నిమ్స్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు పెరగాలి
నిమ్స్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మరిన్ని ఎక్కువగా నిర్వహించాలని, క్యాన్సర్ చికిత్సలో బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
మంత్రి హరీశ్రావు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: నిమ్స్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మరిన్ని ఎక్కువగా నిర్వహించాలని, క్యాన్సర్ చికిత్సలో బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకూ క్యాన్సర్ చికిత్సలపై ప్రభుత్వం రూ.642 కోట్లు ఖర్చు చేసిందని, 2014-15తో పోల్చితే గతేడాది దాదాపు రెట్టింపు ఖర్చు చేశామని వెల్లడించారు. బుధవారం ఆయన నిమ్స్, ఎంఎన్జే ఆసుపత్రుల పనితీరుపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ‘‘నిమ్స్లో 200 పడకలతో మాతాశిశు సంరక్షణ ఆసుపత్రి(ఎంసీహెచ్) నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. ఎంఎన్జేలో త్వరలో కొత్తగా నిర్మిస్తున్న ఆసుపత్రి అందుబాటులోకి రానుంది. దీంతో పడకల సంఖ్య 450 నుంచి 750కి పెరుగుతుంది. క్యాన్సర్ పరీక్షలకు అన్ని జిల్లాల్లో మొబైల్ స్క్రీనింగ్ నిర్వహించాలి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ ఇన్ఫెక్షన్ నియంత్రణకు నిబంధనలు పక్కాగా పాటించాలి’’ అని మంత్రి సూచించారు.
సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శం
సంక్షేమ కార్యక్రమాల అమలులో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి హరీశ్రావు అన్నారు. పశుసంవర్ధక, మత్స్య శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ఫలితాలపై బుధవారం ఆయన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష జరిపారు. ‘‘దేశంలో మొదట తెలంగాణలోనే సంచార పశు వైద్యశాలలను ప్రారంభించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వాటిని ప్రారంభించడం తెలంగాణ ప్రగతికి నిదర్శనం. రూ.370 కోట్ల ఖర్చుతో 58,992 పాడి గేదెలను రాయితీపై పంపిణీ చేశాం. రోజుకు 5 లక్షల లీటర్ల పాల శుద్ధి సామర్థ్యం కలిగిన మెగా డెయిరీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్య సంపద మూడింతలు పెరిగింది. ఈ సంవత్సరం 350 నీటివనరుల్లో రూ.25 కోట్ల ఖర్చుతో 10 కోట్ల రొయ్య పిల్లల విడుదలకు చర్యలు చేపట్టాం’’ అని మంత్రులు తెలిపారు.
ఎస్సీ గురుకులాల విద్యార్థులకు సన్మానం
నీట్, జేఈఈ అడ్వాన్స్డ్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 240 మంది ఎస్సీ గురుకులాల విద్యార్థులను మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్యాదవ్లు బుధవారం ఎంసీహెచ్ఆర్డీలో సన్మానించారు. ఐఐటీలో 1439 ర్యాంకు సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థిని జి.వర్షిణి.. శాట్ పరీక్షతో విదేశీ యూనివర్సిటీల్లో ప్రవేశానికి అర్హత సాధించానని తెలపగా.. ఆమె చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రులు ప్రకటించారు. ఎస్సీ గురుకులాల నుంచి 160 మంది విద్యార్థినులు ఎంబీబీఎస్, 130 మంది ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మహిళల ఉన్నత విద్యకోసం 30 మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గౌలిదొడ్డి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) తరహాలో రాష్ట్రంలో మరో నాలుగు సీవోఈలను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్