Abhijit Reddy: పెద్ద ఉద్యోగంతో ఆనందం.. చేరకముందే హఠాన్మరణం
కెమికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసి.. 22 ఏళ్లకే రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన ఆ యువకుడు.. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అతడి పేరు కట్టా అభిజిత్రెడ్డి (22). రాష్ట్ర వైద్య
22 ఏళ్లకే గుండెపోటుతో మృతి
టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీకి పుత్రశోకం
ఈనాడు- హైదరాబాద్: కెమికల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేసి.. 22 ఏళ్లకే రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన ఆ యువకుడు.. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. అతడి పేరు కట్టా అభిజిత్రెడ్డి (22). రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ కె.చంద్రశేఖర్రెడ్డి పెద్ద కుమారుడు. వరంగల్ నిట్లో చదివిన అభిజిత్.. సౌదీ అరేబియాకు చెందిన ప్రభుత్వ రంగ చమురు కంపెనీ ‘సౌదీ అరామ్కో’లో ఉన్నత ఉద్యోగం సాధించాడు. ఏడాదికి 70 వేల అమెరికన్ డాలర్ల (సుమారు రూ.58 లక్షలు) వేతనం. వచ్చే నెలలో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం నడకకు వెళ్లొచ్చాడు. రాత్రి టీవీలో భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ చూశాడు. అర్ధరాత్రి దాటాక 2 గంటలకు ఛాతీలో నొప్పితో మెలకువ వచ్చింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే కుప్పకూలిపోయాడు. అలికిడికి లేచిన తమ్ముడు.. ఆందోళనతో తల్లితండ్రులనూ లేపాడు. మొదట రెండు చేతులతో అభిజిత్ గుండెపై గట్టిగా నొక్కడం (కార్డియో పల్మనరీ రెససిటేషన్-సీపీఆర్) మొదలుపెట్టారు. తర్వాత ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అతడు తెల్లవారుజామున మృతిచెందాడు. చెట్టంత కుమారుడు కళ్లముందే కుప్పకూలిపోవడంతో చంద్రశేఖర్రెడ్డి, ఆయన సతీమణి కన్నీరుమున్నీరయ్యారు. వీరి స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునూతల. అభిజిత్ అకాల మరణంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు, మాజీ వైద్యమంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది చంద్రశేఖర్రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.
గుండె కండరం మందమైతే..
- డాక్టర్ రమేశ్ గూడపాటి, సీనియర్ కార్డియాలజిస్ట్
పాశ్చాత్య దేశాల్లో సగటున 40-45 ఏళ్ల వయసులో గుండెపోటు ఎక్కువగా వస్తుంటే.. మన దేశంలో 25-30 ఏళ్ల వయసులోనే ఈ సమస్య కనిపిస్తోంది. మనవాళ్ల జన్యువుల్లో గుండెపోటు తీవ్రతను పెంచే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. యుక్తవయస్కుల్లో గుండెపోటుకు ప్రధాన కారణం.. గుండె కండరం మందమవడం. కొందరిలో పుట్టుకతోనే గుండె కొట్టుకోవడంలో తేడా వల్ల సమస్య రావచ్చు. కొవిడ్ వచ్చి తగ్గిన వారికి గుండె రక్తనాళాలు, కాలి సిరల్లో రక్తం గడ్డ కట్టినా గుండె ఆగిపోవచ్చు. శారీరక దారుఢ్యం కోసం స్టెరాయిడ్లు వినియోగించే వారికీ ముప్పు ఉంటుంది. వాహనాల్లోనే తిరగడం, అధిక సమయం ఫోన్, టీవీ, ల్యాప్ట్యాప్లతోనే గడుపుతూ.. శారీరక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం గుండెకు చేటు. పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, చిప్స్, కేకులు.. ఇవన్నీ గుండెపోటు ప్రమాదాన్ని పెంచేవే. ఛాతీ మధ్య, పై భాగంలో నొప్పి, దవడ లాగినట్లుగా ఉండడం, ఛాతీ నుంచి ఎడమ, కుడి చేతుల వైపు, గొంతు వైపు నొప్పి వ్యాపించడం, చెమటలు పట్టడం, శ్వాస కష్టమవడం, ఛాతీ బరువుగా ఉండడం.. ఇవన్నీ గుండెపోటుకు సూచనలు. మధుమేహం, అధిక రక్తపోటు బాధితులు, వ్యాయామం చేయనివారు, ధూమపానం చేసేవారు, నిల్వ ఆహారాలు, వేపుళ్లు ఎక్కువగా తినేవారు, స్థూలకాయులు, నిద్రలేమి, గురక సమస్యతో బాధపడుతున్నవారు.. వీరిలో గుండెపోటుకు అవకాశం ఎక్కువ. లక్షణాలు స్వల్పంగా ఉన్నా సరే.. అత్యవసరంగా వైద్యుణ్ని సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్