మలాయి భూముల మనోవేదన!
మంజీర నదీ తీరంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిపై పూర్తి స్థాయి హక్కులు లభించక వేల మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రాంతంలోని పట్టా భూములను మలాయి(అంటే ఉర్దూలో వదిలివేసిన అని అర్థం)గా పిలుస్తారు.
మంజీర తీరంలో నిషేధిత జాబితాలో వేల ఎకరాలు
వారసత్వ బదిలీకీ అవకాశం కరవు
ఈనాడు, హైదరాబాద్: మంజీర నదీ తీరంలో ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమిపై పూర్తి స్థాయి హక్కులు లభించక వేల మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆ ప్రాంతంలోని పట్టా భూములను మలాయి(అంటే ఉర్దూలో వదిలివేసిన అని అర్థం)గా పిలుస్తారు. వాటిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడంతో సమస్య మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, బోధన్ రెవెన్యూ డివిజన్ల పరిధిలో వేల ఎకరాల సాగు భూముల హక్కుల కల్పన విషయంలో రెవెన్యూశాఖ అయిదేళ్లుగా స్పష్టత ఇవ్వడం లేదు. 1934లో నిర్వహించిన భూముల సర్వే సమయంలో మంజీర ప్రాంతంలోని భూములకు ప్రత్యేకంగా సర్వే నంబర్లు కేటాయించలేదు. దస్త్రాల్లో ‘మలాయి’ పేరిట నమోదు చేశారు. నదికి ఇరువైపులా సాగుకు అనువైన భూములను స్థానిక గ్రామాల రైతులు సాగు చేస్తూ వస్తున్నారు. ఈ భూములకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల్లో ‘ఎం’ శ్రేణిలో 1, 2, 3 అనే సంఖ్యల్లో మాత్రమే నంబర్లు కేటాయించారు. 2017 వరకు ఇవన్నీ పట్టా భూములుగానే ఉన్నాయి. అనంతరం చేపట్టిన భూదస్త్రాల ప్రక్షాళన కార్యక్రమంలో వీటిని ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ నిషేధిత జాబితాలో చేర్చారు. పట్టాదారు మరణిస్తే ఎసైన్డ్ భూముల తరహాలోనైనా వారసుల పేర్లపైకి యాజమాన్య హక్కులు బదిలీ చేయడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందిస్తేనే...
ఏళ్ల తరబడి రెవెన్యూ దస్త్రాల్లో (1బి) చాలా మండలాల్లో మలాయి భూములను పట్టా భూములుగానే నమోదు చేస్తూ వచ్చారు. రైతులకు బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేశాయి. అయిదేళ్ల నుంచి భూముల రకంపై (నేచర్ ఆఫ్ ల్యాండ్) స్పష్టత కొరవడింది. నదీ పరీవాహకంలోని భూములు ప్రభుత్వానికే చెందుతాయని కొందరు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇనాం, పోరంబోకు, లావూణీ తదితర పేర్ల తీరులోనే వీటిని ఉదహరిస్తున్నారు. కానీ ఏళ్ల తరబడి పట్టాలుగా ఉన్నవాటిని.. ఎలా ప్రభుత్వ భూములంటారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆందోళనలు జరిగాయి. జిల్లా ఉన్నతాధికారులు ఈ వివాదంపై భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) కార్యాలయానికి లేఖలు రాస్తున్నా స్పష్టత రావడంలేదు. ప్రభుత్వ స్థాయిలోనే ఈ భూములపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే సమస్య సద్దుమణుగుతుందన్న అభిప్రాయం ఉంది. దీనిపై బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ను ‘ఈనాడు’ సంప్రదించగా.. చాలామంది రైతులు మలాయి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. వీటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విజ్ఞప్తులు వస్తున్నాయని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో