తెలంగాణపై ఎన్జీటీ కొరడా
తెలంగాణపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) కొరడా ఝళిపించింది. ఘన, ద్రవ వ్యర్థాలను సరిగా నిర్వహించనందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని వ్యర్థాల ఉత్పత్తికి కారకుల నుంచి వసూలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.
ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో విఫలమైనందుకు రూ.3,825 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశం
ఈనాడు, దిల్లీ: తెలంగాణపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) కొరడా ఝళిపించింది. ఘన, ద్రవ వ్యర్థాలను సరిగా నిర్వహించనందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,825 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని వ్యర్థాల ఉత్పత్తికి కారకుల నుంచి వసూలు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. ఈ నిధిని రెండు నెలల్లోగా ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పర్యావరణ దిద్దుబాటు చర్యల కోసమే దీనిని వినియోగించాలని ఆదేశించింది. మురుగునీటి నిర్వహణ కోసం కొత్తగా శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వ్యవస్థలను ఆధునికీకరించుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం ప్లాంట్లు ఏర్పాటు చేయాలనీ ఆదేశించింది. పర్యావరణ పునరుద్ధరణ పనులను అన్ని జిల్లాలు, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో నిర్దిష్ట కాలపరిమితిలోగా చేపట్టాలని పేర్కొంది. ఒకవేళ ఉల్లంఘనలు ఇలాగే కొనసాగితే.. అదనపు జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ ఉత్తర్వులను అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిదేనని స్పష్టంచేసింది. ఇందుకోసం సీనియర్స్థాయి అధికారిని నోడల్ సెక్రటరీగా నియమించాలని ఆదేశించింది. ఈ అంశం పురోగతిపై ట్రైబ్యునల్ రిజిస్ట్రార్ జనరల్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆరు నెలలపాటు ప్రతినెలా నివేదిక పంపాలని పేర్కొంది.
నేపథ్యమిదీ..
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ అంశాన్ని 18 ఏళ్లపాటు విచారించిన సుప్రీంకోర్టు చివరకు ఆ బాధ్యతలను ఎన్జీటీకి బదిలీ చేస్తూ 2014 సెప్టెంబరు 2న ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ గత ఎనిమిదేళ్లుగా ఈ అంశంపై విచారణ చేపడుతోంది. 2016 నుంచి 2022 మే నెల వరకు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై రాష్ట్రాలకు పలు ఆదేశాలు జారీ చేసింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 2019 జనవరి 16 నుంచి విడతలవారీగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడింది. 2019 ఏప్రిల్ 29న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) హాజరు కాగా, రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి 14న ఎన్జీటీ ఎదుట సీఎస్ మరోసారి హాజరు కాగా 2020 మార్చి 31లోపు జలాశయాల్లో మురుగునీరు కలవకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ విషయంలో విఫలమైతే అందుకు కారణమైన మున్సిపాలిటీ ఒక్కో డ్రెయిన్కు నెలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని పేర్కొంది. మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటును వెంటనే మొదలుపెట్టాలని, 2021 మార్చి 31 నుంచి పని ప్రారంభించేలా చూడాలని నిర్దేశించింది. వీటి అమలు తీరుపై తెలంగాణ సీఎస్ గత సెప్టెంబరు 28న ఎన్జీటీకి నివేదిక సమర్పించారు. దాన్ని పరిశీలించిన ఎన్జీటీ.. తమ ఆదేశాల అమలులో పెద్దగా పురోగతి లేదని ఆక్షేపించింది. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణలో ఇప్పటికీ తీవ్ర లోపాలున్నాయని తప్పుపట్టింది. 141 పట్టణ స్థానిక సంస్థల్లో 5.9 మిలియన్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దీనికితోడు రోజూ 2,446 టన్నులు పోగవుతోందని గుర్తుచేసింది. పారబోసే స్థలాల్లో పేరుకుపోయిన చెత్త జల, వాయు, భూమి, పర్యావరణ కాలుష్యానికి, ప్రజల అనారోగ్యానికి కారణమవుతోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోజూ ఉత్పత్తవుతున్న మురుగునీరు, శుద్ధి ప్లాంట్ల మధ్య 1,824 ఎంఎల్డీ(రోజుకు మిలియన్ లీటర్లు) అగాధం ఉందని తెలిపింది. ఇందులో అనధికార కాలనీల నుంచి వెలువడే మురుగునీటిని లెక్కలోకి తీసుకోలేదని పేర్కొంది. ప్లాంట్ల ఏర్పాటు కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని గుర్తుచేసింది. ఇప్పటికీ శుద్ధి చేయని మురుగునీటిని అలాగే వదిలేస్తున్నారని, దీంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతిని రోగాలు ప్రబలి మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. తమ ఆదేశాలను అమలు చేయనందుకు పరిహారం చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో రోజూ వెలువడుతున్న మురుగునీరు, దాన్ని శుద్ధిచేసే ప్లాంట్ల మధ్య 1,824 ఎంఎల్డీ అగాధం ఉన్నందువల్ల ఒక్కో ఎంఎల్డీకి రూ.2 కోట్ల చొప్పున రూ.3,648 కోట్లు చెల్లించాలని పేర్కొంది. అలాగే రాష్ట్రంలో పేరుకుపోయిన 5.9 మిలియన్ టన్నుల చెత్తకు టన్నుకు రూ.300 చొప్పున రూ.177 కోట్లు కలిపి మొత్తం రూ.3,825 కోట్లను రెండు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది.
2019 ఏప్రిల్ 29న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్జీటీ జారీ చేసిన ఆదేశాలు..
* రాష్ట్రంలో మూడు ప్రధాన నగరాలు, ప్రధాన పట్టణాలు, ప్రతి జిల్లాలో మూడు ప్రధాన పంచాయతీలను ఆదర్శ నగరాలు, పట్టణాలు, పంచాయతీలుగా ప్రకటించాలి. వాటిలో ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం ఆరు నెలల్లోపు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి. మిగిలిన అన్నిచోట్లా ఏడాదిలోపు అమలుచేయాలి.
* ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి మూడు నెలలకోసారి నివేదిక పంపాలి. తొలి నివేదిక 2019 జులై 30కల్లా రావాలి.
* ఆదేశాల అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కనీసం నెలకోసారైనా అన్ని జిల్లాల కలెక్టర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి పర్యవేక్షించాలి.
* పర్యావరణ నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్ తన స్థాయిలో కనీసం రెండు వారాలకోసారైనా పరిశీలన జరపాలి.
* ఈ విషయంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలి.
* పర్యావరణానికి జరిగిన నష్టం విలువను అంచనా వేసి.. దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైన పరిహారం వసూలుకు ప్రణాళిక రూపొందించి ఆ మొత్తాన్ని కాలుష్యానికి కారణమైన వారినుంచి రాబట్టాలి.
* అన్ని నియంత్రణ సంస్థల(రెగ్యులేటరీ బాడీస్) పనితీరుపై ఆడిట్ నిర్వహించి, ఏమైనా లోపాలుంటే ఆరు నెలల్లోపు దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.
* ర్యాంకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పర్యావరణ దిద్దుబాటు చర్యలు చేపట్టిన ప్రాంతాలు, సంస్థలు, వ్యక్తులకు ప్రోత్సాహకాలు అవార్డులు ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి