ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగం భూసేకరణకు నిధులివ్వండి
ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం భూసేకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
రాష్ట్రానికి జాతీయ రహదారుల సంస్థ లేఖ
సుమారు రూ.3 వేల కోట్ల వ్యయాన్ని చెరిసగం భరించనున్న కేంద్రం-రాష్ట్రం
ఈనాడు, హైదరాబాద్: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం భూసేకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించేందుకు అంగీకరించిన నేపథ్యంలో ఉత్తర భాగంలో భూసేకరణకు రాష్ట్ర వాటాను విడుదల చేయాల్సిందిగా కేంద్ర జాతీయ రహదారుల సంస్థ తాజాగా లేఖ రాసింది. మొత్తం 340 కిలోమీటర్ల ప్రాంతీయ రింగు రోడ్డులో 158.60 కిలోమీటర్ల మేర ఉండే ఉత్తర భాగాన్ని సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- జగదేవ్పూర్- భువనగిరి- చౌటుప్పల్ వరకు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 4,851 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందుకు రూ.3 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అధికారుల అంచనా. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.1,500 కోట్లు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ఆర్ఆర్ఆర్ భూసేకరణకు ప్రత్యేక పద్దు ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించారు. మరో రూ.1,000 కోట్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. రహదారి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఉత్తర భాగం నిర్మాణానికి రూ.6,500 కోట్ల వరకు అవుతుందని అంచనా.
పరిహారం చెల్లింపునకు 2-3 నెలలు
భూసేకరణకు వీలుగా కొన్ని ప్రాంతాల్లో భూ యజమానులకు నోటీసులు జారీచేశారు. అభ్యంతరాల స్వీకరణ గడువు పూర్తయింది. వాటి పరిశీలన పూర్తి కాగానే ఆయా యజమానులకు తుది నోటీసు జారీచేస్తారు. పరిహారం నిర్ణయించి.. చెల్లించేందుకు రెండు మూడు నెలలకుపైగా సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
85 హెక్టార్ల అటవీ భూమి..
నర్సాపూర్, గజ్వేల్ రిజర్వు ఫారెస్టుల మీదుగా వెళ్లే ఈ రహదారి నిర్మాణానికి 85 హెక్టార్ల అటవీ భూమిని సేకరించాల్సి ఉంది. ఈ రెండు ప్రాంతాల్లో అరుదైన వన్యప్రాణుల సంచారం పెద్దగా లేదని అధికారులు గుర్తించారు. ఈ భూములను డీ-నోటిఫై చేసేందుకు రాష్ట్ర అటవీశాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికి 4-5 నెలలు పడుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణ 6-7 నెలల్లో కొలిక్కి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ భాగం రహదారి నిర్మాణానికి నిర్వహిస్తున్న మార్గ సర్వే ఈ నెలాఖరుకు పూర్తికానుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్-1 పరిధిలో ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్