ధరణి చుట్టూ అక్రమాలు
రెండు నెలల క్రితం నాగర్కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన ఓ భూ యజమాని సిమ్ కార్డును బ్లాక్చేయించి.. కొత్త సిమ్ తీసుకుని ఆయన బంధువు 11.17 ఎకరాలను కాజేశారు. లావాదేవీల సందర్భంగా భూ యజమాని హాజరుకాకున్నా రెవెన్యూ సిబ్బంది
సాంకేతికత ఆధారంగా చక్రం తిప్పుతున్న దళారులు
దర్జాగా కొన్నిచోట్ల మోసాలకు తెరతీస్తున్న రెవెన్యూ సిబ్బంది
ప్రభుత్వం అప్రమత్తమవ్వాలంటున్న బాధితులు
ఈనాడు - హైదరాబాద్
రెండు నెలల క్రితం నాగర్కర్నూల్ జిల్లా కోడేరుకు చెందిన ఓ భూ యజమాని సిమ్ కార్డును బ్లాక్చేయించి.. కొత్త సిమ్ తీసుకుని ఆయన బంధువు 11.17 ఎకరాలను కాజేశారు. లావాదేవీల సందర్భంగా భూ యజమాని హాజరుకాకున్నా రెవెన్యూ సిబ్బంది గుడ్డిగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ను చేశారు. బాధితుడికి రైతుబంధు సాయం అందకపోవడంతో ధరణిలో పరిశీలించుకోగా అక్రమం వెలుగుచూసింది.
ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తి కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ధరణి విధానాన్ని అమల్లోకి తెచ్చింది. భూ యజమాని ఆధార్కార్డు, పాస్పోర్టు ఫొటో, సంతకం, సెల్ఫోన్ ఓటీపీ.. ఇవన్నీ ఉంటే ధరణి పోర్టల్లో సులువుగా యాజమాన్య హక్కుల మార్పిడి సాధ్యమవుతుంది. వీటినే తమ ఆయుధాలుగా చేసుకొని సాంకేతికత సహాయంతో కొందరు దళారులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై అక్రమాలు చేస్తున్నారు. నకిలీ పత్రాలు, సిమ్కార్డులతో భూ యాజమాన్య హక్కులను దర్జాగా బదలాయించుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి సంఘటనలు కొన్ని వెలుగుచూశాయి. భూ యజమాని తన దస్త్రాన్ని ధరణిలో పరిశీలించుకొనే వరకు జరిగిన మోసం బయటపడటం లేదు. ఉన్నతాధికారులు ఈ లోపాలపై దృష్టిసారించకపోతే మరిన్ని అక్రమాలు జరిగే అవకాశం ఉందని బాధితులు అంటున్నారు. మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ నమోదు చేసుకున్నాక వచ్చే గడువును బట్టి తహసీల్దారు- సంయుక్త సబ్ రిజిస్ట్రారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ లావాదేవీలకు సంబంధించిన ఇరువర్గాలు, సాక్షులు హాజరవుతున్నారు.ధరణిలో నమోదుకు తహసీల్దారు, ధరణి ఆపరేటర్ వేలిముద్ర (బయోమెట్రిక్) వేయాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీ వ్యవస్థ ఉండగా హక్కులు సులువుగా ఇతరుల పేర్లపైకి మారడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని మీసేవా కేంద్రాల ద్వారా దళారీలు చక్రం తిప్పుతుండటం ఒక కారణమైతే, కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది కూడా అక్రమంలో పాలుపంచుకోవడం మరో కారణం. కాకపోతే వారి పాత్రలు తెరపైకి రావడం లేదు.
అవకతవకలు జరిగాయి ఇలా...
* సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల నాగన్పల్లి వాసి శివమ్మకు చెందిన 27.34 ఎకరాల భూమి.. ఈ నెల 19న తనకు తెలియకుండానే ఆమె సోదరి పేరుపైకి మార్పిడి అయింది. గతేడాది ఏప్రిల్లో ఆమె భర్త మరణించగా ఫౌతి కింద ఆ భూమి శివమ్మ పేరుపైకి వచ్చింది. తాజాగా ఆమె కూడా మరణించిందని చెప్పి.. భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే జత చేసి భూమిని అక్రమంగా మార్పిడి చేశారు.
* వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలోని సర్వేనంబరు 80లో 22 గుంటల భూ యజమాని మరణించారని, వారసుడ్ని తానేనంటూ ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా విరాసత్ మార్పిడి (12.12.2021) జరిగిపోయింది. తీరా యజమాని గుర్తించిన తరువాత తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* గతేడాది వికారాబాద్ పరిధిలో రూ.3.5 కోట్ల విలువైన 7 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో తహసీల్దార్ కార్యాలయంలోని ముగ్గురు సిబ్బందిని జైలుకు పంపించారు. .
క్షేత్రస్థాయి విచారణ లేకపోవడమే..
భూ దస్త్రాల నిర్వహణలో చోటుచేసుకుంటున్న అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చింది. ఆలోచన బాగున్నా.. ప్రస్తుతం జరుగుతున్న లావాదేవీల్లో ఎక్కడా క్షేత్రస్థాయి విచారణ అనేది లేదు. దీనివల్ల అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోందన్న అభిప్రాయం ఉంది. కోర్ బ్యాంకింగ్ వ్యవస్థ తరహాలో భూమి మార్పిడి జరిగితే సెల్ఫోన్కు సందేశం వస్తుందని చెబుతున్నా.. అది జరగడం లేదని బాధితులంటున్నారు. కనీసం, భూ యాజమాన్య హక్కులు మార్పిడి జరిగేటప్పుడో.. జరిగిన తరువాతో గ్రామ పంచాయతీలో ఒక నోటీసు అంటిస్తే అందరికీ అవగాహన ఉంటుందన్న సూచనలు వస్తున్నాయి. అక్రమంతోనో.. పొరపాటుగానో.. యాజమాన్య హక్కులు ఒక్కసారి బదిలీ అయితే తిరిగి మళ్లీ పాత యజమాని పేరుపైకి మార్చడం సాధ్యం కావడం లేదు. దీనికోసం, మరోసారి స్లాటు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేయాల్సి వస్తోంది. ఫలితంగా లింకు డాక్యుమెంటేషన్ ఆధారాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భూ యజమానులు చెబుతున్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక విధానాన్ని తేవాలని సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి