Telangana News: లంచాల జబ్బు
జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ)పై ఇటీవల పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. స్థానికంగా ఓ వైద్యుని పోస్టు నియామకానికి రూ.లక్ష లంచం స్వీకరించారని రాష్ట్ర సహకార వినియోగదారుల ఫోరం ఛైర్మన్ ఆరోపించారు. స్పందించిన ప్రభుత్వం సంయుక్త సంచాలకుని నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.
అక్రమాలకు కేంద్రంగా జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాలు
సర్కారుకు పెద్దఎత్తున ఫిర్యాదులు
ప్రభుత్వం ఆదేశించే వరకూ ప్రైవేటు ఆసుపత్రులు, వైద్య కేంద్రాల తనిఖీల జోలికి వెళ్లని అధికారులు
ఇప్పటికీ 15 జిల్లాల్లో ప్రారంభంకాని సోదాలు
జోగులాంబ గద్వాల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ)పై ఇటీవల పెద్దఎత్తున ఆరోపణలొచ్చాయి. స్థానికంగా ఓ వైద్యుని పోస్టు నియామకానికి రూ.లక్ష లంచం స్వీకరించారని రాష్ట్ర సహకార వినియోగదారుల ఫోరం ఛైర్మన్ ఆరోపించారు. స్పందించిన ప్రభుత్వం సంయుక్త సంచాలకుని నేతృత్వంలో విచారణకు ఆదేశించింది.
ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుమతులు ఇచ్చేందుకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రూ.5 లక్షలు లంచం తీసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. ఈ అంశం వైద్య మంత్రి దృష్టికి రాగా.. ఆ అధికారిని అక్కడి నుంచి బదిలీ చేశారు. అయితే ఆయనను మరో జిల్లాకు డీఎంహెచ్ఓగా నియమించడం కొసమెరుపు.
ఈనాడు- హైదరాబాద్: జిల్లాస్థాయిలో ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతులు.. ప్రభుత్వ వైద్య సిబ్బంది నియామకాలు, బదిలీలు, ఒప్పంద వైద్యులకు వేతనాల చెల్లింపులు.. ఇలా ఏ పని జరగాలన్నా పలు జిల్లాల్లో వైద్య ఆరోగ్య అధికారి (డీఎంహెచ్ఓ) కార్యాలయానికి ముడుపులు ముట్టాల్సిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా కొందరు డీఎంహెచ్ఓలు, ఉప వైద్యాధికారులపై విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఇటీవల నాగర్కర్నూల్ జిల్లాలో చేపట్టిన స్టాఫ్నర్సుల నియామకాల్లో అర్హులకు కాదని, డబ్బులు తీసుకొని తమకు నచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇలాంటి అక్రమాల్లో ఆయా అధికారుల చేతికి మట్టి అంటకుండా వారి వ్యక్తిగత సహాయకులు కీలక పాత్ర పోషిస్తున్నారు.మరోవైపు ప్రైవేటు ఆసుపత్రులు ముడుపులిస్తే ఎలాంటి తనిఖీలు జరపకుండానే అనుమతులిస్తున్నారని, ఎలాంటి తప్పులున్నా కప్పిపుచ్చుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల కొన్ని ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించడం, అర్హత లేకపోయినా చికిత్సలు అందించడం వంటివి వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో తాత్కాలికంగా చర్యలు తీసుకొని.. మళ్లీ వారికి అనుమతులిచ్చారు. దీని వెనుక ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు ఇచ్చిన ఆదేశాల మేరకు.. ఈ నెల 23 నుంచి జిల్లా వైద్య ఆరోగ్య అధికారుల నేతృత్వంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అర్హత లేని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది.. అవసరమైన వైద్య సిబ్బంది లేకపోవడం.. అనుమతులు తీసుకోకపోవడం.. నిబంధనల మేరకు మౌలిక వసతులు కల్పించకపోవడం.. పారిశుద్ధ్యం తదితర అన్ని కోణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రజారోగ్య సంచాలకులు ఆదేశాలిచ్చినా ఇప్పటివరకూ 15 జిల్లాల్లో అధికారులు తనిఖీలు ప్రారంభించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.
21 ఆసుపత్రుల మూసివేత
మిగతా 18 జిల్లాల్లో గత 5 రోజుల్లో వైద్య బృందాలు 311 ఆసుపత్రులను తనిఖీ చేశాయి. ఇందులో 21 ఆసుపత్రులను మూసివేయగా.. 83 దవాఖానాలకు తాఖీదులు అందించారు. మరో ఏడింటికి జరిమానాతో సరిపెట్టారు.
* రంగారెడ్డి జిల్లాల్లో అత్యధికంగా 67 ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఏడింటిని మూసివేయగా.. 20 దవాఖానాలకు తాఖీదులు, ఒక దానికి జరిమానా విధించారు.
* హైదరాబాద్లో ఇప్పటివరకూ 17 ఆసుపత్రులనే తనిఖీ చేశారు. ఇక్కడ 9 దవాఖానాలకు తాఖీదులు, ఒక ఆసుపత్రికి జరిమానా విధించారు.
* వికారాబాద్లో 44 ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి, అయిదింటిని మూసివేశారు. మరో 2 ఆసుపత్రులకు తాఖీదులు, అయిదింటికి జరిమానా విధించారు.
* కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 4, మంచిర్యాలలో 14, మేడ్చల్ మల్కాజిగిరిలో 17, నిజామాబాద్లో 7, వరంగల్లో 3 ఆసుపత్రులను తనిఖీ చేశారు. ఈ జిల్లాల్లో ఒక్క దానిపైనా చర్య తీసుకోలేదు.
ఇప్పటికీ లోపాయికారి ఒప్పందాలు!
ప్రైవేటు వైద్య కేంద్రాల్లో లోపాలపై స్వయంగా ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకూ జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేసిన దాఖలాలులేవు. దీనినిబట్టి అవినీతి ఏస్థాయిలో ఉందో అర్థమవుతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నా.. ఇప్పటికీ లోపాయికారిగా కొన్ని ఆసుపత్రులతో ఒప్పందాలు కుదుర్చుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
* కొందరు డీఎంహెచ్ఓలు పెద్దఎత్తున పైరవీలు చేసుకొని.. ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే పోస్టింగ్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పోస్టింగులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో డీఎంహెచ్ఓల వ్యవహారాలపై నిశితంగా దృష్టిసారించాల్సిన అవసరముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు