పేదల కంట.. కొత్తింటి ఆనందం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లు పేదలకు జీవితంపై భరోసాను కల్పిస్తున్నాయి. అద్దె కట్టలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వారికి రూపాయి ఖర్చు లేకుండానే గృహాలు దక్కుతుండటంతో ఊరట లభిస్తోంది.
సిద్దిపేట జిల్లాలో వేగంగా రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపు
పారదర్శకంగా అర్హుల ఎంపిక
మంత్రి హరీశ్రావు చొరవతో వడివడిగా పనులు
ఈనాడు, సంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రెండు పడకగదుల ఇళ్లు పేదలకు జీవితంపై భరోసాను కల్పిస్తున్నాయి. అద్దె కట్టలేక.. ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వారికి రూపాయి ఖర్చు లేకుండానే గృహాలు దక్కుతుండటంతో ఊరట లభిస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఈ పక్రియ వేగంగా సాగుతోంది. తొలుత సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో ఆదర్శంగా తీర్చిదిద్ది.. ఆపై అన్నిచోట్లా ఇదే తరహాలో ఇళ్లను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సిద్దిపేట జిల్లాలో 15,826 గృహాలను నిర్మించాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు 7,591 నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిలో 4,311 ఇళ్లను పంపిణీ చేశారు. ఇప్పటికే పూర్తయిన మరో 3,280 గృహాలకు సంబంధించి అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సిద్దిపేట పురపాలిక పరిధిలోని నర్సాపూర్ వద్ద అన్ని హంగులతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా 2,460 ఇళ్లను జీప్లస్-2గా నిర్మించారు. డిసెంబరు 2020లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పత్రాలను అందించారు. అనంతరం విడతల వారీగా సామూహిక గృహప్రవేశాలు చేపట్టారు. పేదల సొంతింటి కలను త్వరగా పూర్తి చేయడంలో మంత్రి హరీశ్రావు చొరవ కీలకంగా ఉంది. ఎప్పటికప్పుడు పనుల పురోగతి నుంచి అర్హుల ఎంపిక వరకు సమీక్షిస్తున్నారు. ఆయనే ప్రతి ఒక్కరికీ స్వయంగా పత్రాలు అందించి.. నూతన దుస్తులతో సత్కరించి గృహప్రవేశాలు చేయిస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ వేగంగా పంపిణీ చేసే విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. సంగారెడ్డి జిల్లాలో 2,563 ఇళ్లు నిర్మించగా.. 1,261 మందికి అందించారు. మెదక్ జిల్లాలో 2,344 నిర్మాణాలు పూర్తయ్యాయి.
అర్హులకే దక్కేలా..
పేదలకు.. నిజమైన అర్హులకే ఇళ్లు దక్కేలా దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. బిగ్డేటా సాయంతో విశ్లేషిస్తున్నారు. తుది అర్హుల జాబితానూ ప్రదర్శిస్తున్నారు. దానిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని పరిగణనలోకి తీసుకొని మరోసారి విచారణ చేపడుతున్నారు. ఇలా పూర్తిగా అర్హులకే ఇళ్లు దక్కేలా చూస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని పాటిస్తున్నారు.
ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నాం
-హరీశ్రావు, ఆర్థిక మంత్రి
నిరుపేదలకు అందించేలా సిద్ధంచేస్తున్న ఇళ్ల విషయంలో రాజీ పడటం లేదు. కొంత ఆలస్యమైనా నాణ్యతతో నిర్మిస్తున్నాం. అన్ని హంగులతో పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నాం. దళితులు, మైనార్టీలు, సంచారజాతుల వారికి ప్రాధాన్యమిచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చూస్తున్నాం. మిగతా నిర్మాణాలను వచ్చే మూడునెలల్లో పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణాలను పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు అందించారు. లబ్ధిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో