వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

వివిధ డిప్లమో కోర్సుల్లో సీట్ల భర్తీకి గత మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత మిగిలిన ఖాళీల భర్తీకి శుక్రవారం ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శుక్రవారం తుది

Published : 24 Sep 2022 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ డిప్లమో కోర్సుల్లో సీట్ల భర్తీకి గత మూడు విడతల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించిన తర్వాత మిగిలిన ఖాళీల భర్తీకి శుక్రవారం ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శుక్రవారం తుది నోటిఫికేషన్‌ను జారీచేసింది. టీఎస్‌-పాలిసెట్‌ (అగ్రి, ఇంజనీరింగ్‌), పదో తరగతి తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు వీటికోసం ఈ నెల 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వర్సిటీ రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌ తెలిపారు. ‘‘దరఖాస్తుదారులు అక్టోబరు 1న విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో నిర్వహించే స్పాట్‌ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి. అభ్యర్థులు నిర్ణీత రుసుం, ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తేవాలి’’ అని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని