వాసవి గ్రూపు సంస్థల్లో ఐటీ సోదాలు

ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ వాసవి గ్రూపునకు చెందిన కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ బృందాలు బుధవారం సోదాలు నిర్వహించాయి. బంజారాహిల్స్‌లోని సంస్థ ప్రధాన

Published : 18 Aug 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ వాసవి గ్రూపునకు చెందిన కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ బృందాలు బుధవారం సోదాలు నిర్వహించాయి. బంజారాహిల్స్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంతోపాటు గ్రూపు ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌, డైరెక్టర్ల ఇళ్లల్లో దాదాపు 40 బృందాలు రాత్రివరకు సోదాలు జరిపాయి. సంస్థ ఆదాయానికి.. ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినందున సోదాలు జరిగినట్లు తెలిసింది. పలు కీలకపత్రాలను, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల్ని స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని