ఒంట్లో ఆర్నెల్లకు పైగా కరోనా తిష్ఠ
కొవిడ్ వచ్చి తగ్గాక కూడా నిరంతరాయంగా జ్వరం రావడం, దగ్గు, ఆయాసం, రక్త పరీక్షల్లో సీఆర్పీ పెరగడం, సీటీ స్కాన్ చేసినప్పుడు ఊపిరితిత్తుల్లో నిమోనియా లక్షణాలు కనిపించడం వంటివి గుర్తిస్తే ఒంట్లో ఇంకా కరోనా వైరస్ ఉందేమోనని అనుమానించాలి.
శ్వాసకోశాల్లో అంతర్లీనంగా వైరస్
సాధారణ పరీక్షల ద్వారా నిర్ధారణ కష్టం
రోగనిరోధక శక్తి తక్కువున్నవారిలో ముప్పు అధికం.. పరిశోధనల్లో వెల్లడి
ఈనాడు- హైదరాబాద్: కొవిడ్ వచ్చి తగ్గాక కూడా నిరంతరాయంగా జ్వరం రావడం, దగ్గు, ఆయాసం, రక్త పరీక్షల్లో సీఆర్పీ పెరగడం, సీటీ స్కాన్ చేసినప్పుడు ఊపిరితిత్తుల్లో నిమోనియా లక్షణాలు కనిపించడం వంటివి గుర్తిస్తే ఒంట్లో ఇంకా కరోనా వైరస్ ఉందేమోనని అనుమానించాలి. టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్, మలేరియా తదితర వ్యాధులేమీ లేవని ముందుగా తేల్చుకోవాలి... ఇదే విషయాన్ని ఇటీవల అమెరికాలోని ఎమోరీ, ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. తాజాగా తమ అధ్యయన పత్రాల్లో వెల్లడించారు.
హైదరాబాద్కు చెందిన ఒక మానసిక వైద్యుడు(50) క్యాన్సర్కు చికిత్స పొందుతున్నారు. చికిత్సలో భాగంగా ‘రిటుక్సిమాబ్’ ఇంజక్షన్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కొవిడ్ మూడోదశలో గత జనవరిలో వైరస్ బారినపడ్డారు. స్వల్ప లక్షణాలే కనిపించాయి. రెండువారాల్లో తగ్గిపోయాయి. నెల తర్వాత జ్వరం మొదలైంది. ఎంతకీ తగ్గటం లేదు.. 25 కిలోల వరకూ బరువు తగ్గారు. పరీక్ష చేయిస్తే రక్తంలో సీఆర్పీ గణనీయంగా పెరిగింది. సీటీ స్కాన్ ద్వారా.. ఊపిరితిత్తుల్లో నిమోనియాను గుర్తించారు. వైద్యులు బయాప్సీ సహా పరీక్షలన్నీ చేశారు. ఎన్నిసార్లు పరీక్షించినా కొవిడ్ లేదనే ఫలితాలు వస్తున్నాయి. కొవిడ్ చికిత్సానంతరం ‘ఆటోఇమ్యూన్ డిజార్డర్’ సోకి ఉంటుందనే అంచనాతో స్టెరాయిడ్ చికిత్స చేయాలనుకున్నా..దానిపై అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మరో వైద్యుడి వద్దకు వెళ్లారు. అక్కడ మరింత లోతుకు వెళ్లి ఖరీదైన ఎలక్ట్రాల్ మైక్రోస్కోపీ పరీక్ష చేసి, శ్వాసకోశ కణజాలాన్ని పరీక్షించగా.. వైరస్ ఊపిరితిత్తుల్లోనే తిష్ఠ వేసిందని నిరూపితమైంది. సాధారణ విధానంలో ఇది సాధ్యం కాలేదు. అప్పుడు రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వడంతో రెండు వారాల్లోనే రోగి కోలుకున్నారు. కొందరిలో దీర్ఘకాలం ఇలా కరోనా వైరస్ వేధిస్తోందని చెబుతున్నారు శ్వాసకోశ వైద్య నిపుణులు డా.విశ్వనాథ్ గెల్లా.
ఎవరిలో ఎక్కువ హాని..?
కొవిడ్ సోకినా అత్యధికుల్లో 1-2 వారాల్లో వైరస్ శరీరం నుంచి మాయమవుతుంది. గరిష్ఠంగా 3 వారాలు ఉంటుంది. కొందరిలోనేమో అది ఆర్నెల్ల పైబడి తిష్ఠవేస్తోంది. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడినవారిలో, కీమోథెరపీ తీసుకున్నవారిలో, క్యాన్సర్ చికిత్సల్లో భాగంగా ఇచ్చే రిటుక్సిమాబ్ ఇంజక్షన్ చేయించుకున్నవారిలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో నెలల తరబడి కూడా వైరస్ ఉంటున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. సాధారణంగా రిటుక్సిమాబ్ ఇంజక్షన్ను ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సలో కూడా ఇస్తుంటారు. అది ఇచ్చినప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి, వైరస్ త్వరగా ఒంట్లోంచి వెళ్లిపోవడం లేదని తేలింది.
కొత్త వేరియంట్ల పుట్టుక ముప్పూ..
కరోనా వైరస్ దీర్ఘకాలం శ్వాసకోశాల్లో ఉన్నప్పుడు.. అక్కడ క్రమేపీ వాటి సంఖ్య పెరిగిపోతుంది. ఈ వైరస్లో సహజసిద్ధ మార్పుల ఫలితంగా అత్యధిక సందర్భాల్లో హానికారక వేరియంట్లు పుట్టకపోవచ్చు. కానీ, ఒక వ్యక్తిలో వైరస్ దాగి ఉన్నపుడు అంతర్గతంగా విపరీత మార్పులు చోటుచేసుకొని, వారిలోనూ డెల్టా, ఒమిక్రాన్ వంటి ప్రమాదకర వేరియంట్లు ఉద్భవించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. వారి ద్వారా ఇతరులకు వ్యాపించి, ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. అత్యధికులు రెండు డోసుల టీకా స్వీకరించినా.. కొవిడ్ బారిన అంతకుముందే పడినా.. మళ్లీ వారు వైరస్ బాధితులవుతున్నారు. దీనికి మూలకారణం.. వైరస్ నిరంతరాయంగా మార్పులకు లోనవడమేనని తాజా అధ్యయనంలో తేల్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీన్ని ధ్రువీకరించింది.
లక్షణాలుంటే తప్పదు మాస్కు
- డా.విశ్వనాథ్ గెల్లా, సీనియర్ శ్వాసకోశ వైద్యనిపుణులు, ఏఐజీ
కరోనా వైరస్ దీర్ఘకాలం ఊపిరితిత్తుల్లో తిష్ఠవేసి ఉన్న కేసులను ఇటీవల చూస్తున్నాం. కారణం కనుగొనేలోపే దాని బారినపడి 50ఏళ్ల వయస్కులు ఇద్దరు చనిపోయారు కూడా. తర్వాత కొన్ని అంతర్జాతీయ అధ్యయనాల్లో ఈ అంశంపై కొత్త విషయాలు వెలుగుచూశాయి. కొందరిలో 4-6 నెలలకు పైగా కూడా వైరస్ శరీరంలోనే ఉంటుందని వెల్లడైంది. శరీరంలో అంతర్లీనంగా వైరస్ ఉత్పరివర్తనం జరుగుతున్నా.. నెలల తరబడి తెలియకుండా ఉంటుంది. ప్రత్యేకంగా కీమోథెరపీ ఇచ్చిన వారిలో ఇలా జరిగే అవకాశం అధికం. వీరిలో కొత్త వేరియంట్లూ ఉత్పత్తి కావచ్చు. అవి వీరి ద్వారా ఇతరులకు వ్యాపించకుండా ఉండాలంటే.. లక్షణాలున్నప్పుడు కచ్చితంగా మాస్కు ధరించాలి. కొవిడ్ వచ్చి తగ్గాక కూడా నిరంతరాయంగా జ్వరం రావడం, దగ్గు, నిమోనియా వంటి లక్షణాలుంటే.. కరోనా వైరస్ ఒంట్లోనే ఉందేమోనని అనుమానించాలి. తప్పక వైద్యుడిని కలవాలి. ఇతర వ్యాధులేమీ లేవని నిర్ధారించుకున్నాక రెమ్డెసివిర్ ఇంజక్షన్ తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం