మావోయిస్టు పార్టీకి చంద్రన్న సారథ్యమే?
తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథి నియామక ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది జూన్లో రాష్ట్ర కమిటీ అప్పటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో దండకారణ్యంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి
కొత్త కార్యదర్శి నియామకంపై నిర్ణయం వాయిదా!
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ మావోయిస్టు కమిటీ సారథి నియామక ప్రక్రియపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత ఏడాది జూన్లో రాష్ట్ర కమిటీ అప్పటి కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కరోనాతో దండకారణ్యంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పూర్తిస్థాయి బాధ్యతలు ఎవరికీ అప్పగించలేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్నకే తాజాగా సారథ్యం అప్పగించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన చంద్రన్న 1980 దశకంలోనే అప్పటి పీపుల్స్వార్ (ప్రస్తుతం మావోయిస్టు పార్టీ)లో చేరారు. తొలుత కొంతకాలం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పనిచేసిన తర్వాత దండకారణ్యానికి వెళ్లిపోయారు. సుదీర్ఘకాలం అక్కడే ఉండి పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మావోయిస్టు రాష్ట్ర కమిటీ ఏర్పాటుతో కేంద్ర కమిటీ సభ్యుడి హోదాలో మార్గదర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ కమిటీకి కార్యదర్శిగా ఉన్న హరిభూషణ్ స్థానంలో ఎవరిని నియమించాలనే అంశంపై పార్టీలో చర్చ జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్కు తాత్కాలికంగా ఆ బాధ్యతలు అప్పగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొద్ది రోజుల కిందట దండకారణ్యంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా పార్టీ సారథి అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర కమిటీలో దామోదర్తో పాటు బండి ప్రకాశ్ అలియాస్ ప్రభాత్, మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ సభ్యులుగా ఉన్నారు. వీరిలో ప్రభాత్, దామోదర్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన దామోదర్ ప్రస్తుతం తెలంగాణ మిలిటరీ చీఫ్గా ఉన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాంతానికి చెందిన ప్రభాత్ ప్రెస్ టీం బాధ్యతలు నిర్వర్తిస్తూనే సింగరేణి కోల్బెల్ట్ ఏరియా కమిటీకి సారథ్యం వహిస్తున్నారు. వీరి గురించి చర్చించిన అగ్రనేతలు.. కార్యదర్శి నియామకంలో కొంతకాలం వేచి ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు, ప్రస్తుతానికి చంద్రన్న సారథ్యంలోనే కార్యకలాపాలు సాగించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది.