Telangana News: రూ.3 లక్షల ముచ్చటేది!
సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం కోసం ప్రజలు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాకే కొత్త పథకానికి అడుగులు ముందుకు పడతాయి. సొంత స్థలం ఉన్న అర్హులకు ఇల్లు కట్టుకునేందుకు రూ.అయిదు లక్షల
సొంత స్థలం ఉన్న అర్హులకు నగదు ఇస్తామన్న ప్రభుత్వం
ఏడాదిన్నరగా ఎదురుచూపులు
ఇంకా ఖరారు కాని మార్గదర్శకాలు
ఈనాడు - హైదరాబాద్
సొంత జాగా ఉన్నోళ్లు ఇల్లు కట్టుకునేందుకు ప్రభుత్వం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం కోసం ప్రజలు ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాకే కొత్త పథకానికి అడుగులు ముందుకు పడతాయి. సొంత స్థలం ఉన్న అర్హులకు ఇల్లు కట్టుకునేందుకు రూ.అయిదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు గత సంవత్సరం బడ్జెట్ సమయంలోనే ప్రభుత్వం పేర్కొంది. 2022-23 బడ్జెట్లో మరోసారి ప్రకటించినప్పటికీ ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.మూడు లక్షలకు పరిమితం చేసింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ నుంచి అందిస్తామని చెప్పినా.. అమల్లోకి రాలేదు. తర్వాత జూన్ నుంచి అన్నారు. తాజాగా అక్టోబరు నుంచి అమలవుతుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో లక్షల మంది ఈ పథకం కోసం నిరీక్షిస్తున్నారు.
రూపు మారిన పథకం
పేదల కోసం 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇచ్చే పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది. నిర్మాణ పనుల్లో బాగా జాప్యమవడం, పూర్తయినా లబ్ధిదారులకు అప్పగించడంలో ఆలస్యమవడం వంటి పరిస్థితులున్నాయి.నిర్మాణం పూర్తయి లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన ఇళ్లు లక్షకుపైగా ఉన్నాయి. మరోవైపు దరఖాస్తుదారుల సంఖ్య లక్షల్లో ఉంది. ఇళ్ల నిర్మాణానికి స్థలాలతోపాటు నిధుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పథకం రూపం మారుస్తూ.. సొంత జాగా ఉంటే రూ.మూడు లక్షలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు వేల మందికి రూ.మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు 2022-23 బడ్జెట్లో పేర్కొంది. ఈ కొత్త పథకానికి అర్హుల ఎంపికపై గృహనిర్మాణ శాఖ నుంచి చాలాకాలం క్రితమే ప్రతిపాదనలు వెళ్లాయి. ముఖ్యమంత్రి తాజాగా ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అధికారుల సమాచారం. అర్హులు ఎవరు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? విధివిధానాలు ఏంటన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
కేంద్ర పథకంతో కలిపా? విడిగానా?
కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో కలిపి ఇస్తారా? లేదా? అన్న విషయంపైనా స్పష్టత రావాల్సి ఉంది. కలిపి ఇస్తే లబ్ధిదారుల ఎంపికలో కేంద్ర నిబంధనల్ని పాటించాలి. ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఇళ్ల విషయంలో కేంద్ర నిబంధనలు అమలుచేయడం ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలో సొంత జాగా పథకాన్ని కేంద్ర పథకంతో కలిపి అమలుచేస్తారా? లేదా? అన్న సందేహాలున్నాయి. 2022-23 బడ్జెట్లో పాత, కొత్త ఇళ్ల పథకాలకు రూ.12 వేల కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే, ఇళ్లు నిర్మించిన గుత్తేదారులకు ఇప్పటికే రూ.900 కోట్ల బిల్లుల బకాయిలు ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం నాలుగు లక్షల మందికి రూ.మూడు లక్షల చొప్పున ఇస్తామని ప్రభుత్వం అంటోంది. ఈ లెక్కన రూ.12 వేల కోట్ల నిధులు కావాలి. బడ్జెట్లో కేటాయించిన రూ.12 వేల కోట్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల పూర్తికి ఎన్ని నిధులిస్తారు.. రూ.మూడు లక్షల పథకానికి ఎన్ని ఇస్తారన్నది కీలకంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలి
లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ ప్రతినిధులు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్