సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో భారత్, ఫ్రాన్స్ల మధ్య సహకారం
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టీ హబ్, ఇండో ఫ్రాన్స్ పరిశ్రమలు, వాణిజ్యమండలి (ఐఎఫ్సీసీఐ)ల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది.
మంత్రి కేటీఆర్ సమక్షంలో టీహబ్, ఐఎఫ్సీసీల ఒప్పందం
ఈనాడు, హైదరాబాద్: భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సాంకేతిక, ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థ టీ హబ్, ఇండో ఫ్రాన్స్ పరిశ్రమలు, వాణిజ్యమండలి (ఐఎఫ్సీసీఐ)ల మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదిరింది. తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు, ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లెనైన్ల సమక్షంలో పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, ఐఎఫ్సీసీఐ అధ్యక్షుడు సుమిత్ ఆనంద్లు దీనిపై సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి పాల్ హెర్మెలిన్, టీహబ్ సీఈవో ఎం.శ్రీనివాస్రావు, సీఐవో పి.మదన్గోపాల్ పాల్గొన్నారు. ఏడాదిపాటు అమల్లో ఉండే ఈ ఒప్పందం ద్వారా భారత్, ఫ్రాన్స్లకు చెందిన సాంకేతిక అంకురాలను ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో బలోపేతం చేస్తామని జయేశ్, ఆనంద్ తెలిపారు. టీహబ్, ఐఎఫ్సీసీఐలు విస్తృతస్థాయిలో కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహిస్తాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆవిష్కరణల రంగంలో టీహబ్ ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరిందని అన్నారు. మరోవైపు ఐఎఫ్సీసీఐ హైదరాబాద్ శాఖను టీహబ్లో ప్రారంభించింది.
టీఎస్ఐఐసీలో ఫ్రాన్స్ వాణిజ్య బృందం
ఫ్రాన్స్ ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి పాల్ హెర్మెలిన్ ఆధ్వర్యంలోని వాణిజ్యబృందం శుక్రవారం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)ని సందర్శించింది. తెలంగాణలో పారిశ్రామిక ప్రాంతాలు, భూబ్యాంకు, మౌలిక వసతులపై సంస్థ ఎండీ వెంకట నరసింహారెడ్డి ఫ్రాన్స్ ప్రతినిధులకు వివరించారు. అన్ని జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, ఎక్కడికైనా విమానాశ్రయం నుంచి గంట ప్రయాణమేనని తెలిపారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్, నీటి వసతి, టెలికాం తదితర సౌకర్యాల గురించి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే