యాసంగిపై ఎన్నో ఆశలు!
ఆశావహ వాతావరణంలో కొత్త యాసంగి (రబీ) సీజన్ శనివారం (అక్టోబరు 1) నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సీజన్లో రైతులు పంటలు సాగు చేయనున్నారు. సెప్టెంబరు 30తో ముగిసిన వానాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోటీ 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు.
నేటి నుంచి సీజన్ ప్రారంభం
ముగిసిన వానాకాలం పంటల సాగు
ఎరువుల కేటాయింపును తగ్గించిన కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: ఆశావహ వాతావరణంలో కొత్త యాసంగి (రబీ) సీజన్ శనివారం (అక్టోబరు 1) నుంచి ప్రారంభమవుతోంది. వచ్చే ఏడాది మార్చి వరకూ ఈ సీజన్లో రైతులు పంటలు సాగు చేయనున్నారు. సెప్టెంబరు 30తో ముగిసిన వానాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కోటీ 36 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. వాటిలో పప్పుధాన్యాల పంటలు ఇప్పటికే కోతకు వస్తున్నాయి. మిగిలిన పంటలకు సైతం రైతులు అక్టోబరు నుంచి కోతలు ప్రారంభించి.. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించనున్నారు. కేంద్రం కొత్త పంటలకు 2022-23 సంవత్సరానికి ప్రకటించిన నూతన మద్దతు ధరలను రైతులకు చెల్లించాల్సిన కొత్త ‘మార్కెటింగ్ ఏడాది’ కూడా అక్టోబరు 1 నుంచే ప్రారంభమై 2023 సెప్టెంబరు చివరి వరకూ కొనసాగుతుంది. ఈమేరకు శనివారం నుంచి మార్కెట్లలో పంటలు విక్రయించే రైతులు.. తమకు కొత్త మద్దతు ధరలనే చెల్లించాలని వ్యాపారులను డిమాండ్ చేయాలని మార్కెటింగ్ శాఖ వర్గాలు తెలిపాయి.
అరకోటి ఎకరాలకు పైమాటే..!
రాష్ట్రంలో యాసంగి సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా గతేడాది (2021) 55 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. 2020లో ఏకంగా 67.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది వానాకాలంలో జులై నుంచి ఇంతవరకు రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నందున జల వనరులు కళకళలాడుతున్నాయి. సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్న సంవత్సరాల్లో యాసంగిలో పంటలు రికార్డుస్థాయిలో రైతులు సాగుచేయడం ఆనవాయితీ. ఈ అంచనాల ప్రకారం ఈ సీజన్లో కూడా అరకోటి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు వేసే అవకాశం ఉందన్న అంచనాలతో వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
తగ్గిన యూరియా కేటాయింపు..
దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని కేంద్ర వ్యవసాయశాఖ ఇటీవల అన్ని రాష్ట్రాలకు సూచించింది. భూసార పరీక్షలు చేయించి.. తదనుగుణంగానే ఎరువులు వాడేలా రైతులను చైతన్యపరచాలని తెలిపింది. సేంద్రీయ ఎరువుల వాడకం పెరిగేలా ప్రోత్సహిస్తే రసాయన ఎరువుల వాడకం తగ్గుతుందని సూచించింది. ఈ నేపథ్యంలో సాగు ప్రారంభమవుతున్న యాసంగి పంటలకు వానాకాలంతో పోలిస్తే 9.34 లక్షల టన్నుల ఎరువులను తక్కువగా కేంద్ర ఎరువుల శాఖ తెలంగాణకు కేటాయించింది. గత ఏడాది యాసంగిలో యూరియా 8.50 లక్షల టన్నులు ఇచ్చింది. ఈ సీజన్లో అంత వినియోగం ఉండదని, పైగా వానాకాలంలో మిగిలిన నిల్వలుంటే వాడుకోవాలంటూ 7.89 లక్షల టన్నులే కేటాయించింది. వరి సాగు విస్తీర్ణం 2020 యాసంగిలో 52 లక్షల ఎకరాలు దాటింది. ఈ సీజన్లో సైతం సాగునీరు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున విస్తీర్ణం గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఇంతవరకు వానాకాలంలో సైతం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 64.50 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేసినందున ఈ పంటకు అక్టోబరులో యూరియా వినియోగం గణనీయంగా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. కాగా ఎరువుల కొరత ఏమీ ఏర్పడదని, యాసంగిలో పంటలు సాగయ్యే తీరును బట్టి అవసరమైతే కేంద్రం అదనంగా సరఫరా చేస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అధిక వర్షాలతో వానాకాలం పంటలు ఆలస్యంగా సాగు చేసినందున ఈ యాసంగిలో కొత్తగా విత్తనాలు, నాట్లు వేయడం ఆలస్యమయ్యే సూచనలున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. అయితే వచ్చే మార్చి చివరికల్లా యాసంగి వరికోతలు పూర్తయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలని, తద్వారా ఏప్రిల్లో వడగండ్లు, అధిక వర్షాలతో పంట నష్టాలు లేకుండా బయటపడవచ్చని అధికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి సూచించారు. విత్తనాలు, ఎరువులకు కొరత లేకుండా రైతులకు సరఫరా చేయాలని ఆయన ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!