వేములవాడ బతుకమ్మ సంబురాల్లో గవర్నర్‌

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు.

Updated : 02 Oct 2022 05:40 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల, వేములవాడ,  న్యూస్‌టుడే: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకలకు గవర్నర్‌ తమిళిసై హాజరయ్యారు. తొలుత ఆలయానికి చేరుకున్న గవర్నర్‌కు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌ హెగ్డే పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాజన్న ఆలయ దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ.. బతుకమ్మ అంటే కేవలం పూల పండుగే కాదని ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతను నేర్పిస్తుందన్నారు. పట్టణంలోని మూలవాగు ఒడ్డున జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు