నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరం సమీపంలో ఉంది. దీనికి అనుబంధంగా గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది.

Updated : 05 Oct 2022 05:58 IST

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరం సమీపంలో ఉంది. దీనికి అనుబంధంగా గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. అల్పపీడనం ప్రాంతం నుంచి కోస్తాంధ్ర, ఒడిశాల మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వరకూ గాలులలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో బుధ, గురువారాల్లో తెలంగాణలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఏడూళ్ల బయ్యారం(భద్రాద్రి జిల్లా)లో 3.3, నెన్నెల(మంచిర్యాల)లో సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా నాలుగైదు డిగ్రీల వరకూ తక్కువగా ఉన్నందున వాతావరణం చల్లగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని