పరీక్షలతో జన్యు వ్యాధులకు చెక్
తల్లిదండ్రుల్లో జన్యులోపాల కారణంగా పుట్టబోయే పిల్లల్లో వచ్చే వ్యాధులు జీవితాంతం వేధిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాధులు ఆరువేల వరకు ఉన్నాయి. దేశంలో ఏటా రెండున్నర కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు
అందుబాటులో ప్రభుత్వ కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: తల్లిదండ్రుల్లో జన్యులోపాల కారణంగా పుట్టబోయే పిల్లల్లో వచ్చే వ్యాధులు జీవితాంతం వేధిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా వ్యాధులు ఆరువేల వరకు ఉన్నాయి. దేశంలో ఏటా రెండున్నర కోట్ల మంది శిశువులు జన్మిస్తున్నారు. వీరిలో 17 లక్షల మందిలో ఏదో ఒక జన్యులోపం ఉంటోంది. ముఖ్యంగా దగ్గరి బంధువుల్లో పెళ్లిళ్లు చేసుకున్న జంటలు జన్యు కౌన్సెలింగ్, జన్యు పరీక్షలు చేయించుకోవడం అవసరం. ప్రైవేటులో ఇందుకు భారీ ఖర్చు అవుతుండటంతో చాలామంది వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికి వెసులుబాటు కలిగించేలా హైదరాబాద్లో రెండు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్ల కంటే తక్కువ ధరకే ఇక్కడ పరీక్షలు చేస్తారు.
ముందే అడ్డుకట్ట
జన్యుపరమైన వ్యాధుల్లో 600 రకాలను ముందే గుర్తించడం ద్వారా, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. బేగంపేటలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్లో కౌన్సెలింగ్ సహా దాదాపు 31 రకాల పరీక్షలకు అవకాశం ఉంది. పుట్టే పిల్లల్లో థలస్సేమియా, విల్సన్ డిసీజ్, క్లెమ్ సెల్టర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, హైపోథైరాయిడిజం, ఎడ్రినల్ హైపర్క్లేషియా తదితర జన్యు సంబంధ సమస్యలను పరీక్షల ద్వారా ముందే గుర్తిస్తే.. పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శిశువు పుట్టిన వెంటనే వీటిని గుర్తించకపోవడం వల్ల తర్వాత తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. కొందరు చిన్నారులు జీవితాంతం నరకం అనుభవిస్తుంటే.. తల్లిదండ్రులూ సతమతమవుతున్నారు. కొందరు పిల్లలు.. పుట్టిన రెండు, మూడేళ్లకు మృత్యువాత పడుతున్నారు. పుట్టిన నెల రోజుల లోపు రక్తపరీక్షలు చేసి.. వారికి జన్యు వ్యాధులు వచ్చే అవకాశం ఉందో లేదో తెలుసుకోవచ్చు. చాలామంది పిల్లల్లో 4-5 ఏళ్ల తర్వాత ఈ వ్యాధులు బయటపడుతుంటాయి. మెదడు ఎదుగుదల లోపాలకూ చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి సాధారణ పిల్లల మాదిరిగా తీర్చిదిద్దవచ్చు. పుట్టబోయే పిల్లల్లో జన్యులోపాలను గర్భిణికి స్కానింగ్ ద్వారా గుర్తించే వీలూ ఉంది. ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు.
తక్కువ ఖర్చుతో జీనోమ్ ఫౌండేషన్ సేవలు
సహజ విధానంతో పాటు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు కనాలనుకునే వారూ జన్యుపరీక్షలు చేయించుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సహజ గర్భధారణ సమస్యల కారణంగా ఎక్కువ మంది దంపతులు ఇటీవల కాలంలో ఇన్విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) ద్వారా సంతానం పొందుతున్నారు. శరీరానికి వెలుపల వీర్యంతో అండాన్ని ఫలదీకరణం చేసే పద్ధతిని ఇందులో అనుసరిస్తారు. ఈ విధానంలో పిల్లల్ని కనాలనుకునే వారికి పరీక్షలు మరింత ముఖ్యమని జీనోమ్ ఫౌండేషన్ అంటోంది. బంజారాహిల్స్లో ఉన్న ఈ సంస్థ కూడా తక్కువ ధరలకే వివిధ పరీక్షలు చేస్తోంది. వీటిపై వైద్యులు, కాబోయే తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తోంది. జిల్లాల్లోనూ వర్క్షాపులు ఏర్పాటు చేస్తోంది. పిల్లలు ఆరోగ్యకరంగా జన్మించేందుకు తమ సేవలను ఉపయోగించుకోవాలని ఫౌండేషన్ కోరుతోంది. జన్యుపరీక్షలు చేయించుకోవాలనుకునేవారు నేరుగా గానీ, 9704899766 మొబైల్ నంబరులో గానీ సంప్రదించవచ్చు. వైద్యులు కౌన్సెలింగ్ చేసిన తర్వాతే అవసరమైన పరీక్షలను సూచిస్తారు. ‘జన్యులోపాలను గుర్తించేందుకు ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నసిస్ (పీజీడీ) నిర్వహిస్తాం. కుటుంబంలో ఎవరికైనా ఎముక మజ్జ దాత అవసరమైనప్పుడు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. వంధ్యత్వానికి సంబంధించి ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్, టెస్టింగ్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి’ అని ప్రసాద్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, కన్సల్టెంట్ గైనకాలజిస్టు డాక్టర్ సుమా ప్రసాద్ సూచించారు. ‘జన్యువ్యాధుల గుర్తింపులో రోగ నిర్ధారణ పరీక్షలను తక్కువ ఖర్చుకే చేస్తున్నాం’ అని ఫౌండేషన్ డైరెక్టర్ అపర్ణ కాజా తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)