తెలంగాణకు కేంద్రం పూర్తి సహకారం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకారం అందిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాండ్ను కాపాడుకునేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇది మిగులు బడ్జెట్ ఉన్న
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
అక్కన్నపేట - మెదక్ రైలు మార్గం జాతికి అంకితం
ఈనాడు, మెదక్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకారం అందిస్తుందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. తెలంగాణ బ్రాండ్ను కాపాడుకునేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఇది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమని, దీన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. అక్కన్నపేట- మెదక్ నూతన రైలుమార్గాన్ని శుక్రవారం ఆయన జాతికి అంకితం చేశారు. మెదక్- కాచిగూడ ప్యాసింజర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ విస్తరణకు ఈ ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 15 ప్రాజెక్టులకు రూ.9,494 కోట్లు ఖర్చు చేసిందన్నారు. అందులో భాగంగానే అక్కన్నపేట- మెదక్ రైలు మార్గాన్ని పూర్తిచేశామన్నారు. దీన్ని సికింద్రాబాద్- ముంబయి మార్గానికి కలపడంతో మెదక్ ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణలో రికార్డుస్థాయిలో 298 కిలోమీటర్ల కొత్త మార్గాన్ని నిర్మించామన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను వచ్చే ఏడాది డిసెంబరులోగా అందుబాటులోకి తెస్తామని వివరించారు. భూసేకరణలో ఆలస్యమవుతోందని, త్వరలోనే వరంగల్లో రూ.400 కోట్లతో ఓవర్హాలింగ్ ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తామన్నారు. దీనివల్ల మూడువేలమందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రూ.653 కోట్లతో ఆధునికీకరిస్తామని, పనులు అక్టోబరులో మొదలవుతాయన్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ... ఏ రాష్ట్ర ప్రభుత్వమూ రైల్వే మార్గం కోసం 50 శాతం నిధులు ఇవ్వదని, తెలంగాణ ప్రభుత్వం మాత్రం సగం నిధులను అందించిందన్నారు. మెదక్ నుంచి జోగిపేట, సంగారెడ్డిల మీదుగా ఈదులనాగులపల్లి వరకు కొత్త రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ తాము చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, రఘునందన్రావు, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పోటాపోటీ నినాదాలు: రైలుమార్గాన్ని జాతికి అంకితమిచ్చే సందర్భంగా తెరాస, భాజపా కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. జై కేసీఆర్, జై తెలంగాణ నినాదాలతో తెరాస కార్యకర్తలు... జై మోదీ, భారత్మాతాకీ జై నినాదాలతో భాజపా కార్యకర్తలు హోరెత్తించారు. ఎమ్మెల్యేలు రఘునందన్రావు, పద్మా దేవేందర్రెడ్డికలగజేసుకొని వారిని శాంతింపజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల రుణం సేకరణ నిమిత్తం బాండ్లను వేలం వేయనున్నట్లు రిజర్వుబ్యాంకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 23న వీటిని వేలం వేయనున్నట్లు వివరించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)