భవనం శిథిలం.. శిరస్త్రాణమే శరణ్యం!

పక్క చిత్రంలో కనిపిస్తున్న ఉద్యోగులు శిరస్త్రాణం ధరించి విధులు నిర్వహిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా.. భవనం పైకప్పు నుంచి పెచ్చులూడి పడుతుండడమే దీనికి కారణం.

Published : 04 Oct 2022 04:25 IST

పక్క చిత్రంలో కనిపిస్తున్న ఉద్యోగులు శిరస్త్రాణం ధరించి విధులు నిర్వహిస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా.. భవనం పైకప్పు నుంచి పెచ్చులూడి పడుతుండడమే దీనికి కారణం. నిర్మల్‌ జిల్లా భైంసా మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామపంచాయతీ భవనం శిథిలావస్థకు చేరడంతో పైకప్పు నుంచి రోజూ పెచ్చులూడి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు ప్రాణరక్షణ కోసం ఇలా హెల్మెట్‌ ధరించి ఉంటున్నారు.

- న్యూస్‌టుడే, భైంసా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని