కొత్తగూడెం మైనింగ్ కాలేజీ భూముల ఆక్రమణ
గనులకు సంబంధించిన కోర్సులపై శిక్షణ ఇచ్చే విద్యాసంస్థ అది.. మూడు వందల యాభైకి పైగా ఎకరాలు ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని స్థలాల్లో ఇప్పటికే వంద ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. 57 ఎకరాలు పరాధీనమైనట్లు
100 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తింపు
విలువ రూ. వంద కోట్లపైనే
నివేదికలు ఉన్నా.. పట్టని యంత్రాంగం
ఈనాడు, హైదరాబాద్, కొత్తగూడెం విద్యావిభాగం-న్యూస్టుడే: గనులకు సంబంధించిన కోర్సులపై శిక్షణ ఇచ్చే విద్యాసంస్థ అది.. మూడు వందల యాభైకి పైగా ఎకరాలు ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని స్థలాల్లో ఇప్పటికే వంద ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. 57 ఎకరాలు పరాధీనమైనట్లు అధికారులు కూడా గుర్తించారు. అయినా.. ఆక్రమణదారులపై చర్యలు కరవయ్యాయి.
కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల మధ్యఉన్న 389.62 ఎకరాల స్థలంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కాకతీయ స్కూల్ ఆఫ్ మైనింగ్ (యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్)ను ఏర్పాటు చేశారు. ఆ స్థలంలోని దాదాపు వంద ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. అందులోని సర్వే నంబర్ 405లో 57 ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని అధికారులు గుర్తించారు. ఒక పరిశ్రమ 32 ఎకరాలు, నలుగురు వ్యక్తులు 20 ఎకరాలు, మరో వ్యక్తి 5 ఎకరాలు ఆక్రమించినట్లు కొత్తగూడెం ఆర్డీవో సర్వే నివేదిక ద్వారా వెల్లడైంది. అధికారులు మాత్రం ఆక్రమణదారులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఈ కళాశాల ప్రాంతంలోనే భద్రాద్రి కలెక్టరేట్, పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం, వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరం భూమి ధర బహిరంగ మార్కెట్లో రూ.కోటికి పైగా పలుకుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో విలువైన ఈ స్థలాలను మరికొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రహరీతోనే రక్షణ
ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో 2015 అప్పటి జిల్లా కలెక్టర్ లోకేశ్కుమార్ మైనింగ్ స్కూల్ భూముల్లో సర్వే చేయించి హద్దులు నిర్ణయించారు. ఆ స్థలాన్ని రక్షించడానికి ప్రహరీ నిర్మించాలని అధికారులు భావించారు. అయితే నిధులు లేకపోవడంతో 32 హద్దుస్తంభాలు ఏర్పాటు చేశారు. తరవాత అధికారులు పట్టించుకోకపోవడంతో ఆక్రమణలు మామూలుగానే మారాయి. గతంలో ఏర్పాటు చేసిన హద్దురాళ్లు, స్తంభాలను ఆక్రమణదారులు తొలగిస్తున్నారు. ఆ స్థలాలు ఆక్రమించుకుని కొందరు తోటలు సాగు చేస్తున్నారు. మరికొందరు వాటిలో చిన్న పరిశ్రమలు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా మైనింగ్ స్కూల్ స్థలాలను కాపాడాలని ఆ సంస్థ అధ్యాపకులు, విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు. కబ్జాదారులు భూముల్లోకి అక్రమంగా ప్రవేశించకుండా ప్రహరీ నిర్మించాలని వినతి చేస్తున్నారు.
ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం..
మైనింగ్ స్కూల్ పరిధిలోని భూముల ఆక్రమణలపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తూనే ఉన్నాం. ఇక్కడ 57 ఎకరాలు కబ్జా అయినట్లు 2015లో సర్వే బృందం గుర్తించింది. ఆ భూములను స్వాధీనం చేసుకోలేదు. కబ్జాకు గురైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయానికి అప్పగించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి.
- పున్నం చందర్, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కొత్తగూడెం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?