త్వరలో మహిళా గురుకుల కళాశాలలు
గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు చెప్పారు. తెలంగాణ రాకముందు ఇది కేవలం రూ.360 కోట్ల లోపే ఉండేదన్నారు. పదో తరగతి తర్వాత
కర్ణాటకలో ఇస్తున్న పింఛను రూ. ఏడు వందలే
ఇక్కడా డబుల్ ఇంజన్ సర్కారు వస్తే సంక్షేమం బంద్
మంత్రి హరీశ్రావు వెల్లడి
ఈనాడు, సంగారెడ్డి: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏటా రూ.3,300 కోట్లు ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు చెప్పారు. తెలంగాణ రాకముందు ఇది కేవలం రూ.360 కోట్ల లోపే ఉండేదన్నారు. పదో తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ చదువుకునేలా అన్ని గురుకులాల స్థాయిని పెంచామన్నారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నతంగా రాణిస్తున్నారన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవిద్య, పీజీ కోర్సుల బోధనకు మహిళా గురుకుల కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. మొగుడంపల్లిలో గిరిజన బాలికల గురుకులాన్ని ప్రారంభించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో గతంలో అన్ని గురుకులాలు కలిపి 298 ఉండగా.. తెలంగాణ ఏర్పడ్డాక ఆ సంఖ్య 980కి చేరింది. గిరిజన గురుకులాల్నే 103 అందుబాటులోకి తెచ్చాం. ఒక్కో విద్యార్థిపై రూ.లక్ష ఖర్చుచేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారు. అందుకే సద్ది తిన్న రేవును తలవాలి. పొరుగున కర్ణాటకలో ఇస్తున్న పింఛను రూ.700 మాత్రమే. ఇక్కడ భాజపా వస్తే అదే పరిస్థితి ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే సంక్షేమం నిలిచిపోతుంది. మహిళలకు వడ్డీలేని రుణాలను త్వరలోనే అందిస్తాం’’ అని హరీశ్రావు వివరించారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, జడ్పీ అధ్యక్షురాలు మంజుశ్రీ, కలెక్టర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థినికి రూ.వెయ్యి బహుమతి
ఈ సందర్భంగా అక్కడి విద్యార్థినులకు మంత్రి హరీశ్రావు క్విజ్ పోటీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పాటైంది, గిరిజన సంక్షేమ మంత్రి ఎవరు, లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి, ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం సాయం అందిస్తున్న పథకాల పేర్లేంటి.. ఇలా దాదాపు 15 ప్రశ్నలు అడిగారు. వీటన్నింటికీ అందరూ చకచకా సమాధానాలిచ్చారు. చివరగా కొండాపూర్ మండలం మాచేపల్లికి చెందిన విద్యార్థిని రాధను.. మంజీరా నదిపై నిర్మించిన ప్రాజెక్టు పేరేంటని అడిగారు. ఆమె సింగూరు అని ఠక్కున సమాధానమివ్వడంతో దసరాకు కొత్త దుస్తులు కొనుక్కో అంటూ హరీశ్రావు రూ.1000 అందించారు.
హైదరాబాద్కు వినిపించేలా చప్పట్లు కొట్టాలి: కలెక్టర్
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ.. తాను గిరిజన కుటుంబంలో పుట్టానని, అప్పట్లో నిత్యం 5 కిలోమీటర్లు నడిచి బడికి వెళ్లేవాడినని చెప్పారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడు నిత్యం బాబూఖాన్ భవనాన్ని చూసేవాడినని, అలాంటి భవనాన్ని ఇప్పుడు స్థానిక మొగుడంపల్లిలో చూసి ఇందులో చదువుకోవాలనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జహీరాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న మంత్రి హరీశ్రావుకు ప్రజలు కృతజ్ఞతలు చెప్పేలా.. హైదరాబాద్ వరకు వినిపించేలా చప్పట్లు కొట్టాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్వో పెంచింది. -
ఉపాధి హామీకి కూలీలను పెంచాలి
రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని... కూలీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
రాజ్భవన్లో సీతారామ కల్యాణం
రాజ్భవన్లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సతీమణి సుమతి రాధాకృష్ణన్తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం
తాజా వార్తలు (Latest News)
-
డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
-
అధిక సమయం ఆన్లైన్లో ఉంటే.. పిల్లలు బడికి గైర్హాజరయ్యే ముప్పు అధికం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
గంజాయి మిల్క్షేక్!.. మత్తు ముఠాల నయా దందా
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’