మెట్రోకు ప్రత్యామ్నాయం నియో
‘నగరాల సమీపంలో వేగంగా జరుగుతున్న విస్తరణతో మున్ముందు వలసలు మరింత పెరుగుతాయి. జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయిదు నిమిషాల్లోనే ఏదో ఒక స్టేషన్ చేరుకునేలా ప్రజారవాణా
రాజధాని శివార్లలో తక్కువ ఖర్చుతో బీఆర్టీఎస్
ప్రజారవాణాతోనే నగరాలకు మనుగడ
‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ‘నగరాల సమీపంలో వేగంగా జరుగుతున్న విస్తరణతో మున్ముందు వలసలు మరింత పెరుగుతాయి. జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా సదుపాయాల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. అయిదు నిమిషాల్లోనే ఏదో ఒక స్టేషన్ చేరుకునేలా ప్రజారవాణా వ్యవస్థను తీర్చిదిద్దుకోగల్గితే మున్ముందు ట్రాఫిక్, కాలుష్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. పాతికేళ్లలో హైదరాబాద్ను ప్రపంచ అగ్రశ్రేణి 20 నగరాల్లో ఒకటిగా చూడొచ్చు’ అని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి అన్నారు. నగరంలో ఎంఎంటీఎస్, మెట్రో వంటి ప్రజారవాణా వ్యవస్థలను పట్టాలెక్కించిన అనుభవం ఆయన సొంతం. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వచ్చే పాతికేళ్లలో హైదరాబాద్లో ప్రజారవాణా ఎలా ఉండాలి? గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? అనే అంశాలను ఆయన ‘ఈనాడు-ఈటీవీ’ ముఖాముఖిలో వివరించారు.
నగరంలో ప్రజారవాణాపై ఆధారపడేవారి శాతం తగ్గుతోంది. ట్రాఫిక్, కాలుష్యం పెరుగుతోంది..వచ్చే పాతికేళ్లలో ఎలా ఉండబోతుంది?
హైదరాబాద్లో ప్రజారవాణా ద్వారా ప్రయాణించేవారు 40 శాతం కంటే తక్కువే ఉన్నారు. ఇది ఆందోళన కల్గించే అంశం. నగరంలో ఇప్పటికే కోటి జనాభా నివసిస్తోంది. వచ్చే పాతికేళ్లలో ప్రధాన నగరంలో కోటిన్నరకుపైగా, హెచ్ఎండీఏ పరిధిలో రెండుకోట్ల జనాభా నివసించే అవకాశం ఉంది. సిటీలో ప్రస్తుతం 50 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. వ్యక్తిగత వాహనాలు పెరుగుతూ పోతే మున్ముందు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి వస్తుంది. కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా గతంలో ఇదే జరిగింది.ఆ అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. వాహనాలు పెరిగేకొద్దీ రహదారులు విస్తరించడం, ఫ్లైఓవర్లు కట్టడం స్వల్ప కాలానికి ఉపయోగపడుతుంది. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపర్చుకోవడమే శాశ్వత పరిష్కారం.
మెట్రో, మెట్రో నియో విస్తరణ ప్రణాళికలు ఎంతవరకు వచ్చాయి? మన నగరానికి ఏది అనుకూలం?
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ ట్రాఫిక్ స్టడీ పేరుతో లీ అసోసియేట్స్ గతంలో 2041కి నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం మెట్రో 335 కి.మీ., ఎంఎంటీఎస్ 270 కి.మీ.మేరకు అవసరం పడుతుందని అంచనా వేసింది. ప్రాధాన్యాన్ని బట్టి మెట్రో రెండోదశలో కొన్ని మార్గాలను చేర్చాం. సీఎం సూచనల మేరకు రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోను ప్రతిపాదించాం. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నిర్మించే ఆలోచన చేశాం. బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్, నాగోల్ నుంచి ఎల్బీనగర్ మార్గాలు పరిశీలనలో ఉన్నాయి.ఇవి కాకుండా బీహెచ్ఈఎల్-పటాన్చెరు, జేఎన్టీయూ-ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎల్బీనగర్-రామోజీ ఫిల్మ్సిటీ, జేబీఎస్-కూకట్పల్లి వై జంక్షన్, తార్నాక-కీసర-ఓఆర్ఆర్, నానక్రాంగూడ-బీహెచ్ఈఎల్, బోయిన్పల్లి-మేడ్చల్, ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట-విమానాశ్రయం, ఎంజీబీఎస్-ఘట్కేసర్ వరకు ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే మెట్రో వేయాలంటే కి.మీ.కు రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అన్ని నిధులు వెచ్చించడం కష్టం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఎలివేటెడ్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఈబీఆర్టీఎస్) నిర్మించబోతున్నాం. దీనికి కేంద్రం మెట్రో నియోగా ఆమోదం తెలిపింది. కేపీహెచ్బీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్-కోకాపేట వరకు ఈ-బీఆర్టీఎస్ను ప్రతిపాదించాం. చాంద్రాయణగుట్ట నుంచి విమానాశ్రయం వరకు బీఆర్టీఎస్కు అవకాశం ఉంది. ఇది ఒక్కటే అనుకూలమని చెప్పలేం. అవసరాన్ని బట్టి నిర్మించుకోవాలి.
మనకు నిధుల సమస్య పెద్ద అవరోధంగా ఉంది. దీన్ని అధిగమించేందుకు గతంలో పీపీపీలో మెట్రో చేశారు. కొత్తగా మరేమైనా ప్రణాళికలు ఉన్నాయా?
గతంలో మెట్రోను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించాం. కొవిడ్తో పీపీపీ ఆశలు సన్నగిల్లాయి. అందుకే ఈ-బీఆర్టీఎస్ను హైబ్రీడ్ యాన్యుటీ మోడల్లో చేయాలని అందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించాం. ప్రాజెక్టు చేపట్టేందుకు ముందుకొచ్చే సంస్థలకు నిర్మాణ సమయంలో కొంత, నిర్వహణ సమయంలో కొంత నిధుల తోడ్పాటు అందిస్తాం.
విదేశాల్లో అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థ ఎలా ఉంది? అక్కడి నుంచి మనం తీసుకోవాల్సిన అంశాలేమైనా ఉన్నాయా?
లండన్లో ఇంటినుంచి అయిదు నిమిషాల దూరం నడిచి వెళితే చాలు ట్యూబ్ స్టేషన్ వస్తుంది. పారిస్, సింగపూర్, హాంకాంగ్, టోక్యోలలో మెరుగైన ప్రజారవాణా ఉంది. మన దగ్గర పాదచారుల బాటలపై అక్రమణలు తొలగిస్తే బస్సుస్టాప్, ఎంఎంటీఎస్, మెట్రో స్టేషన్ల వరకు నడిచి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్కైవాక్స్ కట్టుకోవాలి. శివార్లలో సైక్లింగ్ ట్రాక్లు ఉండాలి. బస్సులు సంఖ్య పెంచడం, ఎంఎంటీఎస్ విస్తరణ, మెట్రో రెండోదశ, కొత్తగా వచ్చే మెట్రోనియో, బీఆర్టీఎస్ల అనుసంధానం జరగాలి. కామన్ మొబిలిటీ కార్డు ఉండాలి. దీనిపై ఆర్టీసీతో కలిసి మెట్రో ప్రయత్నాలు చేస్తోంది.
ఏమిటీ మెట్రో నియో
ఈ విధానంలో మెట్రో మాదిరే రహదారి మధ్యలో పిల్లర్లపై ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ట్రాక్ బదులు రోడ్డు ఉంటుంది. రైళ్ల స్థానంలో బ్యాటరీ బస్సులు నడుస్తాయి. కిలోమీటర్కు రూ.110 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించవచ్చు.
బీఆర్టీఎస్ విధానంలో..
రహదారి మధ్యలో బస్సులకోసం రెండు లేన్లను ప్రత్యేకిస్తారు. ఒకవైపు రావడానికి, మరోవైపు వెళ్లడానికి వీలుగా ఉంటుంది. దీన్ని కిలోమీటర్కు రూ.20 కోట్లతో నిర్మించొచ్చు. మెట్రోకు మాత్రం కిలోమీటర్కు రూ.300కోట్ల వ్యయం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్