నిర్లక్ష్యానికి మూల్యం.. నాలుగు ప్రాణాలు
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్ ఆసుపత్రి)లో
కు.ని. శస్త్రచికిత్సలు వికటించిన ఘటనలో మరో ఇద్దరు మహిళల మృతి
మిగిలిన 30 మంది వివిధ ఆసుపత్రులకు తరలింపు
ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెన్షన్
ఆపరేషన్లు చేసిన వైద్యనిపుణుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు
ఈనాడు - హైదరాబాద్
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహార కేంద్రం(సివిల్ ఆసుపత్రి)లో ఈ నెల 25న 34 మంది మహిళలకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన మొబైల్ బృందంలో ఉండే ఇద్దరు సర్జన్లు, ఒక అనస్తీషియా వైద్యుడు ఇందులో పాల్గొన్నారు. శస్త్రచికిత్సలు వికటించి ఆదివారం మాడ్గుల మండలం నర్సాయిపల్లికి చెందిన మమత(32), సోమవారం ఉదయం మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ(28), అర్ధరాత్రి మాడ్గుల మండలం రాజీవ్నగర్ తండాకు చెందిన మేరావత్ మౌనిక(24), మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నం మండలం సీతారాంపేట్కు చెందిన లావణ్య(28) మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. నలుగురు మహిళలు ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్లు, ఇందులో వైద్యుడు, ఆరోగ్యశాఖ సిబ్బంది నిర్లక్ష్యమున్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రాథమికంగా గుర్తించింది. శస్త్రచికిత్స చేశాక పరికరాలను సరిగా స్టెరిలైజేషన్ చేయలేదని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని విషయాలు వెలుగుచూసే వీలుంది. ఆపరేషన్లు జరిగిన తరువాత మూడోరోజు ఏఎన్ఎం, ఆరోగ్య కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి మహిళలకు కుట్లు వేసినచోట డ్రెస్సింగ్ చేయాలి. కానీ, కేవలం ఫోన్ చేసి సరిపెట్టినట్లు తెలిసింది. కు.ని. శస్త్రచికిత్సలు చేయించుకున్న 34 మందిలో నలుగురు చనిపోగా.. మిగిలిన 30 మందికి ఇళ్ల వద్ద, ఇబ్రహీంపట్నం ఆరోగ్య కేంద్రానికి తరలించీ పరీక్షలు నిర్వహించారు. కొందరికి జ్వరం, కోత దగ్గర చీము, ఇన్ఫెక్షన్ సమస్యలుండడంతో వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. తొలుత నలుగురిని ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి తీసుకురాగా.. తర్వాత నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్లో 19 మంది, అపోలో ఆసుపత్రిలో 11 మందికి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రమాదకర పరిస్థితులు లేవని వైద్యవర్గాలు తెలిపాయి. అపోలోలో చికిత్స పొందుతున్న ముగ్గురికి కోత పెట్టినచోట చీము పట్టినట్లు తేలడంతో దాన్ని తొలగించారు. మరికొందరు జ్వరంతో, బీపీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. నిమ్స్లో చికిత్స పొందుతున్న ఓ మహిళకు ఆయాసంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ను సస్పెండ్ చేసింది. శస్త్రచికిత్సలు చేసిన వైద్యనిపుణులు డాక్టర్ జోయల్ లైసెన్స్ను రాష్ట్ర వైద్య మండలి తాత్కాలికంగా రద్దు చేసింది. ఘటనను రాష్ట్ర మానవహక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ విషయంపై అక్టోబరు 10లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ను ఆదేశించింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్, హైదరాబాద్ డీఎంహెచ్వో వెంకటి మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి స్వరాజ్యలక్ష్మి ఆసుపత్రిలోనే ఉండి వైద్య సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్షించారు.
ఇకనుంచి రోజుకు గరిష్ఠంగా 10 శస్త్రచికిత్సలే..
ఒకే వైద్యుడు రోజుకు 30-40 సర్జరీలు చేయడం వల్ల ఒత్తిడిలో తప్పులు దొర్లే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒక సర్జన్ ఒక రోజులో 10 కంటే ఎక్కువ సర్జరీలు చేయకూడదని వైద్యారోగ్యశాఖ మంగళవారం ఆదేశాలు జారీచేసింది. డబుల్ పంక్చర్ ల్యాప్రోస్కోపీ విధానంలో శస్త్రచికిత్సలు చేసే నిపుణులు ప్రభుత్వ వైద్యంలో కేవలం నలుగురే ఉన్నట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.