‘అధికారి’క అక్రమం
ఒకటి కాదు..రెండు కాదు.. 160 ఎకరాలు. భూమి విలువ రూ.కోట్లలోనే... ఓ రెవెన్యూ అధికారి ఆ భూమిపై కన్నేశారు.. ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. లేని పత్రాలు సృష్టించారు. సదరు కంపెనీ ఆ భూములు కొనుగోలు
160 ఎకరాలు కొట్టేసేందుకు ఓ రెవెన్యూ ఉన్నతాధికారి పన్నాగం
ఓ కంపెనీ పేరిట కట్టబెట్టే యత్నం
చేతులు మారిన రూ. 3 కోట్లు
అనూహ్యంగా వెలుగులోకి వ్యవహారం
ఈనాడు - నల్గొండ
ఒకటి కాదు..రెండు కాదు.. 160 ఎకరాలు. భూమి విలువ రూ.కోట్లలోనే... ఓ రెవెన్యూ అధికారి ఆ భూమిపై కన్నేశారు.. ఓ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. లేని పత్రాలు సృష్టించారు. సదరు కంపెనీ ఆ భూములు కొనుగోలు చేసిందనేందుకు అవసరమైన దస్త్రాలు సిద్ధం చేశారు. ఈ అక్రమాన్ని సక్రమం చేయాలంటూ కింది స్థాయి అధికారులపైనా ఒత్తిడి తెచ్చారు. జిల్లా అధికారికీ ఆ దస్త్రాన్ని పంపారు. ఆయన దాన్ని తిప్పిపంపడంతో నల్గొండ జిల్లాలో జరిగిన ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆ శాఖలో కలకలం రేపింది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం రాజగట్టు రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 826లోని భూములను నాగార్జునసాగర్ నిర్వాసితులైన పెద్ద అడిశర్లపల్లి మండలంలోని చిన్న గుమ్మడం, పెద్ద గుమ్మడం గ్రామాల నిర్వాసితులకు సుమారు 50 ఏళ్ల క్రితం కేటాయించారు. ఆ భూములు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండటంతో వారు అక్కడికి వెళ్లలేదు. దాంతో వాటిని స్థానికంగా నివాసం ఉండే గిరిజనులకు డీ-ఫాం పట్టాలు కేటాయిస్తూ (డిస్ రిజర్వ్డ్ చేస్తూ) అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఒక ప్రజాప్రతినిధి సహకారంతో రెవెన్యూ అధికారి ఈ సర్వే నంబరులోని 160 ఎకరాలను ఓ కంపెనీకి కట్టబెట్టేందుకు దస్త్రం తయారు చేశారు. దీనికి ఆమోదం లభించేలోగానే అప్పటి జిల్లా ఉన్నతాధికారి బదిలీ కాగా.. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన మరో అధికారి వెంటనే ఆమోదించలేదు. తాజాగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారి వద్దకు దస్త్రం తీసుకురాగా.. ఆయన ఆ రెవెన్యూ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని తిరస్కరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఆ సర్వే నంబరులో ఎకరా రూ.15 లక్షల వరకు పలుకుతోంది. దీని ప్రకారం 160 ఎకరాల విలువ సుమారు రూ.24 కోట్ల వరకు ఉంటుంది. ఈ భూములను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సదరు రెవెన్యూ అధికారికి ఆ కంపెనీతో ఒప్పందం కుదిరిందని, రూ.3 కోట్లు అడ్వాన్సు కూడా చెల్లించిందని విశ్వసనీయంగా తెలిసింది.
తప్పుడు పత్రాలు సృష్టించి..
సర్వే నంబరు 826లో మొత్తం 1097 ఎకరాలుంది. ఇందులో 776 ఎకరాలు డిస్ రిజర్వుడ్ జాబితాలో ఉన్నాయి. 108.09 ఎకరాలను ధరణిలో ఇప్పటికే ఇతరుల పేర్లపై నమోదు చేశారు. మరోవైపు డిస్ రిజర్వు జాబితాలోని భూమిని దక్కించుకునేందుకు సుమారు 150 మంది దరఖాస్తు చేశారు. ఇదే సర్వే నంబరులోని 160 ఎకరాలపై కన్నేసిన రెవెన్యూ అధికారి ఓ కంపెనీ పేరిట కట్టబెట్టే మంత్రాంగానికి తెరతీశారు. ఆ భూములను ఓ క్రోమైట్స్ కంపెనీ నుంచి మరో కంపెనీ కొనుగోలు చేసినట్లు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ స్టీల్స్ కంపెనీ కొనుగోలు చేసినట్లు దస్త్రాలు తయారు చేశారు. ఈ స్టీల్స్ కంపెనీ రెవెన్యూ అధికారి బంధువుకు చెందినది కావడం గమనార్హం. భూ కేటాయింపులపై స్టీల్స్ కంపెనీకి అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ క్షేత్రస్థాయి సిబ్బందిని రెవెన్యూ అధికారి ఆదేశించగా.. అందుకు తహసీల్దార్తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ ససేమిరా అన్నారని సమాచారం. దాంతో వారిని ఆయన బదిలీ చేయించారు. మరో 100 ఎకరాలకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ పేరిట సుమారు నాలుగేళ్ల క్రితం రిజిస్ట్రేషన్ చేసినట్లు తెలిసింది. కాగా, ఈ కంపెనీలకు చెందిన వారెవరూ క్షేత్రస్థాయిలో కబ్జాలో లేకపోవడం గమనార్హం. ఈ వ్యవహారంపై జిల్లా అధికార యంత్రాంగం అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!