వచ్చే ఏడాది పీహెచ్‌డీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష

వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూహెచ్‌, ఇతర సబ్జెక్టుల్లో పీహెచ్‌డీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నాయి.

Published : 16 Aug 2022 05:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలకు జేఎన్‌టీయూహెచ్‌, ఇతర సబ్జెక్టుల్లో పీహెచ్‌డీకి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నాయి. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఆ రెండు వర్సిటీలకు అప్పగించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పీహెచ్‌డీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని గత రెండేళ్లుగా ఉన్నత విద్యామండలి ప్రయత్నిస్తోంది. విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో అది కార్యరూపం దాల్చలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని