నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ఆంధ్రప్రదేశ్‌ తీరంపై గాలులతో ఉపరితల ఆవర్తనం 1,500 మీటర్ల ఎత్తున ఏర్పడింది. మరోవైపు పశ్చిమ, వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ

Updated : 25 Sep 2022 06:14 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య ఆంధ్రప్రదేశ్‌ తీరంపై గాలులతో ఉపరితల ఆవర్తనం 1,500 మీటర్ల ఎత్తున ఏర్పడింది. మరోవైపు పశ్చిమ, వాయువ్య భారత ప్రాంతాల నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణలోకి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అత్యధికంగా పెంబి (నిర్మల్‌ జిల్లా)లో 5.2, ఖాజాగూడ (రంగారెడ్డి)లో 1.9, టీక్యాతండా (నల్గొండ)లో 1.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని