తాటి చెట్టంత దేశభక్తి..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలను సోమవారం వినూత్నంగా నిర్వహించారు. గ్రామంలోని గీత కార్మికులంతా ఏకమై తాము ధరించే ముత్తాడితో గ్రామశివారులో

Published : 16 Aug 2022 05:19 IST

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలను సోమవారం వినూత్నంగా నిర్వహించారు. గ్రామంలోని గీత కార్మికులంతా ఏకమై తాము ధరించే ముత్తాడితో గ్రామశివారులో ఉన్న కాటమయ్య ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడున్న పొడవైన తాటిచెట్టుపైకి ఎక్కి జాతీయ పతాకాలను చేతపట్టుకొని అరగంట పాటు అలరించారు. కిందికి దిగిన తరవాత పతాకాలను ఎగురవేస్తూ జాతీయ గీతాలాపన చేశారు.

- న్యూస్‌టుడే, తిరుమలాయపాలెం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని