భూముల విక్రయంతోనే రూ.10 వేల కోట్లు!
సేకరణ.. అభివృద్ధి.. ఆదాయం అనే విధానంలో భాగంగా భూముల విక్రయాల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జిల్లాల్లో పడావుగా ఉన్న ఎసైన్డ్ తదితర
ఆదాయం సమకూర్చుకొనేందుకు సర్కార్ అడుగులు
హైదరాబాద్ పరిసర జిల్లాల్లో అభివృద్ధికి సిద్ధంగా 2వేల ఎకరాలు
జాబితాలో వెయ్యి ఎకరాల ఎసైన్డ్ భూములు
ఈనాడు, హైదరాబాద్: సేకరణ.. అభివృద్ధి.. ఆదాయం అనే విధానంలో భాగంగా భూముల విక్రయాల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం జిల్లాల్లో పడావుగా ఉన్న ఎసైన్డ్ తదితర ప్రభుత్వ భూములు, వాటి పక్కనున్న ప్రైవేటు భూములు, రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూములను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు భూ నిధి కింద రాష్ట్రవ్యాప్తంగా 12 వేల ఎకరాల వరకు గుర్తించారు. ఖరీదైన భూములున్న హైదరాబాద్ పరిసర జిల్లాలైన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రిల్లోనే 5వేల ఎకరాల వరకు ఉన్నాయి. మొదట 2వేల ఎకరాలను అభివృద్ధికి సిద్ధం చేస్తున్నారు. వీటి విక్రయాల ద్వారానే రూ.10 వేల కోట్లు సమకూరుతాయని భావిస్తున్నారు.
ప్రభుత్వానికి చేరిన దస్త్రం!
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ల ద్వారా భూముల సమాచారాన్ని రెవెన్యూశాఖ తెప్పించుకుంది. కనిష్ఠంగా 50 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఒకేచోట ఉన్న భూములను గుర్తించి సర్వే నంబర్లు, రైతుల వివరాలను కలెక్టర్లు అందజేశారు. భూముల యజమానులతో తహసీల్దార్లు ప్రాథమికంగా చర్చించారు. వారు సుముఖత వ్యక్తపరిస్తేనే సేకరించే జాబితాలో చేర్చుతున్నారు. కాగా, భూముల సేకరణకు వ్యతిరేకంగా కొన్నిచోట్ల స్థానిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాంటి చోట ఆచితూచి వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు. గుట్టలు, లోయలు ఉన్నచోట భూముల అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నది కావడంతో సేకరణలో కొంత జాప్యం జరుగుతోందని సమాచారం. హైదరాబాద్-వరంగల్, కరీంనగర్ ప్రధాన రహదారి వెంబడి పలుచోట్ల భూముల యజమానులతో చర్చలు కొలిక్కిరాగా.. మరికొంత విస్తీర్ణానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది. మొదట హైదరాబాద్ శివారు జిల్లాల్లో సేకరణ, అభివృద్ధి ప్రక్రియలను పూర్తి చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరినట్లు తెలిసింది.
ఎకరాకు 600 చదరపు గజాలు కోరుతున్న యజమానులు
హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చే నాలుగు జిల్లాల్లో దాదాపు వెయ్యి ఎకరాల వరకు ఎసైన్డ్ తదితర భూములు ఉన్నాయి. సేకరించిన భూములను అభివృద్ధి చేసి లేఅవుట్లుగా మార్చాక వాటిలో ఎకరాకు 600 చదరపు గజాల చొప్పున ఇవ్వాలని యజమానులు కోరుతున్నారని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల సగం భూమి కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలందిన వెంటనే భూములను అభివృద్ధి చేసి.. లేఅవుట్లు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు. ఎసైన్డ్ భూముల అభివృద్ధికి సంబంధించి ఎక్కువగా సాగు చేయని భూములను గుర్తిస్తున్నామని, యజమానులు అంగీకరిస్తేనే సేకరించే అవకాశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..