Cyber Crime: దోచుకునేందుకో ఆఫర్
సైబర్ దొంగలు ముందుగానే పండగ చేసుకుంటున్నారు. దసరా, దీపావళి పేరిట ఎడాపెడా ఆఫర్లు ప్రకటిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తక్కువకు వస్తున్నాయనే ఆశతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న కొందరు అసలు విషయం తెలిశాక కళ్లు తేలేస్తున్నారు.
ప్రముఖ ఈ-కామర్స్ సైట్ల పేరిట సైబర్ నేరస్థుల సందేశాలు
తక్కువ ధరకే వస్తువులంటూ ఊరించి ఊడ్చేస్తున్న ముఠాలు
నమ్మి మోసపోవద్దంటూ పోలీసుల హెచ్చరికలు
ఈనాడు - హైదరాబాద్
* సికింద్రాబాద్కు చెందిన చైతన్య సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇటీవల ఆయనకో వాట్సప్సందేశం వచ్చింది. ‘దసరా ధమాకా’ పేరుతో ఓ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఒక ఐఫోన్ కొంటే మరొకటి ఉచితం’గా ఇస్తుందన్నది దాని సారాంశం. అది నమ్మిన ఆ యువకుడు హడావుడిగా డబ్బు కట్టాడు. ఎన్ని రోజులు ఎదురుచూసినా ఫోన్ రాకపోవడంతో సదరు సంస్థ కస్టమర్కేర్కు ఫోన్ చేశాడు. అసలు ఆయన పేరుతో ఎలాంటి ఫోనూ బుక్ కాలేదని, అలాంటి ఆఫరేదీ తాము ఇవ్వలేదని అక్కడున్నవారు బదులిచ్చారు. సైబర్ పోలీసులను ఆశ్రయించగా, ఆయనకు వచ్చిన వాట్సప్ సందేశం నకిలీదని వారు తేల్చారు.
* మరో ఘటనలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ టీవీలను సగం ధరకే ఇస్తోందని, మూడు కంటే ఎక్కువ యూనిట్లు బుక్ చేసుకుంటే మరో పది శాతం డిస్కౌంట్ అదనంగా పొందవచ్చనే ప్రకటన వచ్చింది. ఆశపడిన ఓ చిరువ్యాపారి ఒకేసారి 4 టీవీలు కొనేందుకు రూ.లక్షన్నర కట్టాడు.. ఆపై నిలువునా మునిగాడు. ఇలాంటి ఉదంతాలెన్నో.
సైబర్ దొంగలు ముందుగానే పండగ చేసుకుంటున్నారు. దసరా, దీపావళి పేరిట ఎడాపెడా ఆఫర్లు ప్రకటిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తక్కువకు వస్తున్నాయనే ఆశతో కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న కొందరు అసలు విషయం తెలిశాక కళ్లు తేలేస్తున్నారు. ఇప్పటికే మొదలైన పండగల సీజన్ కారణంగా ఇలాంటి ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫర్లకు సంబంధించి అంతర్జాలంలో వచ్చే అనుచిత ప్రకటనలను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
దసరా, దీపావళి పండగల దృష్ట్యా ఇప్పటికే అనేక వాణిజ్య సంస్థలు ఆకట్టుకునేలా ప్రకటనలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆఫర్లకు పెట్టింది పేరైన ఈ-కామర్స్ సంస్థలయితే ఇలాంటి ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. నిజానికి ఈ సైట్లలో అనేక వస్తువులు తక్కువ ధరకు వస్తాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు మోసాలకు తెరతీస్తున్నారు. ప్రతి పండగల సీజన్లోనూ ఇలానే చెలరేగిపోతున్న నేరగాళ్లు ప్రస్తుత పర్వదినాల సమయంలో కొత్త ఎత్తుగడలతో సిద్ధమయ్యారు. బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సంస్థల పేర్లతో అనూహ్యమైన ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ ప్రముఖ సంస్థలు కావడంతో జనం సైతం గుడ్డిగా నమ్ముతున్నారు. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే ఈ సంస్థలకు చెందిన సొంత యాప్లలో షాపింగ్ చేసుకుంటే ఏ సమస్యా ఉండదు. కానీ, సైబర్ నేరగాళ్లు పంపుతున్న లింకుల్ని క్లిక్ చేస్తేనే ఇబ్బంది వస్తుంది. ఈ లింకులకు, అసలు సంస్థలకు ఎలాంటి సంబంధం ఉండదు. కాకపోతే, వాటి పేరుతో రూపొందిస్తున్న నకిలీ వెబ్సైట్లు ఇవి. వీటి ద్వారా కొనుగోళ్లు జరిపితే ఇంతే సంగతులు. కొన్న వస్తువు ఇంటికి చేరదు, చెల్లించిన డబ్బు తిరిగి రాదు. సాధారణంగా అన్ని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ‘పెయిడ్ ఆన్ డెలివరీ’ సౌకర్యం కల్పిస్తాయి. అంటే వస్తువులు అందాక కూడా డబ్బు చెల్లించవచ్చు. నకిలీ సంస్థలు మాత్రం ముందుగానే డబ్బు చెల్లించాలని చెబుతాయి. ఇలా అడిగాయంటే అనుమానించాల్సిందే.
ఈ జాగ్రత్తలు పాటించండి..
* తక్కువ ధరకే వస్తువులు అని చెబుతూ అంతర్జాలంలో వచ్చే ప్రకటనలు నమ్మవద్దు. ఈ పేరుతో పంపే లింకుల్ని తెరవవద్దు. వీటి ద్వారా నకిలీ యాప్లు ఫోన్లోకి చొరబడి, వ్యక్తిగత సమాచారమూ చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది.
* ఒకవేళ ఇలాంటి ప్రకటన వస్తే అసలు సంస్థ యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. కొనుగోళ్లూ దాని ద్వారానే చేయాలి.
* ఊరూపేరూ లేని సంస్థల పేర్లతో అతి తక్కువ ధరలకే వస్తువులు అమ్ముతామని వచ్చే ప్రకటనలు అసలు నమ్మొద్దు.
* కొన్ని సంస్థలు వస్తువు అందాకే డబ్బు కట్టొచ్చు అనే సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. తీరా డబ్బు చెల్లించాక పార్శిల్ విప్పిచూస్తే అందులో పనికిరాని వస్తువులు ఉంటున్నాయి. అందుకే నమ్మకమైన, సుపరిచితమైన సంస్థల్లోనే కొనుగోళ్లు చేయాలి.
* ఒకవేళ మోసపోయామని గ్రహించాక గూగుల్లో వెతికి సదరు సంస్థకు చెందిన కాల్సెంటర్కు ఫోన్ చేస్తే మరో మోసం జరిగే అవకాశమూ ఉంది. పోయిన డబ్బు తిరిగి చెల్లిస్తామంటూ బ్యాంకు వివరాలన్నీ సేకరించి ఉన్న డబ్బంతా ఊడ్చేసే ప్రమాదమూ పొంచి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.