను ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారు. అలాగే 2047 కల్లా ‘సికిల్ సెల్ డిసీజ్’ను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రధాని రోడ్మ్యాప్ వెల్లడిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా వేసే క్వాడ్రావలెంట్ హ్యూమన్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్ (క్యూహెచ్పీవీ)ని జాతీయ టీకాల కార్యక్రమంలో చేర్చడం, ప్రస్తుతం ఉన్న జాతీయ ఆరోగ్య మిషన్ను ‘పీఎం సమగ్ర స్వాస్థ్య మిషన్’ కింద విస్తరించడం వంటివి ప్రధాని ప్రసంగంలో ఉండొచ్చని వివరించాయి. జిల్లాస్థాయి ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సంరక్షణ సామర్థ్యాలను (టెర్షియరీ కేర్) అభివృద్ధి చేసేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ను విస్తరిస్తున్నారని, ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రంలో 5 శాతం వనరులను ఇందుకు కేటాయిస్తారని తెలిపాయి.
* వైద్యం, వెల్నెస్ టూరిజానికి సంబంధించి భారత్ను ప్రపంచ కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా చేపడుతున్న హీల్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద 12 రాష్ట్రాల్లోని 37 ఆసుపత్రుల్లో వైద్య మౌలిక వసతులను పెంచుతారు. దీంతోపాటు భారత్లో చికిత్స చేయించుకునేందుకు వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం.. ప్రత్యేకంగా గుర్తించిన పది విమానాశ్రయాల్లో ప్రత్యేక డెస్కులు, బహుళ భాషా పోర్టల్, సరళీకృత వీసా నిబంధనలు వంటి చర్యలు చేపడతారు. వైద్య అవసరాల నిమిత్తం భారత్కు వస్తున్న వారిలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సార్క్, గల్ఫ్ ప్రాంతాలకు చెందిన 44 దేశాల పౌరులు ఎక్కువగా ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
* భారత్ను ఆరోగ్య సంరక్షణ రంగంలో శిక్షణ పొందిన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ‘హీల్ బై ఇండియా’ కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆరోగ్య మంత్రిత్వశాఖ ఓ ఆన్లైన్ వేదికను అభివృద్ధి చేస్తుంది. ఇందులో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బంది వివరాలు అందుబాటులో ఉంటాయి. విదేశాల్లోని రోగులు, దేశంలో, విదేశాల్లోని హెచ్ఆర్ నిపుణులు వారి అవసరాలకు సరిపోయే సిబ్బందిని ఈ వేదికలో వెతుక్కుని ఎంపిక చేసుకోవచ్చు.
* భారత్కు స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు అయ్యే 2047 నాటికల్లా సికిల్ సెల్ డిసీజ్ను నిర్మూలించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గిరిజన వ్యవహారాల శాఖ సహకారంతో రోడ్మ్యాప్ రూపొందిస్తుంది. ఇందులో భాగంగా దేశంలో రానున్న 25 ఏళ్లలో ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు 17 రాష్ట్రాల పరిధిలోని 200 జిల్లాల్లో 40 ఏళ్లలోపు వయసున్న ఏడు కోట్ల మందికి రానున్న మూడేళ్లలో పరీక్షలు నిర్వహిస్తారు.
* గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా తీసుకునే హ్యూమన్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్ (క్యూహెచ్పీవీ)ను దేశంలోని 9 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు జాతీయ టీకాల కార్యక్రమం కింద అందజేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రణాళిక రచిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆరు నెలలు పట్టొచ్చు. దేశంలో ఏటా 1,22,844 మంది మహిళలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ సోకుతుండగా వారిలో 64,477 మంది మృత్యువాత పడుతున్నారు. హ్యూమన్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్ (క్యూహెచ్పీవీ)ను భారత్కే చెందిన సీరం సంస్థ రూపొందించింది. ఇప్పటి వరకు ఈ టీకా కోసం మనం విదేశాలపై ఆధారపడేవాళ్లం.
భద్రత కట్టుదిట్టం..
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాని మోదీ పతాకావిష్కరణ చేయనున్న ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. వేడుకలకు హాజరయ్యే ఏడువేల మంది కోసం బహుళ అంచెల భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ కవళికలను గుర్తించే కెమెరాలు, వెయ్యి సీసీ కెమెరాలు, మొబైల్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ‘నో కైట్ ఫ్లై జోన్’గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు. 100 పోలీసు వాహనాలు, పీసీఆర్ వ్యాన్లు, తక్షణ స్పందన బృందాలను మోహరించారు. ఎర్రకోట పరిసరాల్లో షార్ప్ షూటర్స్, ఎన్ఎస్జీ స్నైపర్లు, మెరికల్లాంటి స్వాట్ కమాండోలు, డాగ్ స్క్వాడ్స్ను రంగంలోకి దించారు. డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు యాంటీ డ్రోన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్లను గుర్తించి, నేలకూల్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట పరిసరాలు బయటకు కనిపించకుండా, ఇతరులు లోపలికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఎర్రకోట చుట్టూ ఉన్న 8 మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు సెంట్రల్ దిల్లీలో ఆంక్షలు అమల్లో ఉంటాయి. పారా గ్లైడింగ్, హాట్ ఎయిర్ బెలూన్, రిమోట్ పైలట్ ఎయిర్ క్రాప్ట్లపై మంగళవారం వరకు నిషేధం విధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి... శివ అన్నపురెడ్డి పేరుతో చలామణీ అవుతూ సవాల్ విసురుతుంటే సీబీఐ చేష్టలుడిగి చూస్తోంది. -
సీఎం వస్తున్నారంటే.. చెట్లపై వేటు పడాల్సిందేనా?
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రానున్నారు. ఇంకేముంది షరామామూలుగా గొడ్డలికి పనిచెప్పారు అధికారులు. -
అమ్మా.. నాన్న ఏరీ.. ఎక్కడ?
జగన్పై రాయితో దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న తెదేపా నాయకుడు, ఆటోడ్రైవర్ వేముల దుర్గారావు ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లుతున్నారు. -
నవీన్ పట్నాయక్ నిర్మించారు.. జగన్ ముంచేశారు
ఒడిశాలో నాగావళి నదిపై మూడు గ్రామాల ప్రజల కోసం వంతెన నిర్మాణానికి అక్కడి సీఎం నవీన్ పట్నాయక్ చొరవ చూపగా.. ఏపీలో అదే నదిపై 33 గ్రామాల ప్రజల కోసం వారధి నిర్మాణానికి స్వయంగా జగనే హామీ ఇచ్చినా నేటికీ పూర్తికాలేదు. -
కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అదే అరాచకం.. అదే దౌర్జన్యం
గత అయిదేళ్లుగా కొనసాగుతున్న అరాచకం.. దాష్టీకం.. దౌర్జన్యం.. దమనకాండ.. ఎన్నికల వేళ మరింత తీవ్రమయ్యాయి. ప్రతిపక్ష పార్టీల శ్రేణులపై వైకాపా గూండాలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు. -
జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు!
మైకు దొరికిందంటే చాలు... నా ఎస్సీ, నా ఎస్టీ... అంటూ బుకాయిస్తారు... దళితుడిని చంపి ఇంటికి డోర్డెలివరీ చేసిన అనుచరుడిని పక్కనే కూర్చోబెట్టుకుంటారు... దళిత మహిళలను జుట్టుపట్టుకొని లాగికొట్టిన కార్యకర్తలను వెనకేసుకొస్తారు... చెప్పేది పేదలపక్షపాతం... చేసేది పెత్తందారీతనం... ఇదీ జగన్ అసలు రూపం. -
వ్యాధి తేల్చరు.. వేదన తీర్చరు!
తెలంగాణలో ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రజలకు చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నిర్ధారణ పరీక్షలు రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యమే కాదు... వ్యాధి నిర్ధారణ పరీక్షలూ ఖరీదైనవే. -
పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!! -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యం అందిస్తాం
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి వస్తే ప్రజావాక్కును శిరసావహించే రామరాజ్యాన్ని అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన 40మంది అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
బస శిబిరంలోనే సీఎం జగన్ విశ్రాంతి
‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రలో భాగంగా మంగళవారం పశ్చిమగోదావరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి తణుకు మండలం తేతలిలో రాత్రి బస చేశారు. -
వివేకా హంతకులకు ఓటేయొద్దు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హంతకుడికి ఓటు వేయవద్దని వివేకా కుమార్తె సునీత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందులలోని వివేకా నివాసంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. -
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటి నుంచి పునశ్చరణ తరగతులు
ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్ తప్పిన విద్యార్థులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. -
తల్లిదండ్రుల కమిటీ సమావేశం వాయిదా
విద్యా సంవత్సరం చివరి రోజు ఏప్రిల్ 23న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ తెలిపారు. -
పట్టణాభివృద్ధికి పాడె కట్టిన జగన్!
ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా... తాగునీటి ఇబ్బందులు పట్టించుకోకున్నా... ఇరుకు రోడ్లను విస్తరించకున్నా... తెదేపా హయాంలో చేపట్టిన పనులు నిలిపేసినా... లేశమాత్రమైనా జంకు లేకుండా... పట్టణాలను ప్రగతిబాట పట్టించానని... అద్భుతాలు సృష్టించానని మరోసారి సిద్ధమంటూ మళ్లీ జనంలోకి వస్తున్నారు... సీఎం జగన్! -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్