Heavy Rain: 3 గంటల్లో ముంచెత్తింది
కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్పై విరుచుకుపడ్డాడు. దీంతో నగరం ఉక్కిరిబిక్కిరైంది. జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది. అది కార్యాలయాల నుంచి ఉద్యోగులు
హైదరాబాద్లో 12.7 సెం.మీ. వర్షం
రోడ్లన్నీ జలమయం
ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు..
ట్రాఫిక్ అస్తవ్యస్తం
జలదిగ్బంధంలో కాలనీలు
ఈనాడు, హైదరాబాద్: కుంభవృష్టితో రాజధాని వణికింది. వరుణుడు ఒక్కసారిగా హైదరాబాద్పై విరుచుకుపడ్డాడు. దీంతో నగరం ఉక్కిరిబిక్కిరైంది. జనజీవనం స్తంభించింది. సోమవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన వాన.. రాత్రి 8 గంటల వరకూ కురుస్తూనే ఉంది. అది కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు చేరే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు 5 లక్షల మంది వాహనదారులు, స్కూళ్ల నుంచి ఇంటి చేరాల్సిన విద్యార్థులు 2 గంటలకు పైగా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. వాహనాల్లోకి నీళ్లు చేరడంతో చాలావరకు అక్కడే ఆగిపోయాయి. కొన్నిచోట్ల నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. నగరంలో గత పదేళ్లలో సెప్టెంబరు నెలలో ఎన్నడూ లేనంత అత్యధిక వర్షపాతం నమోదైంది. సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడా ఒక మోస్తరు వానలు పడతాయని ఆదివారం వాతావరణశాఖ తెలిపింది. కానీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీవర్షం కురిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు మెహిదీపట్నంలో గరిష్ఠంగా 11.25 సెం.మీ. వాన పడింది. ఇంతకుముందు రికార్డు 2017 సెప్టెంబరు 6న 24 గంటల వ్యవధిలో 9 సెం.మీ.లుగా వాతావరణశాఖ రికార్డుల్లో ఉంది. సోమవారం 3 గంటల వ్యవధిలోనే 9.1 నుంచి 12.7 సెం.మీ.లు 4 ప్రాంతాల్లో కురవడంతో అది చెరిగిపోయి కొత్త రికార్డు నమోదైంది. హైదరాబాద్లోని దాదాపు 250 కాలనీల్లో నీరు ఇళ్లలోకి చేరింది. ఆసిఫాబాద్, గుడిమల్కాపూర్, వివేకానందనగర్, మలక్పేట, ముషీరాబాద్, తదితర ప్రాంతాల్లో జనావాసాలు జలమయమయ్యాయి. గుడిమల్కాపూర్ పూల మార్కెట్, సంతల్లోని దుకాణాలు కొట్టుకుపోయాయి. సరూర్నగర్ చెరువు దిగువ ప్రాంతాలు, కవాడిగూడ, అశోక్నగర్, అంబర్పేట, బేగంపేటలలో వరద నాలాలు ఉప్పొంగి ప్రవహించాయి. మెహిదీపట్నం దగ్గర నడుములోతు నీరు చేరడంతో కొన్ని వాహనాలు మధ్యలోనే ఆగిపోయాయి. వర్షం ధాటికి విద్యుత్తు సరఫరా నిలిచిపోయి 31 శాతం నగరం చీకట్లో కూరుకుపోయింది. నగరంలో 5.2 లక్షల వీధిదీపాలకు గాను.. 1.5 లక్షల లైట్లకు సరఫరా నిలిచిపోయింది. ముంపు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్తు సరఫరాను నిలిపేశారు. అర్ధరాత్రి 12 గంటలకు అత్యధికంగా నగరశివారులోని నందనం వద్ద 16.70 సెం.మీ, మెహిదీపట్నం 11.25, నాంపల్లిలో 10.33 సెం.మీ. కురిసింది. ఖైరతాబాద్ 10.23, ఎల్బీస్టేడియం 10.00, అత్తాపూర్ 8.7, సరూర్నగర్ 7.93, ఆసిఫ్నగర్ 7.75, అంబర్పేట 7.68, మలక్పేట 6.88, జియాగూడ 6.63, ఎ.ఎస్.రావునగర్ 6.18, సికింద్రాబాద్ 6.00, బాలానగర్లో 5.70 సెం.మీ వర్షపాతం నమోదైంది. అర్ధరాత్రి తర్వాత కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.
నేడు, రేపు సైతం వర్షాలు
గత మూడురోజులుగా పొడి వాతావరణం ఏర్పడటం, ఉరుములు, మెరుపులు అధికంగా రావడం వల్ల కారుమబ్బులు కమ్మేసి కొద్దిగంటల వ్యవధిలోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. మంగళ, బుధవారాల్లో సైతం ఇలాగే రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ, మధ్యప్రాంతంలో గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. మరోవైపు ఉత్తర, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నందున వర్షాలు కురుస్తున్నట్లు వివరించారు. చిట్యాల మండలం(నల్గొండ జిల్లా) ఉరుమడ్ల రోడ్డు వద్ద 7.8 సెం.మీ, మేడారం(ములుగు జిల్లా)లో 6.7 సెం.మీ.ల వర్షం కురిసింది.
పిడుగుపాటుకు ముగ్గురి మృతి
వివిధ జిల్లాల్లో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ముగ్గురు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడిగుండాల పంచాయతీ బోటిగుంపు గ్రామానికి చెందిన రైతు కమటం శ్రీను(42) సోమవారం పిడుగుపాటుతో మృతి చెందారు. తన భార్య శోభతో పొలం వెళ్లి ఇంటికి వస్తుండగా పిడుగు పడడంతో తలకు తీవ్రగాయంతో శ్రీను అక్కడికక్కడే చనిపోయారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడులో పిడుగుపడి షేక్ జాన్బీ(66) చనిపోయారు. కొంతకాలంగా అనారోగ్యంతో మంచం పట్టిన ఈమె ఇంటి ఆవరణలో పిడుగు పడటంతో మంచంలోనే మృతిచెందారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్లోని బావుల చెరువు సమీపంలో సోమవారం సాయంత్రం చెట్టు కింద నిలబడ్డ సిద్ధాపురానికి చెందిన ముసుకు నాగరాజు(35) పిడుగు బారినపడి అక్కడికక్కడే కన్నుమూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది.