NEET Results: నీట్ ఫలితాల్లో సిద్ధార్థరావుకు 5వ ర్యాంకు
తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు,
ఏపీకి చెందిన సాయికీర్తి తేజకు 12వ ర్యాంకు
మొదటి ర్యాంకు సాధించిన రాజస్థాన్ విద్యార్థి తనిష్క
అర్ధరాత్రి వెల్లడైన ఫలితాలు
టాప్ 50లో 8 మంది తెలుగు విద్యార్థులు
ఈనాడు, దిల్లీ: తెలంగాణకు చెందిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు 711 మార్కులతో నీట్ ఫలితాల్లో జాతీయస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. 710 మార్కులతో ఏపీకి చెందిన మట్టా దుర్గా సాయికీర్తి తేజ 12వ ర్యాంకు, 706 మార్కులతో నూని వెంకట సాయి వైష్ణవి 15వ ర్యాంకు, 705 మార్కులతో గుల్లా హర్షవర్ధన్నాయుడు 25వ ర్యాంకు సాధించారు. బాలికల్లో నూని వెంకటసాయి వైష్ణవి 6 స్థానం, చప్పిడి లక్ష్మి చరిత 14, వరుం అతిథి 20వ స్థానం దక్కించుకున్నారు. బాలురు విభాగంలో ఎర్రబెల్లి సిద్ధార్థరావు 3, మట్టాదుర్గాసాయి కీర్తి తేజ 8, గుల్లా హర్షవర్ధన్ నాయుడు 14వ స్థానాలను ఆక్రమించారు.
నీట్(యూజీ) 2022 ఫలితాలు బుధవారం అర్ధరాత్రి రాత్రి విడుదలయ్యాయి. మొత్తం 17,64,571 మంది అభ్యర్థులు జులై 17న పరీక్ష రాయగా అందులో 9,93,069(56.27శాతం) మంది అర్హత సాధించారు. గత ఏడాది ఇది 56.34 శాతంగా నమోదైంది. మొత్తం ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో ఓబీసీలు 45.03%, ఎస్సీలు 13.26%, ఎస్టీలు 4.76%, జనరల్ 28.41%, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 8.46% మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 68,061 మంది అభ్యర్థులు నమోదు చేసుకొని పరీక్షకు 65,305 మంది హాజరయ్యారు. అందులో 40,344 మంది (61.77%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి 61,207 మంది పేర్లు నమోదుచేసుకోగా, పరీక్షకు 59,296 మంది హాజరయ్యారు. అందులో 35,148 మంది (59.27%) మంది అర్హత పొందారు. జాతీయ సగటుతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువమంది అర్హత సాధించారు. రాజస్థాన్కు చెందిన తనిష్క 715 మార్కులతో జాతీయస్థాయి తొలిర్యాంకును కైవసం చేసుకున్నారు. దిల్లీకి చెందిన వత్సా ఆశిష్ బాత్రా రెండవ స్థానం పొందాడు.
టాప్ 50లో 8 మంది తెలుగువిద్యార్థులు చోటు దక్కించుకున్నారు. 705 మార్కులతో మంగసముద్రం హర్షిత్రెడ్డి 36వ ర్యాంకు, అంతే మార్కులతో తెలంగాణకు చెందిన చప్పిడి లక్ష్మి చరిత 37వ ర్యాంకు, కంచన జీవన్కుమార్రెడ్డి 41వ ర్యాంకు, 700 మార్కులతో వరుం అథితి 50వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. దివ్యాంగుల్లో తెలంగాణకు చెందిన వాసర్ల జశ్వంత్సాయి 661 మార్కులు సాధించి దేశంలో తొలిర్యాంకును ఆక్రమించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జూటూరి నేహ 695 మార్కులతో ఆల్ఇండియాలో 134 ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కోటాలో 10వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఎస్సీ కేటగిరిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కొమ్ము ఆదర్శ్ 685 మార్కులతో జాతీయ స్థాయిలో 7, ఆలిండియార్యాంకు విభాగంలో 453వ స్థానంలో నిలిచారు. ఎస్టీకోటాలో తెలంగాణకు చెందిన ముదావత్ లితేష్ చౌహాన్ 688 మార్కులతో తొలిస్థానంలో, గుగులోతు శివాని 680 మార్కులతో రెండోస్థానంలో, ఆంధ్రప్రదేశ్కు చెందిన వడిత్య తేజశ్విని 675మార్కులతో మూడోస్థానంలో నిలిచారు. వీరికి ఆలిండియా ర్యాంకుల్లో వరుసగా 400, 715, 1,112 దక్కాయి. అలాగే తెలంగాణకు చెందిన లవోద్య బ్రింద 671మార్కులతో 5, అనుమేహ భూక్య 670 మార్కులతో 6వ స్థానంలో నిలిచారు. ఆలిండియా ర్యాంకుల్లో 1374, 1619 దక్కించుకున్నారు. ఓబీసీ కోటాలో ఏపీకి చెందిన గుల్లా హర్షవర్ధన్నాయుడు 3వ ర్యాంకు, తెలంగాణకు చెందిన చందల యశశ్విణిశ్రీ 8వ స్థానం సొంతం చేసుకున్నారు. రాష్ట్రాలవారీగా చూస్తే తెలంగాణలో ఎర్రబెల్లి సిద్ధార్థ్ రావు, ఆంధ్రప్రదేశ్లో మట్టా దుర్గాసాయికీర్తి తేజ తొలిస్థానంలో నిలిచారు.
కార్డియాలజిస్ట్నవుతా!
మాది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సురారం గ్రామం. హైదరాబాద్ కూకట్పల్లిలో ఉండి చదువుకుంటున్నా. నాన్న హనుమంతరావు వ్యాపారి. అమ్మ లావణ్య గృహిణి. శ్రీ చైతన్యలో అధ్యాపకులు బాగా సహకరించారు. ఎప్పుడు ఏ చిన్న సందేహం వచ్చినా పరిష్కారం చూపేవారు. గంటలు గంటలు చదివేవాడిని కాదు. చదివిన కొద్దిసేపైనా ఏకాగ్రతతో సాధన చేసేవాడిని. ఫిజిక్స్లో తొలుత కొంచెం వెనుకబడ్డా. తర్వాత పుంజుకున్నా. టాప్5లో ఉంటానని ఊహించలేదు. దిల్లీ ఎయిమ్స్లో చేరడమే లక్ష్యం. కార్డియాలజిస్ట్గా సేవలందిస్తా. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్తా. తిరిగొచ్చి ఇక్కడ పేదలకు సేవలందిస్తా.
- ఎర్రబెల్లి సిద్ధార్థరావు, ఆల్ ఇండియా అయిదో ర్యాంకు, తెలంగాణ మొదటి ర్యాంకు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM