జ్వరానికి పోషకాహారమే మందు
ప్రస్తుతం రాష్ట్రమంతా సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని డెంగీ, మలేరియా వంటివి కూడా ప్రబలుతున్నాయి. ఇక కొవిడ్ ఎలాగూ కొనసాగుతూనే ఉంది. పాతకాలంలో జలుబు చేస్తే బాగా తినాలని.. జ్వరం వస్తే ఉపవాసం ఉండాలని చెప్పేవారు.
ద్రవాలూ ఎక్కువగా తీసుకోవాలి
కోలుకునే దశలో ఇవన్నీ కీలకమంటున్న నిపుణులు
ఉపవాసంతో అనారోగ్యం పెరుగుతుందని హెచ్చరిక
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రమంతా సాధారణ ఫ్లూ జ్వరాలు మొదలుకొని డెంగీ, మలేరియా వంటివి కూడా ప్రబలుతున్నాయి. ఇక కొవిడ్ ఎలాగూ కొనసాగుతూనే ఉంది. పాతకాలంలో జలుబు చేస్తే బాగా తినాలని.. జ్వరం వస్తే ఉపవాసం ఉండాలని చెప్పేవారు. నిజానికి ఈ విధానం వల్ల అనారోగ్యం పెరుగుతుందే తప్ప.. తగ్గదని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు నీరు తగినంతగా తాగడం ఎంత ముఖ్యమో.. పోషకాహారం కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు వంటివి ఎక్కువగా తినడం వల్ల వేగంగా కోలుకుంటారని చెబుతున్నారు.
పోషకాహారం అందకపోతే..
శరీరం ఇన్ఫెక్షన్ల బారినపడిప్పుడు.. వాటిని ఎదుర్కోవడంలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. దానిని బలంగా ఉంచడంలో పౌష్టికాహారం దోహదపడుతుంది. పేగుల్లో మంచి, చెడు బ్యాక్టీరియా రెండూ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ప్రొ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ పెరిగి మంచి బ్యాక్టీరియాను నాశనం చేసి, చెడ్డవాటిని పెంచుతుంది. దీనివల్ల మరింతగా ఆరోగ్యం క్షీణిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే ఒంట్లో నుంచి నీరు, లవణాలు బయటకు వెళ్లిపోతుంటాయి. కొందరికి విరేచనాలు, వాంతులు కావడం వల్ల కూడా ఒంట్లోంచి నీరు, లవణాలు వెళ్లిపోతాయి. ఇలాంటి సమయాల్లో శరీరానికి తగినంత నీరు, లవణాలు, పోషకాహారాన్ని అందించలేకపోతే.. వీటి వల్ల ఇంకా శరీరం కుంగిపోయి రక్తపోటు పడిపోతుంది. బాగా నీరసం, లేవలేని పరిస్థితులు వస్తాయి.
రోగ నిరోధక శక్తి సమకూరేదిలా
పౌష్టికాహారాన్ని రెండు రకాలుగా చెబుతారు. 1. మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్లు, ఖనిజాలు(మినరళ్లు) 2. మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, మాంసకృత్తులు, కొవ్వులు(ప్రొటీన్స్ అండ్ ఫ్యాట్స్). రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటే మ్యాక్రో న్యూట్రియంట్లతో పాటు మైక్రో న్యూట్రియంట్లు ఉండాల్సిందే. ప్రధానంగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాల వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. విటమిన్ ఏ, సీ, డీ, ఈ లు శ్వాస కోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఏ ఆహారాల్లో ఏముంటాయి?
విటమిన్ ఎ: యాంటీ జెన్, యాంటీబాడీస్ పనిచేయడంలో ఎక్కువగా ఉపయోగపడతుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని చర్మాన్ని, కణజాలాన్ని రక్షిస్తుంది. చిలగడదుంప(స్వీట్ పొటాటో), క్యారెట్, బీట్రూట్, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తాయి.
విటమిన్ సి: కణాల మరమ్మతుకు, పునరుత్పత్తికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. యాంటీబాడీస్ను ప్రేరేపిస్తుంది. ఆకుపచ్చని కూరగాయలు, దేశీయ జామ, పచ్చిమామిడి, దానిమ్మ, ద్రాక్ష, తదితర పుల్లని పండ్లు, బొప్పాయి, క్యాప్సికం, ఎర్రతోటకూర, స్ట్రాబెర్రీ, నిమ్మలో ఎక్కువగా లభిస్తుంది. త్రిఫల చూర్ణం(ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల పొడి) వాడటం మేలు చేస్తుంది. కరక్కాయ జీర్ణ వ్యవస్థపై, తానిక్కాయ ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపర్చడంపై బాగా పనిచేస్తాయి.
విటమిన్ డి: హానికారక అతి సూక్ష్మక్రిముల సంహారానికి, మేలు చేసే సూక్ష్మక్రిముల వృద్ధికి దోహదపడుతుంది.
పాల ఉత్పత్తుల్లో, ఫ్యాటీ ఫిష్, గుడ్లు, మాంసహారంలో కాలేయంలో ఎక్కువగా ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు సూర్యరశ్మి శరీరంలో 18 శాతం భాగాన్ని స్పృశించేలా చూసుకోవాలి.
విటమిన్ ఈ: కణం ఆకృతి చక్కగా రూపాంతరం చెందాలంటే చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధుల్లో రోగ నిరోధకతను పెంపొందించడంలో పనిచేస్తుంది. పసుపు, శెనగలు, కరివేపాకు, ఎండుకొబ్బరి, పొద్దు తిరుగుడు, అవిసె గింజలు, బాదం, పిస్తాల్లో లభిస్తుంది.
విటమిన్ బి 12: రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. నరాలు, జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పేగుల నుంచి రక్తనాళాలకు పోషకాలు చేరడంలో బీ 12 సహకరిస్తుంది. చేపలు, మాంసం, చికెన్, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఎండుద్రాక్షల్లో ఇది ఎక్కువగా ఉంటుంది.
మాంసకృత్తులు: ఈ తరహా ఆహారాలు ఆరోగ్యవంతంగా ఉండేలా, త్వరగా కోలుకునేలా చేస్తాయి. సోయా ఉత్పత్తులు, ఉప్పు కలపని గింజలు, విత్తనాలు, బీన్స్, పప్పు దినుసులు, గుడ్లు, చికెన్, మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల్లో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి.
ఊబకాయులకు మరిన్ని జాగ్రత్తలు అవసరం
సన్నగా ఉన్న వారిలో కంటే ఊబకాయుల్లో సహజంగానే ప్రొ ఇన్ఫ్లమేటరీ సైటోకైన్స్ ఉత్పత్తి అవుతుంటాయి. దీనికి తోడు వారికి జ్వరం వస్తే సైటోకైన్స్ దాడి మరింతగా పెరుగుతుంది. సహజంగా ఉండే ఇన్ఫ్లమేషన్, జ్వరం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ రెండూ కలిసి ముప్పు రెట్టింపు అవుతుంది. వీరు త్వరగా డీహైడ్రేషన్కు గురవుతారు. అందుకే వీరికి మరింత జాగ్రత్తగా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తుండాలి. తీపి పదార్థాలు, నిల్వ ఆహార పదార్థాల(జంక్ఫుడ్)ను తిన్నప్పుడు మరింతగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి జ్వరం ఉన్నప్పుడు జంక్, తీపి పదార్థాలు, నిల్వ ఆహారాలను తినకూడదు. పోషకాహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిని సహజ సిద్ధంగా తీసుకోలేని పరిస్థితుల్లో మాత్రల రూపంలోనూ ఇవ్వవచ్చు.
-డాక్టర్ రాకేశ్ కలపాల, సీనియర్ కన్సల్టెంట్, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?