సమస్యలు తీర్చాలంటూ సీఎంకు 23వేల పోస్టుకార్డులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీఆర్‌ఏల సమస్యలను వివరిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ 23వేల పోస్టుకార్డులు రాయాలని వీఆర్‌ఏ ఐకాస నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో  ఐకాస అత్యవసర భేటీ నిర్వహించారు.

Published : 27 Sep 2022 04:57 IST

వీఆర్‌ఏ ఐకాస నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీఆర్‌ఏల సమస్యలను వివరిస్తూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రస్తావిస్తూ 23వేల పోస్టుకార్డులు రాయాలని వీఆర్‌ఏ ఐకాస నిర్ణయించింది. సోమవారం హైదరాబాద్‌లో  ఐకాస అత్యవసర భేటీ నిర్వహించారు. 27, 28 తేదీలలో  23వేల పోస్టుకార్డులు సీఎంకు చేరేలా సీఎంవో చిరునామాను విడుదల చేశారు.  సమ్మెకు మద్దతుగా కోటి సంతకాలు సేకరించాలని నిర్ణయించారు.  వీఆర్‌ఏల సమ్మె మంగళవారం నాటికి 65వ రోజుకు చేరుకోనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని