తిరంగా.. మురిసె ఘనంగా
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇంటింటా ఎగరవేసేందుకు కోటీ 20 లక్షల జెండాలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది.
ఊరూరా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
నేడు ఇంటింటా జెండా ఎగరవేయాలి: సీఎం కేసీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇంటింటా ఎగరవేసేందుకు కోటీ 20 లక్షల జెండాలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. సోమవారం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మరోవైపు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వజ్రోత్సవాలు జరిగాయి. పలు జిల్లాల్లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాన్ని చేబూని నినాదాలతో దేశభక్తిని చాటారు. హైాదరాబాద్ సైకిల్ గ్రూప్ కుత్బుల్లాపూర్ నుంచి 100 కిలోమీటర్ల తిరంగా సైకిల్ యాత్రను ఆదివారం ప్రారంభించింది. మెదక్ జిల్లా చేగుంట సమీపంలో ఈ యాత్రలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని సంజీవయ్య పార్కులో జాతీయ పతాకాన్ని రూపొందించడంలో ఆది నుంచి జరిగిన మార్పులపై ప్రదర్శనను మంత్రి శ్రీనివాస్యాదవ్ ప్రారంభించారు. నల్గొండలో వజ్రోత్సవాలకు మంత్రి జగదీశ్రెడ్డి హాజరయ్యారు. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలో భారీ త్రివర్ణ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. హైదరాబాద్లో ఈవీ రైడ్ విత్ ప్రైడ్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. టీ-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్రావు ప్రదర్శనను ప్రారంభించారు. మారథాన్ రన్నర్ జగన్మోహన్ 75 కిలోమీటర్ల పరుగు తీశారు. సైబరాబాద్ సీపీ కార్యాలయం నుంచి గోల్కొండ మీదుగా రన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో దివిస్ ల్యాబొరేటరీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. చౌటుప్పల్ నుంచి లింగోజిగూడెం వరకు 300 బైక్లతో జాతీయ జెండాలతో ఊరేగింపులో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో తిరంగా సంకీర్తనలు చేపట్టారు. ఆదర్శనగర్, వసంత్ విహార్ కాలనీలో హరేరామ హరేకృష్ణ భక్త బృందం భజనలతో దేశభక్తి చాటారు. మంచిర్యాలలో ముస్లిం యూత్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో పురవీధుల గుండా తిరంగా ప్రదర్శన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో తెరాస యువజన విభాగం ఆధ్వర్యంలో వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ తీశారు. ఖమ్మం జిల్లా వైరాలో మత్స్యకారులు వినూత్నంగా దేశభక్తిని చాటారు. వైరా జలాశయంలో తెప్పలపై జాతీయ జెండాలతో నీటిలో ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. తల్లాడలో హిందూ-ముస్లిం-క్రైస్తవుల ఐక్యత చాటుతూ ముస్లిమ్ ఆవాజ్ తల్లాడ మండల కమిటీ ఆధ్వర్యంలో 330 అడుగుల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించారు.
కిలిమంజారోపై 75 అడుగుల జాతీయ పతాకం..
తెలంగాణ సమాచార, పౌరసంబంధాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ యేముల నితిన్ ఆదివారం ఆఫ్రికాలోని అత్యంత ఎత్తైన (19,341 అడుగుల) శిఖరం కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించారు. భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శిఖరంపై ఆయన 75 అడుగుల జెండాను ప్రదర్శించారు. ఆయనను సమాచార పౌరసంబంధాల కమిషనర్ అర్వింద్కుమార్, సంచాలకుడు రాజమౌళి, ఇతర అధికారులు అభినందించారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో తెలంగాణ ఫోరం ప్రతినిధులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.
సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయాలి: డీజీపీ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషించాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని వార్డులు, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించాలని, ఉదయం 11.30 గంటలకు ట్రాఫిక్ను నిలిపేసి అలారం మోగేలా మైక్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. గీతాలాపనలో అందరూ క్రమశిక్షణతో పాల్గొనేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం నిర్వహణలో కలెక్టర్లు, ఇతర అధికారులతో కలిసి ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.
జిల్లా కేంద్రాల్లో జెండా ఎగరవేసేది వీరే..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం 32 జిల్లాకేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసేవారి పేర్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో గోల్కొండ కోటలో సీఎం కేసీఆర్ జెండా వందనం చేయనుండగా మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లలో జెండాను ఎగురవేసి, గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. పురస్కారాలను అందజేస్తారు.
జిల్లాలవారీగా..
కామారెడ్డిలో సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, నల్గొండలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రుల్లో కేటీఆర్ రాజన్న సిరిసిల్లలో, హరీశ్రావు- సిద్దిపేట, కొప్పుల ఈశ్వర్- జగిత్యాల, శ్రీనివాస్గౌడ్- మహబూబ్నగర్, నిరంజన్రెడ్డి- వనపర్తి, గంగుల కమలాకర్- కరీంనగర్, సత్యవతి రాథోడ్- మహబూబాబాద్, ఎర్రబెల్లి దయాకర్రావు- జనగామ, తలసాని శ్రీనివాస్యాదవ్- మెదక్, పువ్వాడ అజయ్- ఖమ్మం, ఇంద్రకరణ్రెడ్డి- నిర్మల్, ప్రశాంత్రెడ్డి- నిజామాబాద్, మల్లారెడ్డి- మేడ్చల్-మల్కాజిగిరి, సబితారెడ్డి- రంగారెడ్డి, మహమూద్ అలీ- సంగారెడ్డి, జగదీశ్రెడ్డి- సూర్యాపేట, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్- పెద్దపల్లి, ఉపసభాపతి పద్మారావు- వికారాబాద్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్- హనుమకొండ, ప్రభుత్వ విప్లలో గంప గోవర్ధన్- ఆదిలాబాద్, రేగ కాంతారావు- భద్రాద్రి కొత్తగూడెం, గొంగిడి సునీత- యాదాద్రి భువనగిరి, ఎంఎస్ ప్రభాకర్రావు- ములుగు, అరికెపూడి గాంధీ- కుమురం భీం ఆసిఫాబాద్, గువ్వల బాలరాజు- నాగర్కర్నూల్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ- జోగులాంబ గద్వాల, ప్రభుత్వ సలహాదారులు అనురాగ్శర్మ- జయశంకర్ భూపాలపల్లి, జీఆర్ రెడ్డి- వరంగల్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి- మంచిర్యాల, మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతారెడ్డి- నారాయణపేట
దేశచరిత్రలో చిరస్మరణీయమైన రోజు: గవర్నర్
స్వాతంత్య్ర దినోత్సవం దేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ‘‘లెక్కలేనన్ని త్యాగాలు, అవిశ్రాంత పోరాటాల తర్వాత వలస పాలన నుంచి విముక్తి పొందాం. స్వాతంత్య్రానంతరం దేశం అన్ని రంగాల్లో అపార పురోగతి సాధించింది. స్వాతంత్య్ర సముపార్జనకు ప్రాణత్యాగం చేసినవారిని స్మరించుకుందాం. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో దేశం అన్ని అంశాల్లో స్వావలంబన సాధించేలా మారాలని సంకల్పిద్దాం’’ అని గవర్నర్ పేర్కొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు గోల్కొండ ముస్తాబు
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవాలకు గోల్కొండ కోట ముస్తాబైంది. సీఎం కేసీఆర్ ఉదయం 10.30 గంటలకు జెండావందనం చేస్తారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించి, ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా వేయి మంది కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలుంటాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారికి వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా వాటర్ప్రూఫ్ టెంట్లను ఏర్పాటుచేశారు. రవీంద్రభారతిలో సోమవారం సాయంత్రం 6.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గవర్నర్ తమిళిసై సోమవారం రాత్రి రాజ్భవన్లో తేనీటి విందు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులకు ఆహ్వానం పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: అతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ