గాంధీ.. ఆ మాటే శాంతికి నాంది
పరిపాలన సాగించే మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులందరికీ గాంధీ సిద్ధాంతాలతో ‘ప్రవర్తనా నియమావళి’ (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉండాలి. దాన్ని వారు తు.చ.తప్పకుండా పాటించాలి.
పరమత సహనం, సహకార జీవనంతోనే మహాత్ముని ఆదర్శాల అమలు
గ్రామస్వరాజ్యం ఉంటేనే ప్రజాస్వామ్యం బలోపేతం
ప్రజాప్రతినిధులకు ప్రవర్తనా నియమావళి ఉండాలి
బాపూజీ ఆశయాలను నెరవేర్చుతూ భారత్ ప్రపంచానికి దారిచూపాలి
‘ఈనాడు’తో జర్మనీకి చెందిన గాంధేయవాది క్రిస్టియన్ బార్టోల్ఫ్
ఈనాడు - హైదరాబాద్
పరిపాలన సాగించే మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ప్రజాప్రతినిధులందరికీ గాంధీ సిద్ధాంతాలతో ‘ప్రవర్తనా నియమావళి’ (కోడ్ ఆఫ్ కండక్ట్) ఉండాలి. దాన్ని వారు తు.చ.తప్పకుండా పాటించాలి. వైద్యవృత్తిలోకి వచ్చేవారంతా నైతిక నిష్ఠ పాటిస్తామని ప్రమాణం చేస్తున్నట్టే ప్రజాప్రతినిధులూ గాంధీ ఆశయాలను పాటిస్తామని ప్రమాణం చేయాలి. వాటిని పాటించి చూపాలి. గ్రామస్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు అందరూ శాంతియుత గాంధీ మార్గాన్ని అనుసరిస్తే ప్రాంతాలు, ప్రజల మధ్య వివాదాలు రావు.
- క్రిస్టియన్ బార్టోల్ఫ్
జర్మనీలో పుట్టి పెరిగిన బార్టోల్ఫ్ బెర్లిన్లోని గాంధీ సమాచార కేంద్రం అనే విద్యాసొసైటీకి అధ్యక్షుడిగా, 1993 నుంచి అక్కడి ఫ్రీ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. మహాత్మాగాంధీ రచనలు, ఆయన గురించి వచ్చిన పుస్తకాలపై బార్టోల్ఫ్ అనేక ఏళ్లపాటు లోతైన పరిశోధనలు చేశారు. గాంధీ సమకాలికులతో మాట్లాడి.. వారు తెలిపిన వివరాలతో పలు రచనలు చేశారు. దక్షిణాఫ్రికాలో గాంధీ మిత్రుడైన హెర్మన్ కెలన్బాక్తో మాట్లాడి పుస్తకం రాశారు. పలు దేశాల్లో పర్యటిస్తూ మహాత్ముడి ఆశయాలపై ప్రదర్శనలు, ప్రసంగాలతో విరివిగా ప్రచారం చేస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశంలోని 45 పట్టణాల్లో గాంధీ గురించి ప్రసంగించేందుకు అరుణాచల్ప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకూ పలు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన హైదరాబాద్లో ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
జర్మనీలో పుట్టిన మీకు గాంధీపై ఆసక్తి ఎలా కలిగింది?
జర్మనీలో హిట్లర్ పాలనలో జైలుపాలైన విలేకరి ఓన్ ఓసెట్జీకీ.. హైదరాబాద్లో పుట్టిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ కుటుంబ వారసులు నాకు దూరపు బంధువులు. జర్మనీలో నా చిన్నప్పుడు వారితో కలసి తిరిగిన సందర్భాల్లో గాంధీ ఆశయాల గురించి గొప్పగా చెప్పేవారు. ఆ తరువాత గాంధీ రచనలు, ప్రసంగాలు, ఆయన పలువురికి రాసిన ఉత్తరాలు చదువుతూ ఎంతో స్ఫూర్తి పొందాను. బాపూ బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను.
ఆధునిక పోటీ ప్రపంచంలో గాంధీ సిద్ధాంతాల అమలుకు ఎంతమేర అవకాశం ఉంది?
చాలావరకు ఉంది. ప్రజలంతా సహకార స్ఫూర్తితో జీవిస్తేనే అభివృద్ధి సాధ్యమని గాంధీ చెప్పారు. ఇప్పుడు ఏ దేశంలో అయినా అభివృద్ధి సాధించాలంటే ప్రజల పరస్పర సహకార జీవనమే ప్రధానం. ఒకదేశంలో ప్రజల మధ్యనే కాదు, దేశాల మధ్య కూడా సహకార స్ఫూర్తి ఉన్నప్పుడే పరస్పరం అభివృద్ధి చెందుతాయి.
గాంధీ ఆశయాలు, ఆయన చెప్పిన సిద్ధాంతాల ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతోందా?
గాంధీ భారతదేశానికి గొప్ప వనరు. ప్రపంచ దేశాలకు ఏ సందర్భంలోనైనా, ఎక్కడైనా నాయకత్వం వహించే అవకాశం భారతదేశానికి వస్తే తప్పనిసరిగా గాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతాలే ప్రాతిపదికగా మార్గదర్శనం చేయాలి. అనేక దేశాల్లో గాంధీని ఇప్పటికీ ఎంతోమంది అనుసరిస్తున్నారంటే అది భారతదేశం ఇచ్చిన గొప్ప మార్గమే కదా. గ్రామస్వరాజ్యం పరిఢవిల్లితే గాంధీ ఆశయాల ప్రకారం భారతదేశం అభివృద్ధి చెందుతుంది.
దేశాల మధ్య వివాదాలు యుద్ధాలకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో అహింసా సిద్ధాంతం చెబితే వింటారా?
దేశాల మధ్య యుద్ధాలు, అణ్వాయుధాలను గాంధీ వ్యతిరేకించారు. అణ్వాయుధాల వల్ల మానవాళికి ముప్పు అని, నిరాయుధీకరణే శరణ్యమన్నారు. ఏ రూపంలోనూ వాటిని తయారు చేయకూడదన్నారు. గాంధీజీ చెప్పిన అహింసా సిద్ధాంతంతోనే ప్రపంచశాంతి సాధ్యమని ఐక్యరాజ్యసమితి కూడా గతంలో చెప్పింది. ఇతర దేశాల ఆక్రమణను ఆయన ఆమోదించలేదు. యుద్ధం జరిగినప్పుడు తటస్థంగా ఉండాల్సిన అవసరం లేదని, అది ముగిసేందుకు శాంతియుత మార్గంలో కృషి చేయాలని గాంధీ చెప్పారు.
శాంతి మార్గంలో యుద్ధాన్ని ముగించడమంటే ఎలా?
గాంధీ అనుసరించిన ఒక మార్గాన్ని చెబుతాను. దక్షిణాఫ్రికాలో ఆయన న్యాయవాదిగా పనిచేసేవారు. కోర్టుల్లో కేసు ఓడిపోయినవారు బాధపడుతూ ఆత్యహత్యలకు పాల్పడకూడదన్న ఉద్దేశంతో.. గాంధీ మధ్యవర్తిత్వం వహించి పరిష్కారాలు చూపడానికి కృషి చేసేవారు. ఇరువర్గాల మధ్య వివాదాలు, యుద్ధాలు, గొడవలు వచ్చినప్పుడు మధ్యవర్తిత్వం, చర్చలతో పరిష్కారమార్గాలు చూపడం సులభం. ఇలా చర్చలు జరిపి శాంతియుత మార్గంలో వివాదాలను పరిష్కరించడంలో మధ్యవర్తిగా గాంధీకి గొప్ప పేరు ఉంది. దానినే అహింసా సిద్ధాంతమని మరోపేరుగా చెప్పవచ్చు. హింస ఎంత సాగించినా ఉపయోగం ఉండదు. చివరికి శాంతియుత చర్చలు, మధ్యవర్తిత్వంతోనే మెరుగైన పరిష్కారం లభిస్తుంది. అంతర్జాతీయ చట్టాలు కూడా ఇదే చెబుతున్నాయి కదా!
జర్మనీ, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో గాంధీయిజం ఏ మేరకు ఉంది?
అనేక దేశాల్లో గాంధీ విధానాలను పలుమార్గాల్లో అనుసరిస్తున్నారు. ఆయన సిద్ధాంతాలపై అమెరికా, జర్మనీ వంటి అనేక దేశాల విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కోర్సులు సైతం నిర్వహిస్తున్నారు. వాటిలో ఎంతోమంది ఆసక్తిగా చేరి అధ్యయనం చేస్తున్నారు. గాంధీ సమాచార కేంద్రం ద్వారా అహింసా సిద్ధాంతం గురించి పలు దేశాల్లో నేను ప్రసంగిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నాను. నేను పర్యటించినప్పుడు అనేక దేశాల్లో మేధావులు, సామాన్యులు కూడా ఆయన సిద్ధాంతాల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.
భారతదేశంలో పర్యటిస్తూ మీరు గమనించిన అంశాలు, జర్మనీతో పోలిస్తే తేడా ఏమిటి?
నేను గాంధీ సిద్ధాంతాల గురించి చెబుతున్నప్పుడు ప్రపంచమంతటా ప్రజల్లో దాదాపు ఒకే రకమైన స్పందన కనిపిస్తోంది. ఎక్కడైనా ప్రజలు శాంతి, అహింసలనే కోరుకుంటున్నారు. సమాఖ్య స్ఫూర్తితో పాలకులే దాన్ని అందించాలి. కాలుష్యం వదిలే అభివృద్ధి కాకుండా పర్యావరణాన్ని కాపాడే హరిత ఇంధన ఉత్పత్తి వంటి అంశాలతో భారత్ మరింత అభివృద్ధి చెందాలి. పేదల సంక్షేమ కార్యక్రమాలు విరివిగా చేపట్టి అందరూ సమానంగా అభివృద్ధి చెందేలా చూడాలి.
ప్రస్తుత యువతరానికి గాంధీ గురించి సులభంగా ఎలా చెప్పాలి?
ఆయన రచనలు ఎవరికైనా సులభంగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అనేక అంశాలపై ఆయన సూటిగా, సరళంగా తన అభిప్రాయాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ బాపూజీ రచనలను లోతుగా చదివేలా చేస్తే చాలు.. అవే వారిలో మార్పు తెస్తాయి. గాంధీ రచనలు చదివాకే నాలో ఎంతో మార్పు వచ్చింది.
బాపూజీ ఆశయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి?
పరమత సహనం, నిరుపేదల సంక్షేమం, అందరి సమాన అభివృద్ధి కోసం మనం పాటుపడితే గాంధీ ఆశయాలను అమలు చేసినట్టే. ప్రతి మతం వారు ఇతర మతాలను గౌరవించడమే కాకుండా ప్రశంసించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కూలీల కనీస వేతనం రూ.300
ఏప్రిల్ నుంచి మొదలయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రవీణ్ప్రకాశ్ భేటీ వెనుక ఉద్దేశం ఏమిటో!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఏప్రిల్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఊసరవెల్లులే సిగ్గుతో చచ్చిపోతాయ్!
దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో! మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో బుధవారం చేసిన వ్యాఖ్యలు వింటే ఊసరవెల్లులు సైతం సిగ్గుతో చచ్చిపోతాయేమో! -
సీఎం పీఆర్ఓలా... వైకాపా నాయకులా?
ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ప్రజాసంబంధాల అధికారులు (పీఆర్ఓ)గా పనిచేస్తున్నవారు ఎన్నికల నిబంధనల్ని తుంగలో తొక్కుతూ అధికారపార్టీ సేవలో తరిస్తున్నారు. -
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రిలో ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
‘కంప్యూటర్ ఏదీ.. ఎక్కడ ఉంది.. మౌస్ కనిపించట్లేదు. బిల్లులు ఇంకా ఎన్ని ఉన్నాయి. త్వరగా చూడాలి. ఫైళ్లన్నీ తీసుకురండి’ అంటూ మడకశిర ఉప ఖజనా శాఖ (ఎస్టీఓ) కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ ఎకౌంటెంట్ హరినాథ్ ఆసుపత్రి పడకపై కలవరిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. -
సీఎంను కీర్తించేందుకు.. ‘మేమంతా సిద్ధం’!
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గురువారం నంద్యాల జిల్లాలో జరగనుంది. ఉదయం ఆళ్లగడ్డ నుంచి జగన్ బస్సు యాత్ర పలు గ్రామాల మీదుగా ప్రయాణించి నంద్యాల చేరుకుంటుంది. -
దాడి చేసి.. దండంతో సరి!
కాకినాడలోని పెద్ద శివాలయంలో అర్చకులు వెంకట సత్యసాయి, విజయ్కుమార్లను కొట్టిన మాజీ కార్పొరేటర్, వైకాపా నేత సిరియాల చంద్రరావును కాపాడేందుకు ఆ పార్టీ నాయకులు నానాతంటాలు పడుతున్నారు. -
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
‘డ్రైడ్ఈస్ట్ పేరుతో విశాఖకు మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తుంటే సీబీఐ ఈ మధ్యకాలంలో దాడి చేసింది. పచ్చసోదరులంతా ఉలిక్కిపడి.. మన (వైకాపా)మీద నెట్టేయడానికి సిద్ధమయ్యారు. -
స్క్రీనింగ్ లేకుండానే రూ. 2,000 కోట్ల చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రూ.2,000 కోట్ల చెల్లింపులు ఎలాంటి స్క్రీనింగ్ లేకుండానే జరిగిపోయాయి. ఇందులో పారదర్శకత లేదు. -
బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు
వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. -
జగన్ అనే నేను.. ఒక వినాశకారి!
జగన్ అనే నేను... ఆంధ్రావనికి ఒక్క పరిశ్రమనూ రానివ్వనని పాత వాటిని పారదోలుతానని... కొత్త కొలువులు సృష్టించనని... అంతఃకరణ శుద్ధితో ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... ... అని చెప్పకున్నా... అయిదేళ్లుగా దాదాపు ఆ పనే చేశారు వైకాపా నేత! -
ఎన్నికల కోడ్ తర్వాత రూ.వేల కోట్ల పందేరం
ఎవరైనా మనకు ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్ విధానంలో డబ్బులు బదిలీ చేస్తే మన ఖాతాకు ఎంతసేపట్లో చేరతాయి? కొద్ది గంటల్లో రావచ్చు. -
ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?
‘సారూ.. ఏం అభివృద్ధి చేశారని మా ఊరొచ్చారు?’ అని ఏలూరు జిల్లా నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావును మహిళలు, గ్రామస్థులు నిలదీశారు. -
‘యాప్’రే రూ.30 లక్షలా?
విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించే డబ్బులను ఉన్నత విద్యామండలి దుర్వినియోగం చేస్తోంది. బ్యాంకు ఖాతాల్లో రూ.కోట్లు ఉండడంతో ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి, వాటిని ఖాళీ చేస్తోంది. -
తిరుమలలో జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడి వివాహ వేడుక
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భానుప్రకాశ్, సౌజన్యల వివాహ వేడుక స్థానిక పుష్పగిరి మఠంలో బుధవారం జరిగింది. -
శ్రీవారి సేవలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేష్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తి కుటుంబానికి తితిదే అధికారులు స్వాగతం పలికారు. -
డోన్, విజయనగరం జిల్లా గుత్తేదార్లకే టోకెన్లు
కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి (సీఆర్ఐఎఫ్) కింద పనులు చేసిన గుత్తేదారులు రూ.176 కోట్ల బిల్లుల కోసం సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. -
అప్పు తేవాలి.. బొగ్గు కొనాలి!
అప్పు పుడితే బొగ్గు వస్తుంది.. బొగ్గు వస్తే థర్మల్ యూనిట్లు నడుస్తాయి.. ఇదీ ఏపీ జెన్కో పరిస్థితి. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో సుమారు 40 శాతం జెన్కో నుంచి అందుతోంది. -
ఆరంభమే ఫ్లాప్
వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. -
నమ్మించారు.. వంచించారు
‘హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా’ అని సినిమాలో ఒక రాజకీయ నాయకుడి పాత్రలో నటుడు చెప్పినట్లుగా.. మన ముఖ్యమంత్రి హామీల మీద హామీలు గుప్పించారు. -
జగన్ ‘ఓట్లాట’లో ఓడిన రైతు!
కనికట్టు చేయడంలో... మాటల గారడీతో మభ్యపెట్టడంలో... పేటెంట్ హక్కు సీఎం జగన్దే... మొన్నటి వరకు విద్యుత్ కోతలతో ప్రజలను అల్లాడించిన వ్యక్తే... ఇప్పుడు ఎన్నికలు రావడంతో పంథా మార్చేశారు... వేసవి కాలం పేరిట ఓటర్లను ఏ‘మార్చు’తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్