KTR: ధాన్యం సేకరణనూ ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంటే.. మోదీ
మంత్రి కేటీఆర్ ధ్వజం
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి మాటలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం కొత్తపుంతలు తొక్కుతోంటే.. మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులపై కత్తికడుతోందని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టే కార్యక్రమానికి కేంద్రం తెరతీసింది. ఇప్పటికే ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తుండగా.. కొత్తగా వ్యవసాయం, విద్యుత్తు రంగాలపైనా కత్తికట్టింది. ఎఫ్సీఐ ద్వారా రాష్ట్రాల్లో ధాన్యం సేకరించడం వల్ల ఆర్థిక భారం పడుతోందంటూ ఈ విధానాన్నీ ప్రైవేట్పరం చేయాలని చూస్తోంది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాండే తాజాగా విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. ధాన్యం సేకరణలో ఐకేపీ, ప్యాక్స్లకు పోటీగా ప్రైవేట్ వ్యాపారులకు అవకాశం కల్పించబోతున్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలనూ ప్రైవేట్కు అప్పగించే కుట్రలకు తెరతీశారు. ప్రైవేట్ సంస్థలొస్తే సిరిసిల్ల జిల్లాలోని సెస్తోపాటు డిస్కంలలో రోజుకో ధర ఉంటుంది. రాష్ట్రంలో వ్యవసాయంతోపాటు దళితులు, గిరిజనులు, రజకులకు, పౌల్ట్రీ, వస్త్రోత్పత్తి రంగాలకు విద్యుత్ రాయితీని అడ్డుకునేందుకే ఇలాంటి విధానాలు తెస్తున్నారు. వ్యవసాయం, విద్యుత్ రంగాల బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం పార్లమెంటులో చర్చ లేకుండా.. దొడ్డిదారిన గెజిట్లను తీసుకొస్తోంది. కేంద్రం చర్యలను తిప్పికొట్టేందుకు ప్రజలంతా జాగరూకతతో వ్యవహరించాలి’’ అని కేటీఆర్ కోరారు.
ఒక్కసారీ మందు, డబ్బులు పంచలేదు..
సిరిసిల్లలో నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒక్కసారి కూడా ఓటర్లకు మందు, డబ్బులను పంచలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తనతో పోటీ పడాలనుకునేవారూ ఇలా మంచి పనులు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని, ఎవరికి ఓటేయాలో వారే నిర్ణయం తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు ట్యాబ్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. ‘‘పుట్టినరోజు నాడు కేకులు, బ్యానర్లు, హోర్డింగులు లాంటి ఆర్భాటాలకు డబ్బు ఖర్చు చేయకుండా ప్రజాసేవకు ఉపయోగించాలనే ఆలోచన మూడేళ్ల క్రితం వచ్చింది. అప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో సొంత ఖర్చుతో ఆరు అంబులెన్సులను అందజేశాను. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు సుమారు రూ.26 కోట్ల విలువైన 120 అంబులెన్సులను వైద్యారోగ్యశాఖకు అప్పగించారు. మరుసటి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,200 మూడు చక్రాల వాహనాలను అందజేశారు. ఈ ఏడాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 5వేల మందికి ట్యాబ్లను ఇస్తున్నాం. ఈ రోజు 890 మందికి పంపిణీ చేస్తున్నాం. మిగిలినవారికి మండలాల వారీగా కళాశాలల్లోనే ఇస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విద్యాసేవకు ముందుకు రావాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM