22న ఆర్జీయూకేటీ ప్రవేశాల జాబితా

బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల జాబితాను ఈ నెల 22న ప్రకటిస్తామని ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల జాబితా ప్రకటన

Published : 18 Aug 2022 05:07 IST

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాల జాబితాను ఈ నెల 22న ప్రకటిస్తామని ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల జాబితా ప్రకటన జాప్యమవుతోందని బుధవారం ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ‘ఆర్జీయూకేటీ ప్రవేశాల్లో జాప్యం’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఇన్‌ఛార్జి ఉపకులపతి స్పందిస్తూ ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘ఈ ఏడాది సైతం 1500 సీట్లు భర్తీ చేస్తాం. ఇందులో ప్రత్యేక కేటగిరి కింద 96 సీట్లు పోగా మిగిలిన 1404లో 702 సీట్లు వివిధ రిజర్వేషన్లకు కేటాయిస్తాం. జనరల్‌కు మిగిలిన 702లో ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 140 సీట్లు కేటాయిస్తాం. దీంతోపాటు 30 ఎన్‌ఆర్‌ఐ సీట్లు, 75 గ్లోబల్‌ సీట్లు అందుబాటులో ఉంటాయి’’ అని వెంకటరమణ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని