ప్రపంచ పరిశ్రమల హబ్గా తెలంగాణ
దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగానే గాక బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రాన్స్కి చెందిన
ష్నైడర్ విద్యుత్ పరికరాల పరిశ్రమ శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్
రూ. 1000 కోట్ల పెట్టుబడి.. మూడు వేల మందికి ఉపాధి
హైదరాబాద్లో త్వరలో ఫ్రాన్స్ కాన్సులేట్: రాయబారి ఇమ్మానుయేల్
ఈనాడు, హైదరాబాద్: దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగానే గాక బలమైన ఆర్థికశక్తిగా ఎదుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫ్రాన్స్కి చెందిన ప్రపంచ దిగ్గజ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ ష్నైడర్ శంషాబాద్ జీఎంఆర్ పారిశ్రామిక పార్కులో రూ. వెయ్యి కోట్లతో ఏర్పాటు చేస్తున్న భారీ పరిశ్రమకు గురువారం హైదరాబాద్లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనైన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థ ష్నైడర్ దేశంలోనే అతిపెద్ద పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు గర్వకారణం. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సహకరిస్తుంది’ అని తెలిపారు.
కేటీఆర్ అత్యంత సానుకూల పరిశ్రమల మంత్రి: రాయబారి లెనైన్
త్వరలో హైదరాబాద్లో ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఆ దేశ రాయబారి ఇమ్మానుయేల్ లెనైన్ తన ప్రసంగంలో తెలిపారు. కేటీఆర్ దేశంలో అత్యంత సానుకూల పరిశ్రమల మంత్రి అని ప్రశంసించారు. హైదరాబాద్లో పరిశ్రమ ఏర్పాటు ద్వారా ష్నైడర్ కొత్త మైలురాయిని చేరుకుందన్నారు.
ష్నైడర్ భారత విభాగం సీఈవో, ఎండీ అనిల్ చౌదరి, సీనియర్ ఉపాధ్యక్షుడు జావెద్ అహ్మద్లు మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తాం. మొదటి దశలో రూ. 300 కోట్ల పెట్టుబడులతో వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తాం. రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో పరిశ్రమను నిర్వహిస్తాం. ఆ తర్వాత రెండు దశల్లో మరో రూ. 700 కోట్ల పెట్టుబడులతో మరో రెండు వేల మందికి ఉపాధి అందిస్తాం. అత్యున్నత 4.0 సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరిశ్రమ నడుస్తుంది. తెలంగాణ కేంద్రంగా భారత్లో తయారీకి పునాది వేస్తున్నాం’ అని తెలిపారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్రాన్స్ వాణిజ్య బృందం ప్రతినిధులతో మంత్రి భేటీ
తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామమని, అన్ని రంగాల్లోనూ అపార అవకాశాలున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం ఆయన ఫ్రాన్స్ వాణిజ్యమిషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇక్కడ ఉన్న సానుకూల పరిస్థితులను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనైన్, వాణిజ్య బృందం ప్రతినిధులు పాల్ హెర్మెలిన్, గెరాల్డ్ వోల్ఫ్, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాయబారి ఇమ్మానుయేల్, బెంగళూరు కాన్సుల్ జనరల్ థెర్రీ బెర్త్లాట్లతో కేటీఆర్ భేటీ అయ్యారు. పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చించారు. హైదరాబాద్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం (హౌస్ ఆఫ్ ఫ్రాన్స్) 2023 జూన్ నాటికి అందుబాటులోకి వస్తుందని లెనైన్ వెల్లడించగా, కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
నీతి ఆయోగ్ సిఫార్సులను అమలు చేయాలి
మిషన్ భగీరథకు జాతీయ అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ గురువారం ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకానికి రూ. 19 వేల కోట్లు ఇవ్వాలన్న నీతి ఆయోగ్ సిఫార్సులను గౌరవిస్తే బాగుంటుందని సూచించారు.
జంతు సంరక్షణ యోధులకు కేటీఆర్ సాయం
తెలంగాణలోని జంతుసంరక్షణ యోధుల సంఘం (యానిమల్ వారియర్స్ సొసైటీ) ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ తన సొంత నిధులతో బొలెరో వాహనాన్ని, మరో రూ. 5 లక్షల సాయాన్ని అందించారు. గత జులైలో వరద ప్రాంతాల్లో మూగజీవాలను కాపాడేందుకు ముందుకొచ్చిన ఈ సంస్థ ప్రతినిధులు వాహనం లేకపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రికి ట్విటర్లో తెలపగా, ఆయన స్పందించారు. గురువారం ప్రగతిభవన్లో వారికి వాహనాన్ని, పక్షుల సంరక్షణ కేంద్రం అభివృద్ధికి రూ. 5 లక్షల ఆర్థికసాయాన్ని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి