చిన్నాభిన్నం..!
కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన 11 లిఫ్టులు పూర్తిగా చెడిపోయాయి. 32 భారీ మోటార్లలోకి ఒండ్రుమట్టి చేరింది. ఈ జిల్లాలో బీర్పూరు, ధర్మపురి మండలాల్లో పెద్ద సంఖ్యలో లిఫ్టులు ఉన్నాయి. మంగెల, ఆరేపల్లి, దొంతాపూర్,
వరదలతో చిన్నతరహా ఎత్తిపోతల పథకాలకు భారీ నష్టం
రాష్ట్ర వ్యాప్తంగా 600 తటాకాలకు గండ్లు
కానరాని పునరుద్ధరణ చర్యలు
ఈనాడు - హైదరాబాద్
కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రూ.కోట్ల విలువైన 11 లిఫ్టులు పూర్తిగా చెడిపోయాయి. 32 భారీ మోటార్లలోకి ఒండ్రుమట్టి చేరింది. ఈ జిల్లాలో బీర్పూరు, ధర్మపురి మండలాల్లో పెద్ద సంఖ్యలో లిఫ్టులు ఉన్నాయి. మంగెల, ఆరేపల్లి, దొంతాపూర్, జైన, రాజారం పథకాల్లో ఒక్కోచోట నాలుగేసి మోటార్లు మునిగిపోయాయి. కమ్మునూరు, రేకులపల్లి, ఎడపల్లి, రాయపట్నం, తిమ్మాపూర్, దొమ్మనపేటలలో రెండేసి మోటార్లు ఉండగా ఈ పథకాలకు భారీ నష్టం వాటిళ్లింది. ‘ఐడీసీ లిఫ్టుపై ఆధారపడి సాగుచేసుకుంటున్న తమకు గోదావరి తీరని నష్టాన్ని మిగిల్చింది’ అని ధర్మపురి మండలం రాయపట్నం ఎత్తిపోతల పథకం ఆయకట్టు సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. వెంటనే నష్టాన్ని అంచనా వేసి మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
గోదావరి వరదలు... కుంభవృష్టి వర్షాలతో చిన్నతరహా నీటిపారుదల వ్యవస్థా ఛిన్నాభిన్నమైంది. రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి, దాని ఉపనదులు, వాగుల చెంత ఉన్న నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఎత్తిపోతల పథకాలు(లిఫ్టులకు), ఇతర చెరువులకు భారీ నష్టం వాటిల్లింది. అయినప్పటికీ లిఫ్టుల పునరుద్ధరణకు ఇప్పటి వరకూ ఎవరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొట్టుకుపోయాయి
ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి జిల్లా వరకు గోదావరి సృష్టించిన విలయానికి ఐడీసీ లిఫ్టుల రూపురేఖలు మారిపోయాయి. నది ఒడ్డునే నిర్మించిన పథకాలు చాలా చోట్ల కొట్టుకుపోయాయి. ఎత్తు ప్రాంతాల్లో ఉన్నవాటినీ వరద ముంచెత్తింది. పంపుహౌసుల్లోని మోటార్లలోకి నీళ్లు చేరడం, విద్యుత్ ప్యానల్బోర్డులు చెడిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు నీళ్లలో నాని కొన్ని చోట్ల, వాటి స్తంభాలు, గద్దెలు కూలి నష్టాలు వాటిల్లాయి.
* భద్రాద్రి జిల్లాలో అశ్వాపురం మండలంలో కట్టంవారిగూడెంలో మోటార్లు కొట్టుకుపోయాయి. ఈ జిల్లాలో ఐటీడీఏ ఆర్థిక సహకారంతో నిర్మించిన లిఫ్టులకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నష్టం ఎంతనేది ఇంకా అంచనా వేయలేదు.
ఆనవాళ్లు లేని చెరువు కట్టలు..
భారీ వర్షాలకు వరద అమాంతం పెరగడంతో పలుచోట్ల మిషన్ కాకతీయ పథకంలో పునరుద్ధరించిన చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. సుమారు 75 భారీ చెరువుల కట్టలు కొట్టుకుపోయాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 65, నిజామాబాద్ జిల్లాలో 33, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 50 తటాకాలకు గండ్లు పడ్డాయి. 600 చెరువులకు నష్టం వాటిల్లింది. 200 చోట్ల సాగునీటి ప్రాజెక్టుల కాల్వలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల దెబ్బతిన్నాయి.
నీటిపారుదల అభివృద్ధి సంస్థ (ఐడీసీ) ద్వారా ఏర్పాటు చేసిన చిన్నతరహా లిఫ్టులకు భారీ నష్టం వాటిల్లగా ఇప్పటికీ కనీస పరిశీలన చేయలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో లిఫ్టు కింద అయిదు వందలకుపైగా ఎకరాలు సాగవుతున్న పథకాలు ఉన్నాయి. ఐడీసీ విభాగాన్ని నీటిపారుదల శాఖలో విలీనం చేసిన తరువాత ఈ లిఫ్టుల పర్యవేక్షణ అంతగాలేదని ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చెరువులు, ప్రాజెక్టు కాల్వల కింద దాదాపు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనాలు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకూ పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)