న్యాయవ్యవస్థ పునర్నిర్మాణానికి నా వంతు కృషి చేశా
న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం కోసం సాధ్యమైనంత కృషి చేశానని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా రసమయి ఆధ్వర్యంలో శుక్రవారం
సినిమారంగంలో మార్పు అవసరం.. సినీపెద్దలు గమనించాలి
పొరుగు భాషా కవులకున్న ఆదరణ తెలుగువారికి లేదు
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
ఈనాడు, హైదరాబాద్: న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం కోసం సాధ్యమైనంత కృషి చేశానని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావు 99వ జయంతి సందర్భంగా రసమయి ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జస్టిస్ రమణకు ‘రసమయి- డా. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పల్లెటూరి నుంచి దిల్లీకి వెళ్లి జీవితంలో నేర్చుకున్న పాఠాలు, గుణపాఠాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలల కాలంలో చేయదగిన కార్యక్రమాలన్నీ చేశానని పేర్కొన్నారు. కానీ అనుకున్నవన్నీ సాధ్యపడలేదన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం తర్వాత న్యాయవ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలని ఆకాంక్షించానన్నారు. తెలుగు ప్రజల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకుని వారి గౌరవాన్ని నిలబెట్టగలిగానన్నారు. న్యాయమూర్తుల నియామకం, సౌకర్యాల కల్పన, న్యాయవ్యవస్థ ఆధునికీకరణ జరిగి ప్రజలకు సత్వర న్యాయం చేకూరాలన్నారు. ప్రజలు న్యాయస్థానాలంటే భయపడే స్థితి గతంలో ఉండేదని.. ఇప్పుడు సమస్య వస్తే ధైర్యంగా కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు.
మానవత్వంతో ఎదిగిన అక్కినేని
పొరుగు భాషా కవులు పొందుతున్న గౌరవం తెలుగు కవులకు దక్కడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎన్నార్ గురించి మాట్లాడుతూ.. పెద్దపెద్ద డిగ్రీలు, సంపద లేకున్నా మానవత్వంతో ఎదిగిన మనిషి అని కొనియాడారు. న్యాయమూర్తి కాకముందే తనకు ఏఎన్నార్తో పరిచయం ఉందని, ఎన్నో వేదికలు పంచుకుని మాట్లాడుకునేవాళ్లమని, అక్కినేని తన అనుభవాలను చెబుతుంటే సంతోషంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తెలుగువారైనందుకు గర్వంగా ఉందన్నారు.ఎన్టీఆర్తో ఉన్న సాన్నిహిత్యంతో 1982లో సినిమా రంగంపై కొంచెం పరిజ్ఞానం ఏర్పడిందని తెలిపారు. పాత సినిమాల మాదిరిగా ఇప్పటి సినిమాలు లేవన్నారు. సాంకేతికత, సదుపాయాలు పెరిగినా నాణ్యత కొరవడిందని దీన్ని సినీపెద్దలు గ్రహించాలన్నారు. రసమయి సంస్థతో తనకు 1983 నుంచి అనుబంధం ఉందంటూ.. అప్పట్లో జరిగిన పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాల జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. మాజీ ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి తనకు ఎంతో ఆప్తుడని, తాను జడ్జి అయిన తర్వాత.. శివుని అనుగ్రహం పొందేలా ఆయన తనకు బహూకరించిన సాలగ్రామం ఇప్పటికీ పూజగదిలో ఉందన్నారు. తనకు అన్నం పెట్టి పోషించిన గురువు అయ్యపురెడ్డి దగ్గరికి సుబ్బరామిరెడ్డి వచ్చే క్రమంలో పరిచయం ఏర్పడిందన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్రావు నిర్మొహమాటంగా మాట్లాడే వ్యక్తి అని.. ఆయన నుంచి తాను ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని జస్టిస్ రమణ అన్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులతోపాటు అక్కినేని కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ పి.ఎస్.రామ్మోహన్రావు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ కొద్దికాలమే పనిచేసినా న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, న్యాయమూర్తుల నియామకం, ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. శాంతాబయోటెక్ వ్యవస్థాపకులు డా.వరప్రసాద్రెడ్డి, మాజీ ఎంపీలు సుబ్బరామిరెడ్డి, మురళీమోహన్, ఆదాయపుపన్ను శాఖ విశ్రాంత చీఫ్ కమిషనర్ ఎం.నర్సింహప్ప, ఏఎన్నార్ మనుమరాలు, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకురాలు సుప్రియ తదితరులు మాట్లాడారు. సినీ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, ఎస్వీ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి కొలకలూరి ఇనాక్, అక్కినేని కుమార్తె నాగసుశీల తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం
పదవీ విరమణ తరువాత తొలిసారిగా నగరానికి
ఈనాడు, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించి ఇటీవలే పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్లో శుక్రవారం అపూర్వ స్వాగతం లభించింది. పదవీ విరమణ తర్వాత తొలిసారిగా ఆయన నగరానికొచ్చారు. ఆయన సతీమణి శివమాలతో కలిసి దిల్లీ నుంచి ఉదయం 9.27 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ డి.నాగార్జున స్వాగతం పలికారు. అనంతరం వీఐపీ లాంజ్లో హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత, జస్టిస్ ఎం.లక్ష్మణ్, జస్టిస్ సాంబశివనాయుడు, జస్టిస్ నాగార్జున, జస్టిస్ విజయభాస్కర్ రెడ్డి, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్, జస్టిస్ నగేశ్, జస్టిస్ కార్తీక్, జస్టిస్ కె.శరత్, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కె.సుజన, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్గౌడ్, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, జస్టిస్ ఎన్వీ రమణ వియ్యంకుడు రమేశ్, ఏపీ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తులతో కాసేపు ముచ్చటించాక జస్టిస్ రమణ బయటికి వచ్చారు. అప్పటికే పెద్దసంఖ్యలో సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. స్వాగత బ్యానర్లు ప్రదర్శిస్తూ పుష్పగుచ్ఛాలతో జస్టిస్ రమణ దంపతులకు ఆహ్వానం పలికారు.
పూలవర్షం మధ్య నివాస గృహంలోకి..
బంధుమిత్రులు, అభిమానులకు అభివాదం చేస్తూ జస్టిస్ ఎన్వీ రమణ నగరానికి బయల్దేరారు. విమానాశ్రయం నుంచి ఎస్ఆర్నగర్లోని ఆయన నివాసం వరకు అభిమానులు వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంటివద్ద కాలనీవాసులు, బంధువులు ఘనంగా స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు. ఇంటికి చేరుకోగానే పూలవర్షం కురిపిస్తూ ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం అభిమానులతో కలిసి జస్టిస్ రమణ కేకును కోశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు