గ్రూపు-2పై రేపు ఉచిత అవగాహన సదస్సు

త్వరలో జరిగే గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కృష్ణప్రదీప్‌ ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం

Published : 24 Sep 2022 05:44 IST

ఈనాడు, హైదరాబాద్‌:  త్వరలో జరిగే గ్రూపు-2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం కృష్ణప్రదీప్‌ ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 25న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 10 గంటల నుంచి ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు అకాడమీ ఛైర్మన్‌ పి.కృష్ణప్రదీప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌, సీఎం ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్‌, విశ్రాంత ఐఏఎస్‌ చిరంజీవులు, ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ గణేశ్‌ తదితరులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని