‘ఫరూక్‌ ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదు’

తన కక్షిదారు, రైల్వే కాంట్రాక్టర్‌ ఇజాజ్‌ ఫరూక్‌ ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని ఆయన తరఫున న్యాయవాది దివ్యం అగర్వాల్‌ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫరూక్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

Published : 19 Aug 2022 03:52 IST

ఈనాడు, హైదరాబాద్‌: తన కక్షిదారు, రైల్వే కాంట్రాక్టర్‌ ఇజాజ్‌ ఫరూక్‌ ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని ఆయన తరఫున న్యాయవాది దివ్యం అగర్వాల్‌ వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫరూక్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలకు సంబంధించి ఇటీవల మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారానికి సంబంధించి తన కక్షిదారు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. సమాధానం చెప్పాల్సిందిగా ఈడీకి రిట్‌ జారీ చేసిందన్నారు. దీనిలో భాగంగానే ఈడీ తన కక్షిదారుకి క్లీన్‌చిట్‌ ఇచ్చిందని, ఫరూక్‌ ఎలాంటి కుంభకోణానికి పాల్పడలేదని కూడా అందులో పేర్కొందని అగర్వాల్‌ వెల్లడించారు. కాంట్రాక్టుల కోసం రైల్వే అధికారులను ప్రలోభ పెట్టారనడం కూడా వాస్తవం కాదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని