పట్టణాలకూ పురస్కారాల పంట
తెలంగాణలోని పుర, నగరపాలికలకు పురస్కారాల పంట పండింది. రాష్ట్రంలోని 16 పుర,నగరపాలికలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు దక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ జాతీయ
రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు ఉత్తమ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు
పారిశుద్ధ్య నిర్వహణ సేవలకు గుర్తింపు
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హర్షం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని పుర, నగరపాలికలకు పురస్కారాల పంట పండింది. రాష్ట్రంలోని 16 పుర,నగరపాలికలు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు దక్కించుకున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ జాతీయ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్య నిర్వహణకు స్టార్ రేటింగ్ ఇచ్చి వీటిని ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ స్వచ్ఛసర్వేక్షణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, చెత్త రహిత వాణిజ్య ప్రాంతాలు, ప్రజా మరుగుదొడ్లు, సామాజిక సౌచాలయాల నిర్వహణ, ప్రజల అవగాహన, భాగస్వామ్యం, ఆవిష్కరణలు వంటి 90 అంశాలపై అధ్యయనం అనంతరం ఉత్తమ పట్టణ స్థానిక సంస్థలను ఎంపిక చేశారు.
దీంతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఓడీఎఫ్ ప్లస్గా 70... ఓడీఎఫ్ డబుల్ ప్లస్గా 40 సంస్థలను, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్ ప్లస్గా, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహిత పట్టణాలు(ఓడీఎఫ్)గా ప్రకటించింది. అవార్డులకు ఎంపికైన పట్టణ స్థానిక సంస్థలకు అక్టోబరు 1న దిల్లీలో స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులను ప్రదానం చేస్తారు.
పురస్కారానికి ఎంపికైన పట్టణ సంస్థలు
బడంగ్పేట, ఆదిభట్ల, భూత్పూర్, చండూరు, చిట్యాల, గజ్వేల్, ఘట్కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజల్, వేములవాడ
దేశానికి ఆదర్శంగా తెలంగాణ: కేటీఆర్
రాష్ట్రంలోని పురపాలికలు ఈ సంవత్సరం కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడంపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాలు గ్రామాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతకు గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో దక్కుతున్న అవార్డులే నిదర్శనమన్నారు. రెండ్రోజుల క్రితమే కేంద్రం ప్రకటించిన గ్రామీణ స్వచ్ఛసర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. తాజాగా పట్టణ సంస్థలు విజయఢంకా మోగించాయన్నారు. పట్టణ అభివృద్ధి, పరిపాలన రంగాల్లో సైతం తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. అవార్డులకు ఎంపికైన 16 పట్టణ సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణ ప్రగతి కార్యక్రమంతో పౌరులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
సంస్కరణలతో ప్రగతికి పట్టం
స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలపై సీఎం కేసీఆర్ ఆనందం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణలతో తెలంగాణ పట్టణప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డులు రావడం పట్టణాల అభ్యున్నతిపై ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థంగా నిర్వహిస్తూ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేశారంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, భాగస్వాములైన అన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. ఇప్పటికే గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద రాష్ట్రం పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకుని దేశంలో అగ్రస్థానం పొంది చరిత్ర సృష్టించిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం