తనిఖీలు.. తాఖీదులు..!
రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆసుపత్రులను కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు
నిబంధనలు పాటించని ఆసుపత్రులపై వైద్యారోగ్య శాఖ ఉక్కుపాదం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ఆసుపత్రులను కట్టడి చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తూ అనుమతి లేని వాటిపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రమాణాలు పాటించని వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తోంది. కొన్నింటిని సీజ్ చేస్తూ వాటిలో పనిచేస్తున్నవారికి నోటీసులు ఇచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులను తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిపై చర్యలు తీసుకోవాలని, పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గురువారం ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా వైద్యాధికారుల నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు ఆయా జిల్లాల్లోని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు, పాలిక్లినిక్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ఫిజియోథెరపీ, డెంటల్ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించాయి. అనుమతులు ఉన్నాయా? వాటిని పునరుద్ధరించుకున్నారా? మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై ఆరా తీస్తున్నాయి. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాలని జిల్లా వైద్యాధికారులు నిర్ణయించారు.
శనివారం తనిఖీలు ఇలా..
* ప్రత్యేక బృందం అధికారులు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 49 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 14 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరో మూడింటికి జరిమానా విధించారు. రెండింటిని సీజ్ చేశారు.
* రంగారెడ్డి జిల్లాలో 53 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి 36 హాస్పిటళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 7 ఆసుపత్రులకు నోటీసులు అందించారు.
* సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ఆసుపత్రులను మంత్రి హరీశ్రావు తనిఖీ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా దవాఖానాలు నిర్వహిస్తున్న ఆర్ఎంపీ వైద్యులు, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ, హోమియో క్లినిక్లు, డయాగ్నొస్టిక్ కేంద్రాలకు వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు.
* మహబూబ్నగర్ జిల్లాలో 3రోజుల్లో 62 ఆసుపత్రులను తనిఖీ చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న 17 యాజమాన్యాలు, డాక్టర్లకు నోటీసులు అందజేశారు. అడ్డాకులలో ఒక హాస్పిటల్ను సీజ్ చేశారు. నాగర్కర్నూల్ జిల్లాలో ఒక ప్రైవేటు ఆసుపత్రిని, ఆర్ఎంపీ వైద్యులు నిర్వహిస్తున్న రెండు క్లినిక్లను సీజ్ చేశారు.
* సూర్యాపేట జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న రెండు దవాఖానాలకు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఓ ఆసుపత్రిని సీజ్ చేశారు.
* నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
* కరీంనగర్ జిల్లాలోని 35 ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన అధికారులు కొన్నింట్లో లోపాలను గుర్తించారు. వాటిని సవరించుకోవాలని ఆదేశాలిచ్చారు. పెద్దపల్లి జిల్లాలో 13 ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి నాలుగింటికి నోటీసులు ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో అయిదు ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇందులో ఒకదాని అనుమతి రద్దుకు సిఫారసు చేశారు.
* హనుమకొండ జిల్లాలో రుసుముల పట్టిక, అనుమతి పత్రాలు ప్రదర్శించని మూడు దవాఖానాలు, రిజిస్ట్రేషన్ లేని ఓ దంత వైద్య ఆసుపత్రికి షోకాజ్ నోటీసు అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి భగభగ.. ‘ఆరెంజ్’ హెచ్చరికల జారీ
రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా... మంగళవారం మరింత అధికమయ్యాయి. ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. -
న్యాయవాదులు సామాజిక ఇంజినీర్లు
‘నేను చదువుకునే రోజుల్లో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వైద్య విద్య, ఇంజినీరింగ్ కోర్సులను తొలి ప్రాధాన్యంగా ఎంపికచేసేవారు. -
అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. -
టెండర్లు లేకుండా రూ.270 కోట్ల పనులు!
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సచివాలయానికి అవసరమైన ఐటీ సామగ్రి కొనుగోలులో నిబంధనలు ఉల్లంఘించినట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా గుర్తించింది. -
కవితకు 15 రోజుల రిమాండ్
దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలపై అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవితకు రౌజ్ అవెన్యూ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆమెను ఉదయం 11 గంటలకు న్యాయస్థానం ముందు హాజరుపరిచి.. జ్యుడిషియల్ రిమాండ్ కోరారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ బాధ్యతల స్వీకరణ
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్పాల్ మంగళవారం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే.. జస్టిస్ సుజయ్పాల్తో ప్రమాణం చేయించారు. -
నాగార్జునసాగర్ భద్రతపై సమగ్ర అధ్యయనం
నాగార్జునసాగర్ డ్యాం భద్రతపై సమగ్రంగా అధ్యయనం చేయించాలని.. జాతీయ డ్యాం సేఫ్టీ చట్టం-2021 ప్రకారం ఇది తప్పనిసరని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. -
మానేరు.. కనిపించని నీరు
వేసవికాలం ప్రారంభంలోనే నీరు అడుగంటడంతో కరీంనగర్లోని దిగువ మానేరు డ్యాం ఇలా ఎడారిని తలపిస్తోంది. -
శ్రీవారిని దర్శించుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు, ఇతర కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. -
భక్తులకు అందుబాటులో తితిదే పంచాంగం
శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని భక్తులకు తితిదే అందుబాటులో ఉంచింది. ప్రతి ఏడాది తరహాలోనే ఈ నూతన తెలుగు సంవత్సరాది పంచాంగాన్ని తితిదే ముద్రించింది. -
యాగ్జిలరీ పదోన్నతులపై ఆరా
పోలీసు శాఖలో ప్రణీత్రావు వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. ఆయన మాదిరిగానే యాగ్జిలరీ పదోన్నతులు పొందిన వారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. -
రామప్ప ఆలయంలో సోమసూత్రం సమస్యకు పరిష్కారం
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప ఆలయంలో సోమసూత్రం (శివలింగ అభిషేక జలం బయటకు వెళ్లే మార్గం) సమస్య పరిష్కారమైంది. -
ఐఎంజీ భూకేటాయింపు వ్యవహారం.. సీబీఐ దర్యాప్తు చేయాలన్న పిటిషన్ విచారణ వాయిదా
ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 850 ఎకరాల భూమి కేటాయింపు వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు ఏప్రిల్ మొదటివారానికి వాయిదా వేసింది. -
గ్రూపు 1 దరఖాస్తుల సవరణకు నేడు తుది గడువు
టీఎస్పీఎస్సీ గ్రూపు-1 దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు కల్పించిన గడువు బుధవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుందని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. -
చెత్త శుద్ధి టెండర్లు ఏమైనట్లు..?
రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో రెండేళ్లుగా ఘన వ్యర్థాలు(చెత్త) ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయి. రోజువారీగా చెత్తను శుద్ధి చేసేందుకు ఆహ్వానించిన టెండర్లు కొలిక్కి రావడం లేదు. -
9.14 లక్షల ఓట్ల తొలగింపు
రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
బిల్లులు ఇవ్వాలి.. అనుమతులు రావాలి..
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పెండింగ్ బిల్లులు మంజూరు కావాల్సి ఉండటంతోపాటు పలు అనుమతులు రావాల్సి ఉందని ఇంజినీర్లు పేర్కొన్నారు. -
వాలంటీర్ల ‘సాక్షి’ కొనుగోలుపై నేడు దిల్లీ హైకోర్టు విచారణ
ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సాక్షి దినపత్రిక కొనుగోలు వ్యవహారంపై తదుపరి విచారణను దిల్లీ హైకోర్టు బుధవారం చేపట్టనుంది. -
హార్డ్డిస్క్ల విశ్లేషణతో ఆధారాల సేకరణ!
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ)లో వినియోగించిన సాంకేతికతను ఎలా సమకూర్చుకున్నారు..? -
నూతన హైకోర్టుకు నేడు సీజేఐ శంకుస్థాపన
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. -
ఏప్రిల్లో జలాశయాల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్
వేసవి నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరాపై రోజూ టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు