ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూత
సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక.. పంటల కోసం తీసుకున్న అప్పులు తీరక.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూతనిచ్చారు ఓ వ్యాపారవేత్త. ఇప్పటికే
100 మందికి రూ.కోటి సాయం అందజేత
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఛైర్మన్ చక్రధర్గౌడ్ ఉదారత
సిద్దిపేట, న్యూస్టుడే: సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరలు రాక.. పంటల కోసం తీసుకున్న అప్పులు తీరక.. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చేయూతనిచ్చారు ఓ వ్యాపారవేత్త. ఇప్పటికే సుమారు 350 మంది నిరుపేద కుటుంబాలను ఆదుకున్న సిద్దిపేట వాసి, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఛైర్మన్ చక్రధర్గౌడ్ తాజాగా.. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న 100 మంది కౌలు, ఇతర రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున కోటి అందజేసి తన ఔదార్యం చాటుకున్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బాధిత కుటుంబాలను ఆదివారం సిద్దిపేటకు ఆహ్వానించి భార్య ఆరోషికతో కలిసి వారికి చెక్కులు, చీరలను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని, తాను తోడుగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. రాజకీయ లబ్ధి, వ్యక్తిగత ప్రచారం కోసం ఈ పనిచేయడంలేదని జీవితమంతా రైతు సేవకే అంకితమవుతానని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం అందజేసే రైతుబంధు సాయాన్ని సంపన్నులు స్వచ్ఛందంగా వదులుకుంటే నిరుపేద రైతులు, కౌలుదారులకు మేలు జరిగే అవకాశముంటుందని అభిప్రాయపడ్డారు. గవర్నర్ తమిళిసై ఈ కార్యక్రమానికి అనివార్య పరిస్థితుల్లో రాలేకపోయారని, దీంతో గవర్నర్ తల్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.కోటి చొప్పున తెప్పించి ఎక్కడికి పంపారు..?
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి(ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికీ మలుపులు తిరుగుతూనే ఉంది. -
వరంగల్ విమానాశ్రయంపై కదలిక.. ప్రాథమిక సర్వేకు ఏఏఐ కసరత్తు
వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) కసరత్తు చేపట్టింది. -
బొండా ఉమా పేరు చెప్పాలంటూ.. ఒత్తిడి చేశారు
‘మీ నాయకులు కానీ బొండా ఉమా కానీ.. సీఎం జగన్పై రాయి వేయించమన్నారా అని పోలీసులు నన్ను విచారణలో పదే పదే ప్రశ్నించారు. అసలు ఆ ఘటనతో నాకు సంబంధమే లేనప్పుడు.. వారు చేయమన్నారని ఎలా చెప్పేదని గట్టిగా ప్రశ్నించా.. దీనికి పోలీసులు నాపై రెండు దెబ్బలేశారు. -
తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు ప్రారంభం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. వసంత రుతువులో శ్రీమలయప్ప స్వామివారికి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. -
ఉచితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రజలకు ఉచితాలు ఇవ్వడంపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు మోదీ సర్కారు ప్రయత్నించాలని, వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. -
ఇదీ సంగతి!
-
మెతుకు సీమలో యాపిల్ తోట
శీతల ప్రాంతాలకు పరిమితమైన పంట యాపిల్. కశ్మీర్, హిమాచల్ప్రదేశ్ వంటి చల్లటి వాతావరణంలో మాత్రమే దీనిని పండిస్తారు. -
యాదాద్రిలో భక్తుల రద్దీ
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్ష్రేతానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి దర్శనమార్గాలు కిక్కిరిశాయి. పూజలు నిర్వహించిన ఆర్జిత భక్తులతో మండపాలు సందడిగా మారాయి. -
ఆరుగురు మావోయిస్టుల లొంగుబాటు
నలుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు, ఇద్దరు మావోయిస్టు సభ్యులు తమ వద్ద లొంగిపోయారని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. -
టీఎస్ఆర్జేసీ పరీక్షకు 84 శాతం హాజరు
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్ఆర్జేసీ) పరిధిలోని 35 జూనియర్ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశపరీక్షలో 84 శాతం మంది హాజరయ్యారని సంస్థ కార్యదర్శి రమణకుమార్ తెలిపారు. -
నేటినుంచి కొండగట్టు హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం నుంచి హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. -
నాలుగేళ్ల కనిష్ఠానికి శ్రీరామసాగర్
ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నీటిమట్టం నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. -
ఎన్నికల బందోబస్తుకు 160 కంపెనీల కేంద్ర బలగాలు
లోక్సభ ఎన్నికల బందోబస్తు కోసం రాష్ట్రంలో భారీగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్(సీఏపీఎఫ్) దళాలను మోహరించనున్నారు. -
ప్రశ్నిస్తే వ్యవస్థలతో దాడులు
ప్రభుత్వ బాధ్యతలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై వ్యవస్థలతో దాడులు చేయిస్తున్నారని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ అన్నారు. -
బియ్యం బకాయిలున్నా.. మళ్లీమళ్లీ ధాన్యం!
రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ప్రతి సీజన్లో మిల్లర్లకు కేటాయిస్తుంది. మిల్లర్లు నిర్ణీత సమయంలో ధాన్యాన్ని మర ఆడించి, బియ్యాన్ని (కస్టమ్ మిల్లింగ్ రైస్ - సీఎంఆర్) అప్పగించాలి. -
వడగళ్ల వానతో 3,120 ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో శనివారం కురిసిన అకాల వర్షాలు, వడగళ్లతో మొత్తం 3,120 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం తెలిపారు. -
పాదాలు నర్తించె.. జల పాఠాలు బోధించె
సోమవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ ఆదివారం ‘లేక్ క్లీన్ అప్’ కార్యక్రమం నిర్వహించింది. -
తక్కువ ధరకు ధాన్యం కొనే వ్యాపారులపై చర్యలు తీసుకోండి
రాష్ట్రంలో తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను పౌరసరఫరాలశాఖ ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
-
విశాఖ - బెంగళూరు మధ్య 20 వేసవి ప్రత్యేక రైళ్లు.. శని, ఆదివారాల్లోనే..!
-
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్