తెలంగాణలో భారీ ఫర్నిచర్ పార్కులు!
తెలంగాణలో కలప, కలపేతర ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ఆధునిక ఫర్నిచర్ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు
దండుమల్కాపూర్, అచ్చయ్యపల్లిలో ఏర్పాటు
థాయ్లాండ్, మలేసియాల భాగస్వామ్యంతో..
భారీగా ఉపాధి లక్ష్యంతో ప్రభుత్వం సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కలప, కలపేతర ఆధారిత పరిశ్రమలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో తొలిసారిగా ఆధునిక ఫర్నిచర్ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రంగంలో భారీ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పెద్దఎత్తున స్థాపింపజేయాలని సంకల్పించింది. దేశవిదేశాలకు చెందిన భారీ సంస్థలతో పాటు స్థానికంగా పరిశ్రమల ద్వారా భారీ పెట్టుబడుల సమీకరణతో కలప ఆధారిత వండ్రంగి చేతివృత్తులవారికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలను రూపొందించింది. ఈ రంగానికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు పరిశ్రమల మంత్రివర్గ ఉపసంఘం సైతం అనుమతించింది. దేశంలో ఫర్నిచర్కు డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఏటా రాష్ట్రంలో ప్రభుత్వశాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు, గృహ వినియోగాలకు కలిపి రూ.పదివేల కోట్ల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇందులో అధికశాతం దిగుమతి చేసుకుంటున్నవే. దీనిని పరిగణనలోనికి తీసుకొని ఫర్నిచర్ తయారీ పరిశ్రమలకు కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూనుకుంది.
రెండు చోట్ల ఏర్పాటుకు సన్నాహాలు
రాష్ట్రంలో రెండు భారీ ఆధునిక ఫర్నిచర్ పార్కుల స్థాపనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం యాదాద్రి భువనగిరి జిల్లా దండు మల్కాపూర్లో 100 ఎకరాలు, ములుగు జిల్లా అచ్చయ్యపల్లిలో 300 ఎకరాలను సేకరించింది. వీటికి త్వరలోనే పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఫర్నిచర్కు ప్రసిద్ధి చెందిన థాయ్లాండ్, మలేసియా, తైవాన్ దేశాల పారిశ్రామికవేత్తలు ఇటీవల తెలంగాణను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్.. ఇక్కడ ఏర్పాటు చేయనున్న పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రెండు పార్కుల్లో 50 ఎకరాల చొప్పున భూములు కావాలని వారు కోరగా అంగీకరించారు. ఐకియా, గోద్రెజ్తో పాటు మరో నాలుగు కంపెనీలతోనూ మంత్రి చర్చించారు.
వృత్తిదారులకు శిక్షణ కేంద్రం
అందుబాటులో ఉన్న సాదా కలపను వినియోగించడంతో పాటు ట్రాపియోకా, పారావుడ్, రబ్బర్వుడ్, టింబర్వుడ్, బర్మాటేక్, వెదురు, యూకలిప్టస్, ప్లైవుడ్, ఫైబర్, ఇనుము, స్టీలు, ఇతర లోహాలు, ప్లాస్టిక్, లెదర్ వంటి వాటితో ఫర్నిచర్ చేయిస్తారు. ఈ పార్కుల్లో ప్లైవుడ్ పరిశ్రమలు, పార్టికల్ బోర్డ్ యూనిట్లు, మీడియం డెన్సిటీ ఫైబర్ తదితర ఇతర యూనిట్లు ఉంటాయి. పర్యావరణ హితం కోసం వివిధ దేశాలు అనుసరిస్తున్న విధానాన్ని ఇక్కడ అమలు చేస్తారు. ఫర్నిచర్ ఉత్పత్తులకు వాడే ప్రత్యేక కలప మొక్కల పెంపకాన్ని కూడా పార్కులో చేపడుతుంది. పార్కుల్లో భారీ సంస్థలతో పాటు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు, వృత్తిదారులకు ప్రభుత్వం స్థలాలను కేటాయించనుంది. అధునాతన యంత్రాలు, సృజనాత్మకత, ఆకృతుల స్టూడియోతో పాటు ఉమ్మడి సౌకర్యాల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. నిపుణుల ద్వారా శిక్షణ కేంద్రాన్ని సైతం నిర్వహించనుంది.
ఫర్నిచర్ రంగానికి భారీ డిమాండ్
- జయేశ్రంజన్, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి
రాష్ట్రంలో ఫర్నిచర్ రంగానికి భారీ డిమాండ్ ఉంది. హైదరాబాద్లో అంతర్జాతీయ సంస్థ ఐకియా అమ్మకాలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ముడిసరకులతో పాటు ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీంతో అన్నిరకాల ఉత్పత్తులకు అవకాశం ఉంది. ఫర్నిచర్ పారిశ్రామిక పార్కు ద్వారా వృత్తిదారులతో పాటు యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్