జనగణమన.. గొంతెత్తి పాడిన తెలంగాణ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రహదారులపై కూడళ్లలో వాహనాలను నిలిపివేసి..
రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన
హైదరాబాద్లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. జిల్లాల్లో మంత్రులు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రహదారులపై కూడళ్లలో వాహనాలను నిలిపివేసి.. వాహనదారులు, పోలీసులు, ప్రజలు అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రంలో జనగామలో జాతీయ గీతాలాపనలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజలు.
ఈనాడు, హైదరాబాద్: జనగణమన అధినాయక జయహే.. అంటూ తెలంగాణలోని గొంతుకలన్నీ ఒక్కటయ్యాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ పిలుపునకు అపూర్వ స్పందన లభించింది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రజలంతా ఎక్కడివారు అక్కడే నిల్చొని సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. రాష్ట్రమంతటా జాతీయ గీతంతో పాటు జైహింద్, జైతెలంగాణ నినాదాలు మార్మోగాయి. హైదరాబాద్లోని ఆబిడ్స్ జీపీవో సర్కిల్లోని నెహ్రూచౌక్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించగా.. ఆయనతో వేల మంది గొంతు కలిపారు.
పిడికిలెత్తి నినదించిన సీఎం..
ఆబిడ్స్లో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, బేతి సుభాష్రెడ్డి, ఎ.జీవన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొని జాతీయగీతాన్ని ఆలపించారు. అనంతరం సీఎం పిడికిలెత్తి బోలో స్వతంత్ర భారత్కి జై, జైతెలంగాణ... అంటూ నినాదాలు చేశారు. మంత్రులు, నేతలు గొంతుకలిపారు. అంతకుముందు ఎంపీ అసదుద్దీన్తో కలిసి నెహ్రూ విగ్రహానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఆబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలు, బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ సంగీత విభావరితోపాటు పలు అంశాలుంటాయని వజ్రోత్సవాల కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు ప్రకటించారు.
కూడళ్ల వద్ద నిలిచిన వాహనాలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రమంతటా సామూహిక గీతాలాపనకు ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పోలీసుశాఖ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టింది. అన్ని ప్రధాన కూడళ్ల వద్ద నిమిషం పాటు రెడ్సిగ్నల్ ఇచ్చి వాహనాలను నిలిపివేసి అందరూ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాటు చేశారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించారు. సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించారు.
జిల్లాల్లో..: జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద కాన్వాయ్ను ఆపి తన సిబ్బంది, పోలీసులతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు. నల్గొండ క్లాక్టవర్ సెంటర్లో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్ జాతీయ గీతాలాపన చేశారు. ఇతర మంత్రుల్లో గంగుల కమలాకర్ కరీంనగర్లో, ఎస్.నిరంజన్రెడ్డి వనపర్తిలో, సత్యవతి రాథోడ్ మహబూబాబాద్లో, ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లో, జగదీశ్రెడ్డి యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో, కొప్పుల ఈశ్వర్ గౌలిదొడ్డి గురుకులంలో జాతీయ గీతాలాపన చేశారు. శాసనమండలి వద్ద, సచివాలయంలో, డీజీపీ కార్యాలయంలో, సికింద్రాబాద్ రైల్వే ప్రాంగణంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. చార్మినార్ వద్ద నిర్వహించిన కార్యక్రమం మతసామరస్యాన్ని చాటింది.
ఉద్యోగ సంఘాల కార్యాలయాల్లో..
టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్, తెలంగాణ ఉద్యోగుల సంఘం, రాష్ట్ర ఉద్యోగుల సంఘం, ప్రభుత్వరంగ ఉద్యోగుల సమాఖ్య కార్యాలయాల్లో సామూహిక జాతీయ గీతాలాపన జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వేల సంఖ్యలో విద్యార్థులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు జాతీయ గీతాలాపన చేశారు. వ్యవసాయ కూలీలు, కల్లుగీత కార్మికులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. హైదరాబాద్లో బేగంబజార్ నుంచి అబిడ్స్లోని సీఎం సబావేదిక వద్ద వరకు సుమారు 2వేల మంది వ్యాపారులు, మహిళలు జాతీయ పతకాలతో ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లిలో జరిగిన పెళ్లి వేడుకలో వధూవరులు అవినాష్రెడ్డి, భావనలతో పాటు హాజరైన బంధువర్గమంతా జాతీయ గీతాలాపన చేశారు.
55 మెట్రో రైళ్లలో..: జాతీయ గీతం ఆలాపన నేపథ్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మెట్రోరైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మూడు కారిడార్లలోని 55 మెట్రోరైళ్లను 52 సెకన్లపాటు నిలిపేశారు. లోకోపైలట్లు సహా ప్రయాణికులు సీట్లలో నుంచి లేచి నిలబడి జనగణమన పాడారు.
మల్లారెడ్డి వర్సిటీలో 30 వేల మందితో ఘనంగా..
మేడ్చల్, మేడ్చల్ గ్రామీణం, న్యూస్టుడే: పిల్లలు ఎంత బాగా విద్యనభ్యసిస్తారనే దానిపై దేశ భవిత ఆధారపడి ఉంటుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పురపాలిక పరిధి మైసమ్మగూడ మల్లారెడ్డి విశ్వవిద్యాలయంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా 30వేల మంది విద్యార్థులు 365 రోజుల పాటు దేశభక్తితో ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. జాతీయ జెండాలను ప్రదర్శించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో హరీశ్రావుతోపాటు మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 30 వేల మంది ఒకేసారి, ఒకేచోట గళమెత్తడంతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో వర్సిటీ పేరు నమోదైంది. మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయవాది డా.జీవీఎన్ఆర్ఎస్ఎస్ఎస్ వరప్రసాద్ రికార్డు పత్రాన్ని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్