గవర్నర్‌ తమిళిసై, ఎమ్మెల్సీ కవితలతో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ భేటీ

ఇటీవల హైదరాబాద్‌లో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన గారెత్‌ విన్‌ఓవెన్‌ సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, తెరాస ఎమ్మెల్సీ కవితలతో విడివిడిగా భేటీ అయ్యారు.

Published : 27 Sep 2022 04:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల హైదరాబాద్‌లో బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన గారెత్‌ విన్‌ఓవెన్‌ సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, తెరాస ఎమ్మెల్సీ కవితలతో విడివిడిగా భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా భేటీ అయిన సందర్భంగా గవర్నర్‌ ఆయనకు జ్ఞాపికను బహూకరించారు. ఎమ్మెల్సీ కవితతో ఆమె నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గారెత్‌ విన్‌ఓవెన్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన కవిత పలు అంశాలను చర్చించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో సాధించిన ప్రగతి, అభివృద్ధి అవకాశాలతో పాటు వివిధ అంశాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని